మన సమాజంలో అతి పెరిగిపోతుందా?
అవును. ప్రతీదాన్నీ రాజకీయం అంశం చేసి, దానిలో స్వలాభాల్ని వెనుకేసుకోవడానికి చేసే కుప్రయత్నాల్ని చూస్తుంటే, అతి విపరీతంగా పెరిగిపోయినట్టే వుంది. పుష్కరాల్నే తీసుకుందాం. పుష్కరాలు ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒద్దన్నా ఒస్తాయి. ఆ పుష్కరుడిని తామే పిలిచి ఆహ్వానించినట్టు చెప్పుకోవడం అతి. చంద్రబాబు ఒకింత అడుగు ముందుకేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇత్యాది ప్రముఖులను పుష్కరాలకు రండని ఆహ్వానించటం. రాజకీయనాయకులు ఇటువంటి ఉత్సవాలకు ఫెసిలిటేటర్ లుగా ఉండాలి తప్ప, తామే ఉత్సవాలని జరపాలి అనుకోవడం అతే మరి. వేల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నాం అని లోకల్ పోలీసు అధికారులు మనకు భరోసా ఇచ్చేలా మాట్లాడతారు అణుకుంటాం, కానీ ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రే చెబుతాడు. భారీ సినిమా సెట్టింగులు వేయడం, దానికి సినిమా దర్శకుల సహాయం తీసుకోవడం, అక్కడ ఇచ్చే హారతి స్టేజి నాటకాన్ని తలపించేలా సాగటం, దానినే మీడియా అత్యద్బుతమంటూ చూపటం, మనం చూసి ఆహా ఓహో అనటం, ఎక్కడా అతి తగ్గకుండా సాగుతోందనిపిస్తుంది. ఏది చేసినా ప్రభుత్వమే చేస్తోందని చెప్పుకోవటం, చూపుకోవటం ఈ అతికి కారణం. పుష్కరాలకు వెల్లే దారిలో భారీ భారీ ఫ్లెక్సీలు, ఎక్కడా ఒక్కచోటకూడా కృష్ణమ్మ బొమ్మగానీ, కృష్ణానది మీద కవులు రాసిన కవిత్వంగానీ కనిపించదు. కేసీఆర్ బొమ్మనో చంద్రబాబు బొమ్మనో వేసి కింద పేరూ ఊరు తెలియని పది తలకాయలు కనిపిస్తుంటాయి. వీరంతా ఆ ఫ్లెక్సీలను తయారు చేయించిన వారన్నమాట. కేసీఆర్ లేదా చంద్రబాబు ఆ ప్రదేశం గుండా పోతే తమ తలకాయలు చూస్తారనే బోడి ఆలోచనా ఫలితం ఇది. వేగంగా దూసుకెల్లే కాన్వాయ్ల్లోంచి తలకాయ బయటకు పెట్టి ఈ బోడి తలకాయలను ఆ ముఖ్యమంత్రులు చూస్తారనుకుంటారో ఏమో.
గోదావరి పుష్కరాలపుడు ఒకామె ఏకంగా స్నానంకోసం రాలేదు, మా చంద్రబాబు చేసిన ఏర్పాట్లు చూసి మురిసిపోదామని ఒచ్చామని చెప్పుకుంది. ఎంత డబ్బులిచ్చి చెప్పిచ్చుకున్నారో మనం ఊహించవచ్చు. ఇక అతి వాగుడు ప్రవచనకర్తలు గోదావరి పుష్కరాలపుడు చేసిన అతి తెలియంది కాదు. ముప్పై మంది వీరి అతి కి బలైపోయినా, సిగ్గులేకుండా ఇంకా ప్రవచనాలంటూ జనాలని సావగొట్టడం వారి లేకితనానికి పరాకాష్ట. కాకపోతే ఈసారి కాస్త బుద్ధి వచ్చినట్టుంది, కృష్ణా పుష్కరాలమీద ఎక్కడా కించిత్తు సుత్తినీ వేసినట్టు లేరు. ఒచ్చే సంవత్సరం తుంగభద్రా పుష్కరాలు మరి, ఏం వాగుతారో చూడాలి, ఈ సిగ్గు అప్పటికి కాస్త తగ్గి ఉంటుంది కదా..
ఇక రియో ఒలంపిక్స్. వందకోట్లమందిలో రెండు పతకాలొచ్చాయి. దానికి జనాలంతగా ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కాదు. సెమీ ఫైనల్లో సింధు గెలిచింది. ఫైనల్లో గెలవాలని పూజలు వ్రతాలు చేయడం ఏంటిది?. ఏమి అతి అనుకోవాలి దీన్ని?. ఆటను ఆటలాగా చూడలేని దుర్బలత్వమే ఇది. ఎన్నో అంశాలు అనుకూలిస్తే తప్ప ఇటువంటి టఫ్ ఫైనల్లో గెలవటం సాధ్యంకాదు. సింధూ ఫైనల్లో గెలవాలి అనుకోవడం, కోరుకోవడం వరకు బాగానే ఉంది, దానికి పూజలు, ర్యాలీలు చేయడమేంటిది?. ఒకవేల ఫైనల్లో గెలిచి ఉండింటే, బాణా సంచాలు కాల్వటం, వీధుల్లో అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా బైక్ ల మీద భారత్ మాతాకీ జై అని ర్యాలీలు తీయడమూ, ఇదంతా ఆనందం అనుకోవాలనుకోలటం కూడా అతే. ఒలంపిక్స్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఒకటి రెండింటిలో పతకాలు వస్తే మనమే ఇలా వుంటే, చాలా విభాగాల్లో పతకాలు సాధించే అమెరికా చైనాలు ఇంకెలా వుండాలి. కానీ ఆ దేశాలకు మనకుండేంత అతి లేదు. ఇక సింధూకు పతకం రాగానే ప్రెస్ మీట్ పెట్టి "ఆనందంగా ఉంది, నేను కట్టించిన స్టేడియంలో ఆమె ప్రాక్టీస్ చేయడం వల్లే" అని చంద్రబాబు. సిగ్గనిపించదేమో అలా మాట్లాడటానికి. ఆయన మూడు కోట్లు ప్రకటించగానే, కేసీఆర్ రెండాకులు ఎక్కువ తిని ఐదు కోట్లిస్తానంటాడు. అరే.. మీకు క్రీడలంటే అంత అభిమానం ఉంటే ఇయ్యుర్రి భయ్...ఈ ప్రెస్ మీట్ లేంది. అంతిచ్చినం, ఇంత పొడ్చినం అని చెప్పుడేంది?. రేపు సింధూ హైదరాబాదుకు వస్తే, భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు తెలంగాణా ప్రభుత్వ ఏర్పాట్లంట. సిగ్గేమన్నా ఉన్నదా జన్మలకు. అక్కడ సింధూ బంధువులుగానీ, ప్రాణ స్నేహితులుగానీ, అకాడెమీలోని తోటి ఆటగాల్లుగానీ కనిపించరు. అంతా రాజకీయ ప్రముఖులే. ఇంకెందుకు ఈ స్వాగత సన్నాహాలు?. స్వయంగా,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకడానికి పోయినా ఆశ్చర్య పడనక్కర లేదు. రాజకీయ లబ్దికోసం కాక ఇంక దేనికి పనికొస్తాయివి?. సింపుల్ గా ఉండలేకపోవటం ఎంతటి దౌర్భాగ్యం కదా.
ఇపుడు మనమంతా సింధూ ఏ కులం, ఏ ప్రాంతం అని చూసే పనిలో పడ్డాం. 'మా వాళ్ళే' అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా అని సిగ్గువదిలి కష్ట పడిపోతున్నాం. సింధూ ముమ్మాటికీ ఆంధ్రా అమ్మాయే అని ఒకడు పోస్ట్ పెడతాడు, అదో గొప్ప రీసెర్చి చేసి కనుక్కున్న విషయంలాగా. బోనాలాడింది సింధూ, మా అమ్మాయే అని మరో తెలంగాణా రీసెర్చ్ స్కాలర్ బయలుదేరుతాడు. మా కులం అమ్మాయే మా కుల తేజం, కుల దైవం అని ఇంకొకడు. ఇప్పటికిప్పుడు తమ కులం, జాతి గుర్తుకొచ్చి ఊగిపోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని విషయాలివి.
పుష్కరాలయినా, ఒలంపిక్స్ లో మన దేశం రెండు పతకాలు సాధించినా, మన రాజకీయ లబ్దికి ఇవి పనికొస్తాయా లేదా అన్నది ముఖ్యంగా మారిందిపుడు. ప్రజలింకా వెర్రి వెంగలప్పలే. శాస్త్రాలు ఘోషిస్తున్నాయని పనికి మాలిన విషయాల్ని చవట ప్రవచనకారులు చెప్పేదంతా విని నమ్మేవరకూ..ఫైనల్ లో గెలవాలని పూజలు వ్రతాలూ చేసే వరకూ, ప్రజల వెంగలాయిత్వాన్ని వాడుకునే రాజకీయనాయకులుంటూనే ఉంటారు. అతి కొనసాగుతూనే ఉంటుంది...
అవును. ప్రతీదాన్నీ రాజకీయం అంశం చేసి, దానిలో స్వలాభాల్ని వెనుకేసుకోవడానికి చేసే కుప్రయత్నాల్ని చూస్తుంటే, అతి విపరీతంగా పెరిగిపోయినట్టే వుంది. పుష్కరాల్నే తీసుకుందాం. పుష్కరాలు ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒద్దన్నా ఒస్తాయి. ఆ పుష్కరుడిని తామే పిలిచి ఆహ్వానించినట్టు చెప్పుకోవడం అతి. చంద్రబాబు ఒకింత అడుగు ముందుకేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇత్యాది ప్రముఖులను పుష్కరాలకు రండని ఆహ్వానించటం. రాజకీయనాయకులు ఇటువంటి ఉత్సవాలకు ఫెసిలిటేటర్ లుగా ఉండాలి తప్ప, తామే ఉత్సవాలని జరపాలి అనుకోవడం అతే మరి. వేల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నాం అని లోకల్ పోలీసు అధికారులు మనకు భరోసా ఇచ్చేలా మాట్లాడతారు అణుకుంటాం, కానీ ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రే చెబుతాడు. భారీ సినిమా సెట్టింగులు వేయడం, దానికి సినిమా దర్శకుల సహాయం తీసుకోవడం, అక్కడ ఇచ్చే హారతి స్టేజి నాటకాన్ని తలపించేలా సాగటం, దానినే మీడియా అత్యద్బుతమంటూ చూపటం, మనం చూసి ఆహా ఓహో అనటం, ఎక్కడా అతి తగ్గకుండా సాగుతోందనిపిస్తుంది. ఏది చేసినా ప్రభుత్వమే చేస్తోందని చెప్పుకోవటం, చూపుకోవటం ఈ అతికి కారణం. పుష్కరాలకు వెల్లే దారిలో భారీ భారీ ఫ్లెక్సీలు, ఎక్కడా ఒక్కచోటకూడా కృష్ణమ్మ బొమ్మగానీ, కృష్ణానది మీద కవులు రాసిన కవిత్వంగానీ కనిపించదు. కేసీఆర్ బొమ్మనో చంద్రబాబు బొమ్మనో వేసి కింద పేరూ ఊరు తెలియని పది తలకాయలు కనిపిస్తుంటాయి. వీరంతా ఆ ఫ్లెక్సీలను తయారు చేయించిన వారన్నమాట. కేసీఆర్ లేదా చంద్రబాబు ఆ ప్రదేశం గుండా పోతే తమ తలకాయలు చూస్తారనే బోడి ఆలోచనా ఫలితం ఇది. వేగంగా దూసుకెల్లే కాన్వాయ్ల్లోంచి తలకాయ బయటకు పెట్టి ఈ బోడి తలకాయలను ఆ ముఖ్యమంత్రులు చూస్తారనుకుంటారో ఏమో.
గోదావరి పుష్కరాలపుడు ఒకామె ఏకంగా స్నానంకోసం రాలేదు, మా చంద్రబాబు చేసిన ఏర్పాట్లు చూసి మురిసిపోదామని ఒచ్చామని చెప్పుకుంది. ఎంత డబ్బులిచ్చి చెప్పిచ్చుకున్నారో మనం ఊహించవచ్చు. ఇక అతి వాగుడు ప్రవచనకర్తలు గోదావరి పుష్కరాలపుడు చేసిన అతి తెలియంది కాదు. ముప్పై మంది వీరి అతి కి బలైపోయినా, సిగ్గులేకుండా ఇంకా ప్రవచనాలంటూ జనాలని సావగొట్టడం వారి లేకితనానికి పరాకాష్ట. కాకపోతే ఈసారి కాస్త బుద్ధి వచ్చినట్టుంది, కృష్ణా పుష్కరాలమీద ఎక్కడా కించిత్తు సుత్తినీ వేసినట్టు లేరు. ఒచ్చే సంవత్సరం తుంగభద్రా పుష్కరాలు మరి, ఏం వాగుతారో చూడాలి, ఈ సిగ్గు అప్పటికి కాస్త తగ్గి ఉంటుంది కదా..
ఇక రియో ఒలంపిక్స్. వందకోట్లమందిలో రెండు పతకాలొచ్చాయి. దానికి జనాలంతగా ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కాదు. సెమీ ఫైనల్లో సింధు గెలిచింది. ఫైనల్లో గెలవాలని పూజలు వ్రతాలు చేయడం ఏంటిది?. ఏమి అతి అనుకోవాలి దీన్ని?. ఆటను ఆటలాగా చూడలేని దుర్బలత్వమే ఇది. ఎన్నో అంశాలు అనుకూలిస్తే తప్ప ఇటువంటి టఫ్ ఫైనల్లో గెలవటం సాధ్యంకాదు. సింధూ ఫైనల్లో గెలవాలి అనుకోవడం, కోరుకోవడం వరకు బాగానే ఉంది, దానికి పూజలు, ర్యాలీలు చేయడమేంటిది?. ఒకవేల ఫైనల్లో గెలిచి ఉండింటే, బాణా సంచాలు కాల్వటం, వీధుల్లో అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా బైక్ ల మీద భారత్ మాతాకీ జై అని ర్యాలీలు తీయడమూ, ఇదంతా ఆనందం అనుకోవాలనుకోలటం కూడా అతే. ఒలంపిక్స్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఒకటి రెండింటిలో పతకాలు వస్తే మనమే ఇలా వుంటే, చాలా విభాగాల్లో పతకాలు సాధించే అమెరికా చైనాలు ఇంకెలా వుండాలి. కానీ ఆ దేశాలకు మనకుండేంత అతి లేదు. ఇక సింధూకు పతకం రాగానే ప్రెస్ మీట్ పెట్టి "ఆనందంగా ఉంది, నేను కట్టించిన స్టేడియంలో ఆమె ప్రాక్టీస్ చేయడం వల్లే" అని చంద్రబాబు. సిగ్గనిపించదేమో అలా మాట్లాడటానికి. ఆయన మూడు కోట్లు ప్రకటించగానే, కేసీఆర్ రెండాకులు ఎక్కువ తిని ఐదు కోట్లిస్తానంటాడు. అరే.. మీకు క్రీడలంటే అంత అభిమానం ఉంటే ఇయ్యుర్రి భయ్...ఈ ప్రెస్ మీట్ లేంది. అంతిచ్చినం, ఇంత పొడ్చినం అని చెప్పుడేంది?. రేపు సింధూ హైదరాబాదుకు వస్తే, భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు తెలంగాణా ప్రభుత్వ ఏర్పాట్లంట. సిగ్గేమన్నా ఉన్నదా జన్మలకు. అక్కడ సింధూ బంధువులుగానీ, ప్రాణ స్నేహితులుగానీ, అకాడెమీలోని తోటి ఆటగాల్లుగానీ కనిపించరు. అంతా రాజకీయ ప్రముఖులే. ఇంకెందుకు ఈ స్వాగత సన్నాహాలు?. స్వయంగా,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకడానికి పోయినా ఆశ్చర్య పడనక్కర లేదు. రాజకీయ లబ్దికోసం కాక ఇంక దేనికి పనికొస్తాయివి?. సింపుల్ గా ఉండలేకపోవటం ఎంతటి దౌర్భాగ్యం కదా.
ఇపుడు మనమంతా సింధూ ఏ కులం, ఏ ప్రాంతం అని చూసే పనిలో పడ్డాం. 'మా వాళ్ళే' అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా అని సిగ్గువదిలి కష్ట పడిపోతున్నాం. సింధూ ముమ్మాటికీ ఆంధ్రా అమ్మాయే అని ఒకడు పోస్ట్ పెడతాడు, అదో గొప్ప రీసెర్చి చేసి కనుక్కున్న విషయంలాగా. బోనాలాడింది సింధూ, మా అమ్మాయే అని మరో తెలంగాణా రీసెర్చ్ స్కాలర్ బయలుదేరుతాడు. మా కులం అమ్మాయే మా కుల తేజం, కుల దైవం అని ఇంకొకడు. ఇప్పటికిప్పుడు తమ కులం, జాతి గుర్తుకొచ్చి ఊగిపోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని విషయాలివి.
పుష్కరాలయినా, ఒలంపిక్స్ లో మన దేశం రెండు పతకాలు సాధించినా, మన రాజకీయ లబ్దికి ఇవి పనికొస్తాయా లేదా అన్నది ముఖ్యంగా మారిందిపుడు. ప్రజలింకా వెర్రి వెంగలప్పలే. శాస్త్రాలు ఘోషిస్తున్నాయని పనికి మాలిన విషయాల్ని చవట ప్రవచనకారులు చెప్పేదంతా విని నమ్మేవరకూ..ఫైనల్ లో గెలవాలని పూజలు వ్రతాలూ చేసే వరకూ, ప్రజల వెంగలాయిత్వాన్ని వాడుకునే రాజకీయనాయకులుంటూనే ఉంటారు. అతి కొనసాగుతూనే ఉంటుంది...
No comments:
Post a Comment