Sunday, 3 March 2024

Anti knowledge Essay

 Anti - Knowledge..(part 1)  ఇప్పటినుండి నా వాల్ మీద రాయబడే అంశాలపై విజ్ఞులు మంచి అర్థవంతమైన చర్చ చేసుకుంటే బాగుంటుందని సూచన. అంటే సమాజంగా మనం అందరం కలిసి ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఇవి.  ఇంటర్నెట్ సోషల్ మీడియా యుగంలో మన ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ "జ్ఞాన వ్యతిరేకత" (Anti Knowledge). ఏది నిరూపణ కాబడ్డ జ్ఞానమో దానిని వ్యతిరేకించేందుకు సమాయత్తమైతున్న ఒక స్థితి. ఈ స్థితి చరిత్రకు కొత్త కానేకాదు. ప్రతీ యుగంలో ప్రతీకాలంలో శాస్త్రీయ దృక్పథం ఒకరకంగా ఉంటే anti knowledge మరో రకంగా ఉండటం. ఇటువంటి వ్యక్తులు చరిత్రకు కొత్తకాదు. ఈ మన బ్రెయిన్ స్ట్రాం ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా కాదు. కేవలం ఈ వ్యవహారం ఎలా సాగుతూ ఉంటుందో అని మనకు మనం చర్చించుకోవడానికి మాత్రమే.   "భూమి గుండ్రంగా ఉంది" అనేది నిరూపించబడిన జ్ఞానమైతే "లేదు మా మత పుస్తకంలో భూమి బల్లపరుపుగానే ఉంది కాబట్టి భూమి బల్లపరుపుగా ఉంది " అనడం anti -knowledge. మొదట మానవుడు భూమి బల్లపరుపుగానే ఉంది అనుకుని ఉండవచ్చు. కానీ రాను రాను అవగాహన పెరిగేకొద్దీ ఇది గుండ్రంగా ఉంటుందని అర్థమై ఉంటుంది. సైంటిఫిక్ అవగాహన నిరూపణ భూమి గుండ్రంగా ఉంటుందని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఐనా మేం నమ్మం భూమి బల్లపరుపుగానే ఉంది అనేలాంటి ఓ బ్యాచ్ చరిత్రలో ఎప్పటినుండో ఉంది. ఉంటుంది.   ఐతే ఇపుడు ఈ anti knowledge గురించి మరింత ఎక్కువగా చర్చించవలసిన అవసరం వచ్చింది. అందుకు కారణం సమాచార విప్లవం. Anti knowledge నిరూపితమైన సకల సైంటిఫిక్ అంశాలను తప్పని చెప్పే ఒక ప్రయత్నం చేయడంవలన దానిని ఎదుర్కోవడం ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నది వాస్తవం. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత Fact కంటే Fiction కి విలువ పెరిగింది. గత కొన్నిరోజులుగా నేను సోషల్ మీడియాలో గమనిస్తున్న అంశం ఏంటంటే మేధావి వర్గమని అనుకునే వారు కూడా fact నీ fiction నీ వేరు చేసి చూడలేనటువంటి ఒక అత్యైక ప్రమాదకర పరిస్థితి. ఇది సమాజానికి చాలా చెడును కలిగిస్తుంది. అందుకే ఒక చర్చగా మనం దీనిని ఎత్తుకుని ముందుకు సాగాలన్నది నాకున్న అభిప్రాయం.  Anti knowledge జ్ఞానానికి పూర్తిగా విభిన్నమైనది. మనిషికి జ్ఞానం ఒక్క పూటలోనో ఒక్క సంవత్సరంలోనో లేక ఒక్క పుస్తకం చదివేస్తేనో రాదు. సైంటిఫిక్ నిరూపణలు అలా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోవు. సైంటిఫిక్ నిరూపణ కొన్ని ఏళ్ళ పరిశ్రమ. నిప్పు కనుక్కోవడం లేదా రాతి ఆయుధాలు చేసుకోగలగడం ఒక్కరోజులో ఠపీమని జరగలేదు. కొన్ని యుగాల చరిత్ర కొన్ని వేల ఏళ్ళ ఆలోచనలు ఒక్కోదాన్ని మనకు అందిస్తూ పోయాయి. అంటే ఏ జ్ఞానమైనా మనిషికి లేదా సమాజానికి ఠపీమని వచ్చేయదు. వచ్చిన జ్ఞానం ఎస్టాబ్లిష్ కావడానికి, ఆబ్జెక్టివ్ గా నిరూపణ కావడానికి ఇంకెంతో వ్యయప్రయాసలకు గురైతే తప్ప సాధ్యం కాదు.  కానీ గమనించి చూస్తే anti - knowledge దీనికి పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా బయల్దేరి పైన చెప్పిన సైన్సంతా తప్పు. వాళ్ళంతా అబద్దాలు చెప్పేశారు. నేను మాత్రం నిజాలు చెప్పేస్తున్నాను. నేను మాత్రమే చెబుతున్నాను. అని ఎలాంటి వాదప్రతివాదాలు అవసరం లేకుండా సశాస్త్రీయ నిరూపణలు లేకుండా చెప్పడం చూస్తుంటాం. "సైంటిఫిక్ మెథడ్ " అంటే ఏంటో తెలియని కొందరు తమవద్ద నిరూపణలు ఉన్నాయని వ్యక్తిగత అభిప్రాయాలను తిరుగులేని నిరూపణలుగా చెబుతుంటారు. వీటిని ఫిక్షన్ గా మలచగలరు. అద్భుతమైన రసోప్రేతకమైన కథలా రక్తికట్టించగలరు. కానీ అదేదీ fact ఆధారిత నిరూపణ కిందకు రాదు. చెప్పొచ్చేదఘమంటే ఇటువంటి వారు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నారు.   ఎందకింతమంది ఉన్నారు అంటే సమాధానం సింపుల్. 1. కథ లేదా ఫిక్షన్ మనుషులను అబ్బురపరచినట్టు  "నిజం" "జ్ఞానం" అబ్బురపరచదు. కాబట్టి జనసామాన్యంలో మేధావులలో కథలు చెప్పేవారికి ఉన్నంత అప్పీలింగ్ జ్ఞానం చెప్పేవాడికి ఉండదు. 2. సాధారణ మనుషులు దాదాపుగా ఎవరూ సైంటిఫిక్ మెథడ్ ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నవారు కారు. కాబట్టి జ్ఞానం , నిజం అందరి దారీ కాదు. కొందరి దారి మాత్రమే.   ఇన్ని మాటల బదులు ఉదాహరణలతో సాగుదాం. ఈ మధ్య కొందరు వచ్చారు. థైరాయిడ్ మందులు వాడకూడదనీ చాలా అపాయమనీ,అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదనీ ఇది మరీ డేంజర్ అనీ..అయోడైజ్డ్ ఉప్పు వాడటం అంటే కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం అనీ( ఇదో డిఫెండర్ వాదన. దీనిని ముందు ముందు చూద్దాం).  ఒక అద్భుతమైన  రసోద్రేక కథను చెప్పడం మొదలెట్టారు. వాటిని వివరించమనీ నా వాల్ మీద కూడా కొందరు మిత్రులు అడిగారు. ఐతే ఇది కూడా Anti knowledge కి సంబంధించిన విషయం. దీనిని కూడా కథలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కథ భూమి పుట్టినప్పటి నుండి మొదలౌతుంది.ఏ విధంగా ఈ అయోడిన్ అనే విషయం ఎంతటి సైన్సును పరివిధాలుగా తనలో కలుపుకుని ఎస్టాబ్లిష్ అయిందో చూడండి. ఈ విధమైన అవగాహన మనిషికి రావడానికి ఎన్ని సంవత్సరాల కృషి ఉందో గమనించండి.    భూమి ఏర్పడిన క్రమంలో కొన్ని భూభాగాల్లో అయోడిన్ తక్కువగగానూ కొన్ని భాగాల్లో ఎక్కువగాను ఉంది. మన ప్రపంచంలో భూమి పరిణామ క్రమంలో శిలలు ఏర్పడతాయి. Rocks. ఇవి సెడిమెంట్ rocks ,metamorphic rocks అని రెండురకాలు. మన భారతదేశంలో metamorphic rocks ఉన్నాయి. అంటే ఇవి తీవ్రమైన వేడికి ఒత్తిడికి లోను కావడం వలన ఏర్పడిన శిలలు. ఇటువంటి శిలలలో అయోడిన తక్కువగా ఉంటుంది. మరి అంత వేడి వత్తిడి ఎక్కడివి అని అడగవచ్చు. Continental drift దగ్గరికి వెళ్ళాలి. గోండ్వానా అని చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఒక ఖండం ఒకదానికి ఒకటి కలవడంతో పాంజియా అనే పెద్ద ఖండం ఏర్పడింది. ఆ పాంజియా హిందూ మహాసముద్రం లో ఈదుతూ వచ్చి యూరేషియా ప్లేట్ కి ఢీకొనడంతో భారతదేశం ఏర్పడింది. అందుకే మన దేశ శిలలు వేడినుండి ఒత్తిడినుండి పుట్టాయి. అందుకే మన శిలలలో అయోడిన్ తక్కువ. అలాగే మన మట్టిలో కూడా.  ఐతే, ప్రపంచంలో ఇలా శిలలలో మట్టిలో అయోడిన్ తక్కువగా ఉండే దేశాలను గుర్తించారు. ఇండియా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నైజీరియా, ఇండోనేషియా, చైనా , నేపాల్, ఇథియోపియా, మొజాంబిక్, సూడాన్ దేశాలలో మట్టిలో అయోడిన్ తక్కువ. ఈ ప్రదేశాలలో ఎందుకు తక్కువో చెప్పాలంటే పైన చెప్పిన జియోగ్రాఫికల్ కారణాలే కాకుండా వాతావరణ కారణాలూ ఉండవచ్చు. అతి వర్షపాతం నేలలో ఉండే అయోడిన్ని ఊడ్చిపాడేస్తుంది. అలాగే అనావృష్టి వలన నేలలో ఉప్పు శాతం పెరిగి మొక్కలు అయోడన్ ని శోశించలేవు. మన ఉత్తర భారతదేశంలోనూ ఉత్తర తూర్పు రాష్ట్రాలలోనూ క్షార నేలలు ఉన్నాయి. ఎపుడైతే నేలలో అధిక క్షార లక్షణాలు ఉంటాయో ఎక్కువ లవణాలు ఏర్పడి మళ్ళీ అయోడిన్ భరిత లవణాలు మొక్కలు గ్రహించలేనంతగా పెరుగుతాయి. అలాగే నగరీకరణలో భాగంగా అడవులను కూల్చడం వలన నేల కోసుకునిపోవడం వలన నేలలో అయోడాన్ తగ్గడం జరుగుతుంది. ఇదంతా చూడండి. దీని వెనుక ఎంత జ్ఞాన ఆధారం ఉందో. ఎంతో పరిశోధనలు ఎన్నో శాఖలనుండి చేయగా తేలినది ఏమి?. ప్రపంచంలోని కొన్ని దేశాల నేలలలో అయోడిన్ తక్కువగా ఉందని. అయోడిన్ మనిషికి ఎలా ఉపయోగం. అయోడిన్ థైరాయిడ్ గ్రంధి పనితీరును సక్రమంగా చేసే ఒక మినరల్. థైరాయిడ్ గ్రంధి మనిషి మెదడును నరాలనూ ఎదుగుదల నూ నియంత్రించే ఒక ముఖ్యమైన గ్రంధి.   అయోడిన్ నేలలో లేకపోతే ఏమౌతుంది..మనం తినే మొక్కలలో అయోడిన్ ఉండదు. తద్వారా మనిషిలో కూడా తగ్గుతుంది.. ప్రెగ్నెన్సీ లో సరైన అయోడిన్ లేకపోతే పుట్టే బిడ్డలో మెదడు ఎదుగుదల ఆగిపోతుంది. నరాల ఎదుగుదల ఆగిపోతుంది. ఫలితంగా సరైన బిడ్డలు పుట్టకపోవడం లేదా అంగవైకల్యం తో పుట్టడం లేదా అబార్షన్ జరగడం. పుట్టిన పిల్లలు చెవిటివారిగా మూగవారిగా  శారీరక ఎదుగుదల లేక మెంటల్లీ రిటార్డెడ్  గా పుట్టడం జరిగుతుంది. నేలలో అయోడిన్ అనే చిన్న మూలకం మనిషి పుట్టుకను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఇదంతా ఎస్టాబ్లిష్ అయిన సైన్సు. ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా జియాలజీనుండి, అగ్రికల్చర్  నుండి, పర్యావరణ శాస్త్రం నుండి, వైద్య శాస్త్ర విభాగంనుండి అందిన ఇంతటి సమాచారం ఆధారంగా మనకు ఈ విషయం ఎస్టాబ్లిష్ అయింది. యేళ్ళ తరబడి కృషితో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చింది. అందుకే 1960s లో ఇండియన్ గవర్నమెంట్ UNICEF సహాయంతో భారతదేశంలో పుట్టే పిల్లలు శారీరక మానసిక బలహీనులుగా పుట్టకూడదని ఒక సంకల్పంతో ఒక కమిటీ వేసి National Goitre Control Program అని 1962 లో మొదలుపెట్టింది. 1983 లో దానిని విస్తరించి National Iodine Deficiency Disorders Control Program (NIDDCP)అని ఉప్పుని అయోడైజ్డ్ చేయడం వలన విస్తృత ప్రయోజనాలున్నాయని రికమండేషన్ చేసి దీనిని ఒక నేషనల్ ప్రోగ్రాంగా చేపట్టింది. విస్తృతమైన అధ్యయనాలు పైలట్ స్టడీస్ దీనిని నిరూపించాయి. 1992 లో prevention of food adultration act తో ఇది కంపల్సరీ చేసింది. దీనితో దేశమంతటా అయోడైజ్డ్ ఉప్పు దొరకడం మొదలైంది. అయోడిన్ తక్కువ తో రాగల సకల జబ్బులనూ ఈ చిన్న పని చాలా సమర్థవంతంగా ఆపగలిగింది.ఇటువంటి ప్రోగ్రాంలు పైన చెప్పినటువంటి దేశాలలో కూడా అటునిటుగా ఉన్నాయి. అడవుల నరికివేత పెరిగా.భూసారం తగ్గుతున్న దేశాలు కూడా ఈ పద్ధతులను పాటించి తమ దేశ పిల్లలు cretinism బారిన పడకుండా ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటూనే ఉంటారు.  చూడండి . ఒక జ్ఞానం నిరూపితమై ఎస్టాబ్లిష్ కాబడి ప్రజలలోకి వచ్చేందుకు ఎంతసమయం ఎంత అధ్యయనం జరిగిందో!. కానీ అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చేసి తన సొంత  అభిప్రాయాలను తెలుపుతూ అసలు అయోడైజ్డ్ ఉప్పు వాడటం డేంజర్ అని మొదలుపెట్టాడనుకోండి. ఇతడు జ్ఞాన వ్యతిరేకి. ఇతడిని నమ్మి జ్ఞానవ్యతిరేకతను విస్తృతం చేసేవారు ఏ మాత్రం ఆలోచించలేని సైంటిఫిక్ అవగాహన లేనివారిగా మనం పరిగణించవలసి ఉంటుంది.  విరించి విరివింటి

No comments:

Post a Comment