ఆయనొక కవి, పెయింటర్, ఫోటోగ్రాఫర్. గ్రామాల్నీ, ట్రైబల్ ప్రదేశాల్నీ, అడవుల్నీ తన విస్తృత పర్యటనల ద్వారా ఆత్మీకరించుకుని, ఆ ఆత్మని ఈ కళల ద్వారా వ్యక్తపరుస్తూంటారు. ఒక ఎన్విర్న్మెంటలిస్ట్ గా దేశ దేశాల సంస్థలతో సంబంధాలు నెరపుతూ, ప్రకృతిలోని సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ అయన తనను తాను సిటీలో నివసించే ఒక సహజమైన వ్యక్తిగా మలచుకున్నారు. ఆయన ప్రకృతి ఆరాధన ఎంతటిదో ఆయన కవితలనే చదవనవసరం లేదు, ఆయన ఇంటిని చూసినా చాలు. తన కలలంటే ఎంతటి ఇష్టమో, గ్రామీణ జీవితమన్నా, స్వచ్ఛమైన ఆ మట్టి మనుషులన్నా ఆయనకు అంతే ఇష్టం. "20 మెమోయిర్స్" పేరిట హైదరాబాదులోని గోథే సెంటర్ లో మొదటి సారి తను గీసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు 'శ్రీ సత్య శ్రీనివాస్' గారు. తను జీవితంలో చూసిన ఎందరో గ్రామీణ అమ్మలను బొమ్మలుగా గీసి ప్రదర్శించారు. అమ్మలనే ఎందుకు గీశాడో తెలుసుకుందామని అనిపించింది. ఒక సాయంత్రం పూట, ప్రశాంతమైన వాతావరణంలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచిన గోథే సెంటర్ లోనే, ఆ అమ్మల చిత్రాల మధ్యనే ఈ మా సంభాషణ సాగింది. కళలకు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ, ఒక కళాకారుడిగా తన అంతరంగాన్ని కూడా ప్రదర్శనకు నిలిపినట్టుగా అనిపించింది ఆయనతో మాట్లాడుతుంటే. సత్య శ్రీనివాస్ గారికీ నాకూ మధ్య సాగిన ఆ సంభాషణలే "The Voice of Colours" గా మీ ముందుకు తెస్తున్నాను.
Virinchi Virivinti
Virinchi Virivinti
No comments:
Post a Comment