Friday, 2 October 2015

ఫేస్ బుక్ సరదాలు. (Part 3)
...............................................
పార్ట్ టూ లోని వేషాల్రావు ని గురించి చదివిన పార్ట్ వన్ లోని గుడ్డు అమ్మాయి ఒకామె నిన్న నాతో మాట్లాడింది. ఆ అమ్మాయి మా బంధువులమ్మాయి. అయితే ట్విస్ట్ ఏమంటే ఈ 'గుడ్డు అమ్మాయి' కావాలనే 'గుడ్డు పోస్ట్లను' పెడుతూ  ఉంటుందట. ఇలాంటి వేషాల్రావుల కామెడీలు చూసి తెగ నవ్వుకోవటానికి. వారి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కామెంటులపుడు ఒక్కోరు ఒక్కో ఐడియా ఇచ్చి ఈ వేషాల్రావుల ఓ..తెగ ఇదై పోవటాన్ని, వాళ్ళ తింగిరితనాన్ని చూసి కడుపుబ్బ నవ్వుకుంటుంటారట. హమ్మయ్య తెలుగోడికి హాస్య ప్రియత్వం చావలేదని భరోసా ఒచ్చేసింది.

ఇక, వేషాల్రావు కవితల్రావు వేషం కట్టాడు. చెప్పాకదా, మనోడికి కవితల్రావు. అయినా కవితల్రావవతారం ఎత్తాడు. కారణాలు రెండు. ఎంత కాలమని గుడ్ మార్నింగులతో గుడ్ నైట్లతో గూడు పుఠానీ నడపగలడు. హి మస్ట్ డూ సంథింగ్ నో..ఇక రెండవది తన ఫ్రెండులిస్ట్ లో ఉండే కవితల్రాయుడు అనేవాడు కవితలతో అదరగొడుతుంటే..కింద కామెంట్ లలో లేడీ ఫాలోవర్స్ అదుర్స్ అంటుంటే..మనోడు బెదుర్స్ ఐపోతున్నాడు.జెలసీ తన్నుకొస్తుంది. ఎలాగోలా వన్ ఫైన్ మార్నింగ్ డిసైడ్ అయిపోయాడు. కవితలను అదరగొట్టాలని.

ఇంతలో ఓ గుడ్డు అమ్మాయి గుడ్ మార్నింగ్ పోస్ట్ తో పాటు, ఓ కవిత రాసేసింది. "నిశి వంచిన విల్లంబులో పదనిసల కోలహలపు ప్రచ్ఛన్న కరుణాలయం, విద్వత్ మహోగ్రధ వింజామరల సమయంలో బూటకపు బెల్లపు పాకపు బలిస్థానం, వారుణి పీడిత బృహత్ తాడిత పద ఘట్టనలో చామంతి పూవుల చకోర పిండి పదార్థం, గజ రజనీ సమోజ్జ్వల విశ్వాఖిల ఝంఝామారుత ఉల్లి గడ్డల పద కోణం". అని రాసింది. మనోడికి అర్థం కాలే. బెల్లం, ఉల్లి గడ్డ తప్ప. ఇంత అద్భుతమైన కవిత్వమా అని నోరెల్ల బెట్టాడు. ఇందుకు తగ్గ కవితనే పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఇంతలో ఒకడు కామెంటాడు. "ఇది మేడం కావాల్సింది. ఇది. మీరు కేకో కేక మాడం. ఇట్లా అడిగేటోల్లే కావాలి ఈ దేశానికి. లేకుంటే సామాన్య మానవునికి అందకుండా ఉల్లిగడ్దల ధరలు పెంచేస్తే ఎలా మేడం. ఏం చేస్తున్నాయీ ప్రభుత్వాలు. ఇక మారరా..థూ తుచ్చపు రాజకీయనాయకులు. మీ సామాజిక స్పృహ నాకు చాలా నచ్చింది మేడం. మీ కవితలు నాలో స్పూర్తిని రగిలిస్తున్నాయి. ఎప్పటినుంచో నేను మీ కవితల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్యూ."  అని ఆకాశానికి ఎత్తేసాడు అనే బదులు, ఆకాశంలోకి వాడే  ఎగిరి దూకాడు అనుకోవచ్చు.  పొరపాటున అటుగా ఏ రాజకీయ నాయకుడు పోతుండినా ఈ కవిత ఇచ్చిన స్పూర్తితో ముఖం మీద ఉమ్మించినా ఉమ్మిస్తాడు. మన వేషాల్రావుకి వొళ్ళు మండిది. మాటర్ అయితే క్లియర్. ఉల్లి గడ్డల మీద రాసిందన్న మాట. ఇంతకు మించిన జంబలహా కవిత రాసి కామెంటులో పెట్టాలని డిసైడ్ అయ్యాడు. సామాజిక స్పృహ ఉట్టిపడేలా ఉండాలనుకున్నాడు. బాగా థింకాడు. చివరికి తట్టింది. "పల్లం వైపు నీరు, పట్టాల వైపు రైలు, ఆకాశం వైపు ఉల్లిగడ్డలు, ఆవేశం వైపు రాజకీయ నాయకులు, నీ వైపు నేను, నా లైఫు నీవు. గుడ్ మార్నింగ్ మాడం" అని రాసేశాడు.

చూస్తూ ఉన్నాడు నిముషానికోసారి. ఇక ఫ్లాట్ అనుకున్నాడు. ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వలే. ఇంతకు ముందు కామెంటిన వీరుడికి "థ్యాంక్యూ సో మచ్ అండీ..నా కవిత మీకు నచ్చినందుకు, చాలా చాలా థ్యాంక్స్. యూ మేడ్ మై డే". అని రిప్లై ఇచ్చింది. వేషాల్రావుకి జలసీ నషాళానికెక్కింది. తన కవితకి రెస్పాన్స్ రాలేదు. ఇక కామెంటాడు. "ఉల్లి గడ్డలేంటండీ ఉల్లి గడ్డలు. ఎంత సేపూ రాజకీయ నాయకులని ఆడి పోసుకోవవటమేనా..?మనం ఉల్లిగడ్డలు వాడటం తగ్గించాలి. అప్పుడే వాటి ధరలు తగ్గుతాయి. ఈ రోజు నుంచి మనం ఉల్లి గడ్డలు నెల పాటు వాడకూడదని ఒట్టేసుకుందాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండీ, ఏమంటారు?" అని. "వావావావావ్. ఆసం ఐడియా. యూ మేడ్ మైడే" అని రిప్లై ఇచ్చింది. ఎంత మంది డే చేస్తారో. ఆ తరువాత మనోడి కవితకీ లైకింది. ఉత్తర కుమారుడి చరిత్ర తంతే బూరెల గంపలో పడ్డట్టు ఇన్ బాక్స్ కి వచ్చింది. హాహాహాహాయ్య్య్య్య్.

No comments:

Post a Comment