అమరావతి శంకుస్థాపన హైలైట్స్.
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.
*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.
*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.
*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.
*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.
*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.
*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.
*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.
*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.
*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.
*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.
*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.
*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.
*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.
*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.
*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.
*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.
*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.
*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.
*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.
*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..
No comments:
Post a Comment