అవశేషాంధ్రలో అమరావతి..తెలంగాణైట్ వ్యూ
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.
ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.
ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.
ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.
ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.
No comments:
Post a Comment