Sunday, 27 November 2016

భూమి పాటll మైఖేల్ జాక్సన్
-----------------------------------------

సూర్యోదయం గురించి ఏమడుగుదాం
వర్షం గురించి ఏమడుగుదాం
నీవు నేనూ కలిసి పొందుదామనుకున్న
వాటన్నింటి గురించీ ఏమడుగుదాం..

మనుషుల మారణహోమాల గురించి ఏమడుగుదాం
మనకసల౦త సమయముందా..?
నీదీ నాదీ మనిద్దరివే అన్నావుగా
వాటన్నిటి గురించీ ఏమడుగుదాం...

ఎపుడైనా ఆగి చూశావా
ఇప్పటిదాకా మనం పారించిన రక్తాన్ని
నీవెపుడైనా ఆగి గమనించావా
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

మనమేం చేశాం ఈ ప్రపంచానికి..
మళ్లొకసారి చూడు మనమేం చేశామో
మన వారసులకోసం మనం చేసిన
శాంతి ప్రతిజ్ఞ ఊసెక్కడ?
పుష్పించే వనాలెక్కడ
మనకసలు సమయమేదైనా మిగిలుందా?
నీది నాదీ మన ఇద్దరివీ అనుకున్న
ఆ కలలన్నీ ఎక్కడ..?

ఎపుడైనా ఆగి చూశావా..?
యుద్ధంలో అసువులు బాసిన పసిపిల్లల్ని..
నీవెపుడైనా ఆగి గమనించావా ..?
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

నేనొకప్పుడు కలగనేవాన్ని
నక్షత్రాల అవతలివైపుకొకసారి పరికించేవాన్ని
ఇపుడు నేనెక్కడున్నానో నాకే తెలియడం లేదు
ఎక్కడికో దూరానికి విసిరివేయబడ్డానని తప్ప

ఓ మిత్రుడా..
నిన్నటి గురించిన మాటేమిటి?.
సముద్రాల గురించిన మాటేమిటి?.
స్వర్గాలు కూలిపోతున్నాయే..
నా శ్వాస కూడా బరువయ్యిందే..
నీ అవసరం నాకున్నపుడు
ఈ ఉదాసీనత ఎందుకు?

ఈ ప్రకృతి విలువెంత?
ఈ భూమితల్లి గర్భం కదా అది
ఈ జంతువుల మాటేమిటి?
వాటి సామ్రాజ్యాల్నే కూల్చేశాం కదా..
ఆ ఏనుగుల మాటేమిటి?
మనమీద నమ్మకాలెపుడో కోల్పోయాయవి
ఈ దుఃఖించే తిమింగలాల మాటేమిటి
సముద్రాల్ని కొల్లగొట్టేశాం కదనోయ్...
అడవుల్లో మన పాదముద్రల మాటేమిటి?
మొర పెట్టుకున్నా తగలబెట్టేశాం కదా..
ఈ పవిత్ర నేల సంగతేమిటి..?
మతాల పేర్లతో చింపి ముక్కలు చేశాం కదా..
సామాన్య మానవుడి సంగతేమిటి.?
మనమెపుడు వాడికి స్వేచ్ఛనివ్వలేమేమో కదా..
ఈ చనిపోతున్న పసి పిల్లల సంగతేమి.?
ఆ చిట్టి ఏడుపులు మనం వినలేకున్నామా..?

మనమెక్కడో తప్పు చేస్తున్నాం...
ఎందుకో ఎవరైనా చెబుతారా నాకు?

ఇపుడే పుట్టిన చిన్నపిల్లలు
వాళ్ల రాబోయే రోజులు
వాళ్ల కేరింతల మాటేమిటి?.
ఐనా మనిషి గురించి చెప్పవోయ్!!
ఆ తల్లడిల్లే మనిషి గురించి చెప్పు
అబ్రహం గురించి
చివరిగా ఇంకొక్కసారి మరణం గురించీ చెప్పు
మనమసలు ఎపుడైనా ఇంకెప్పుడైనా పట్టించుకుంటామా..?

 translation of Earth song of Michael Jackson
ఈ రోజు వ్యాసం - కొప్పర్తి గారి కవిత 'సుశీల' మీద
కవి సంగమం లో...

జీవన సూత్రాల్లో సిద్ధాంతాలు
-----------------------------------------

మనుషుల జీవన సూత్రాలు కొన్ని సిద్ధాంతాల ఆధారంగా నిర్వచింప బడుతూ, నిరూపించ బడుతూ ఉంటాయి. సిద్ధాంతాల మధ్య విబేధాలు ఎంత సహజమైనా అవి జీవన సూత్రాలను ఒక్కో కొత్త కోణంలోనుండి చూసే, చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏ సిద్ధాంతమూ పూర్తిగా తప్పూ కాదు, అట్లని పూర్తిగా ఒప్పూ కాదు. ఐనప్పటికీ, తమ తమ సిద్ధాంత కోణాలను బలపరుచుకోవటానికై అవి తమ చుట్టూ స్టీరియోటైప్ ఆలోచనలనూ, తద్వారా కొన్ని సామాజిక భ్రమలనూ కూడా పుట్టించడానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించుకుంటాయి. ముఖ్యంగా జెండర్ రోల్స్ ని ఒకటీ రెండు అంశాల ఆధారంగా నిర్వచించాలని ప్రయత్నించినపుడు వాటి చుట్టూ ఎన్నో అపోహలు ఏర్పడటమే కాక, ఒకదానికొకటి వ్యతిరేకించుకుంటున్నట్టు కనబడే ఈ సిద్ధాంతాలు జెండర్ ఇనీక్వాలిటీలనూ, వాటి చుట్టూ ఉండే భ్రమలను శాశ్వతంగా కొనసాగిస్తాయే తప్ప పరిష్కారాలు చూపలేని అశక్తతను మూటకట్టుకుంటాయి. అన్ని సిద్ధాంతాల సంశ్లేషణ (synthesis) జరిగి ఒక సరయిన నిర్ణయానికి రావడానికి ఊపిరాడని పాత సిద్ధాంతాల, అపోహల స్థానంలో, లోతైన అవగాహన, పక్షపాత రహిత అధ్యయనమూ (unbiased research) అవసరం అవుతాయి.

ఫ్యూడల్ సమాజాల నుండి పారిశ్రిమిక సమాజాలకు మారే క్రమంలో కుటుంబంలో స్త్రీ పురుష పాత్రల తీరుతెన్నులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయి. ఈ ఆధునిక సమాజాలు (గత సమాజాలతో పోల్చుకున్నపుడు) స్త్రీ జీవితంలో, ఆమె చేసే శ్రమలో విపరీతమైన మార్పులు తెచ్చి, అదే పురుషుని విషయంలో తక్కువ మార్పులు తెచ్చేసరికి సమాజంలో, కుటుంబంలో స్త్రీల పాత్రమీద చర్చ మొదలయ్యిందని చెప్పాలి. పారిశ్రామిక వ్యవస్థను నిర్వచించే వర్గ బేధం(class variation), స్త్రీ పురుషుల విషయంలో కూడా తీసుకురాబడి, స్త్రీ అస్తిత్వాన్ని పునర్విచించే ప్రయత్నం చేసింది. ఈ మార్పుల పర్యవసానం, 'సమాజం స్త్రీని చిన్న చూపు చూస్తోందనే' అవగాహనను తీసుకువచ్చింది. వేతన ఆధారిత (wage based) సమాజంలో స్త్రీ చేసే శ్రమ ఇంటికి బదులు ఇంటి బయటకు మారింది. పురుషులొక వర్గంగా, స్త్రీలు ఇంకో వర్గంగా ఏర్పడిన సమాజంలో స్త్రీకి బయటి పనులతో పాటు వేతనంలేని ఇంటి లోపలి పనులు, వారానికి దొరికే సగటు ఖాళీ సమయాన్ని ముప్పై ఆరు నుంచి ముప్పై రెండుగంటలకు కుదించి వేశాయి. శ్రమ దోపిడీ జరిగిందనే అవగాహనతో పురుషులు కొత్త పీడకులుగా కనిపించారు. ఈ ఆలోచనలు ఇలా వుంటే, ఇంకో వైపు స్త్రీకుండే మాతృత్వమనే సహజ గుణం స్త్రీని, సమాజంలో ఆమె స్థానాన్నీ, పాత్రనీ నిర్వహిస్తుందనే జీవ శాస్త్ర సంబంధమైన వాదం, స్త్రీని ఇంకో కోణం నుండి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. మరణాల సంఖ్య అధికంగా ఉన్న పూర్వ సమాజాల్లో స్త్రీ, ఆయా సమాజాల్ని బతికించడం (survival of the societies) లో కీలక పాత్ర పోషించింది. సైన్సు అభివృద్ధి చెందని గత శతాబ్దం వరకూ ఈ పరిస్థితే ఉంది. నేటికీ, సగటు జీవిత వయస్సు యాభైకంటే (50 years)  తక్కువగా ఎన్నో సమాజాలల్లో స్త్రీలు ఆయా సమాజాలు అంతరించిపోకుండా నిలబెడుతున్నారు. పిల్లల్ని ఒక ఆస్తిలాగా భావించే ఆ సమాజాల నుండి, మరణాల సంఖ్య తగ్గి, ముసలి వయసు వారు పెరిగిపోతున్న ఈనాటి సమాజాలకు మనం తరలిపోతున్నపుడు, సమాజంలో స్త్రీల పాత్ర ఇంటి కంటే ఇంటి బయటకు పయనమయ్యింది. మన భారతీయ సమాజం, ఈ ట్రాన్సిషన్ జోన్లో కొనసాగుతూ న్నపుడు, మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాలు, భారతీయ స్త్రీని ఏ సిద్ధాంతాలలోకి ఇరికించి నిర్వచింప ప్రయత్నించినా, కవి కొప్పర్తి మాత్రం ఇంకాస్త ముందుకు వెల్లి తన జీవిత భాగస్వామిని ఆమె స్వభావానుకూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.

స్త్రీ ఉద్యోగం చేయాలా, ఇంట్లో చాకిరీ చెయ్యాలా..? ఉద్యోగం చేసొచ్చి ఇంట్లో చాకిరీ కూడా చెయ్యాలా?  అని అడిగినపుడు ఒక్కో సిద్దాంత వాదులొక్కో సమాధానం చెబుతారు, కానీ వీటన్నింటిలో ఆ స్త్రీకి మాత్రమే ఉన్న సహజమైన, ప్రత్యేకమైన స్వభావాన్ని మనం చూడలేనపుడు, ఈ సిద్ధాంతాలు అసంపూర్ణ పరిష్కారాలుగానే మిగిలిపోతాయి. ఇక్కడ కవి ఆమెలో ఉన్న ప్రత్యేకమైన గుణాలను కనుగొంటాడు. ఇది ఆ స్త్రీ మీద సంపూర్ణ అవగాహనను కలిగిస్తుందేగానీ, ఏదో ఒక సిద్ధాంతంలో కూర్చోబెట్టేయదు. ఒకప్పుడు తనకు సహధ్యాయి అయిన ఆమె, ఈ రోజు ఉద్యోగమెందుకు చేయటం లేదు అని అడగడంలో ఆమె ఇష్టానిష్టాలను పట్టించుకోనంత నిర్లక్ష్యం ఎంతుందో..ఆడవారికి ఉద్యోగమెందుకు, ఇంటి పనులు చూసుకోకుండా అనటంలో, ఆమె శ్రమను గుర్తించలేనంత నిర్లక్ష్యం అంతుంది. ఈ రెండు నిర్లక్ష్యాలకూ దూరంగా, ఒక భర్తగా మొదలై, కవితలో చివరకు ఒక మనిషిగా మిగులుతాడు. తన జీవిత భాగస్వామిని భార్యగా గుర్తించటంతో మొదలై చివరకు ఆమె తనను చుట్టుకుని ఉన్న ప్రకృతిగా వర్ణిస్తాడు. సామాజికంగా నెలకొనివున్న స్త్రీ పురుష వివక్షతను ఎక్కడా స్పృశించకుండానే, పరోక్షంగా ఆమె స్థానాన్ని తనకు సమానంగా నిలబెట్టడం ద్వారా, ఆమె ఇష్టానిష్టాల్నీ, ప్రవర్తనా రీతులకూ సంబంధించిన ఆమె సహజ స్వభావానికి పెద్ద పీట వేయడం ద్వారా, ఒక మానవీయ కోణాన్ని అందిస్తారు. అంతే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకోవడం, ఇంట్లో ప్రతీ చిన్న విషయాన్నీ పట్టించుకుని చక్కబెట్టడం, ఇంటి పనుల్లో ఆమె చూపే ఫైన్ మోటార్ డెక్స్టెరిటీని, ఇష్టంగా అలంకరించు కోవడం, వంటి విషయాలను చెబుతూ,  "నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా ఉంటుంది/ ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను"  అనడం ద్వారా సోషియాలజిస్ట్ 'పార్సన్' చెప్పినటువంటి మధ్య తరగతి స్త్రీ పురుషుల వ్యక్తీకరణ/ నిమిత్తమాత్ర సిద్ధాంతాన్ని (expressive/instrumental theory) పునర్ప్రతిష్టిస్తారు.

సుశీల
-------------------------
                      కొప్పర్తి.

ఆమె నా మగ భార్య
నేనామె ఆడ భర్తని
నేనో ఎనబై కేజీల బస్తా
ఆమె అరవై నీలికలువ పూలబస్తా
ఆమె ఇంటి పని చేస్తుంది

నేను ఉద్యోగం చేస్తాను

చరిత్ర  మానవుడు  ప్రపంచము వంటి అంశాల భోధన నా కార్యక్రమం
పిల్లలు  వంటపని. ఇంటిపని  తోటపని  పాకీపని వంటి పనులు   ఆమె  కాలక్షేపం

నాది పెద్ద ప్రపంచం లో చిన్న పాత్ర
ఆమెది చిన్న ప్రపంచం లో పెద్ద పాత్ర

నేను స్థూలం
ఆమె సూక్ష్మం
నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా  ఉంటుంది
ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను

మగ పనులు ఆడపనులు అంటూ వుండవు గాని
కష్టమైన పనులు సులువైన పనులు అంటూ ఉన్నపుడు
మొదటివన్నీ ఆమెవి
రెండోవి మాత్రమే నావి
ఉదాహరణకు
అటక మీద కెక్కవలసి వస్తే
పనికుర్రాడు తను ఉన్నపుడు వాణ్ణెక్కిస్తుంది
మేమిద్దరమూ ఉన్నపుడు తనెక్కుతుంది

బజారుల్లో బస్టాండుల్లో బరువైన వస్తువులు మోస్తూ ముందు నడుస్తుంది
రైల్లో అప్పర్ బెర్త్ ఆమెది
లోయర్ బెర్త్ నాది
ఇద్దరం కలిసి బజారెల్లిన ప్రతిసారి
ఆమె నడుద్దామంటుంది
నేను వాహనం తీస్తాను
బజారులో నడుస్తున్నప్పుడు కూడా
అన్ని పనులు చేసుకుంటూనే నా రక్షనభారం వహిస్తుంది

నేను బయట ఆమె ఇంట్లోనూ ఉన్నపుడు
నేను బయటే ఉంటానుగాని
ఆమె ఏక కాలం లో ఇంట్లోనూ బయట నాతోనూ ఉంటుంది

ఇంటెడు చాకిరి చేస్తుంది
ఇంటిని అద్దంలా ఉంచుతుంది
నిరంతరం చలిస్తూ చరిస్తూ ఉండడం వలన
ఇంట్లోఒకేచోట ఆమెని రెండుసార్లు చూడలేము

శ్రమించినంతసేపూ  అలనటతో చమటతో చిత్తడిగా ఉంటుంది
స్నానం చేసిందంటే వెండిరేకులాంటి
గంజిపెట్టిన చీరలో పరిమళిస్తుంది
కట్టిన చీర చలువను తాజాదనాన్ని  అణువణువుతో ఆస్వాదించడం
ఆమెకి తెలిసినంతగా ఎవరికైనా తెలుసోలేదో తెలీదు

శ్రమ ఆమె తత్వం
విశ్రాంతిలో ఆనందం ఉందనుకునేవాల్లకు
శ్రమలో సౌఖ్యం కోల్పోతామనుకునే వాళ్లకు
ఆమె వ్యతిరేక ఉధాహరన

విల్లులా వంగి ఆమె ఇల్లు తుడుస్తున్నపుడు
మునివేళ్లతో కత్తిపీట మీద కాయగూరలు  తరుగుతున్నపుడు
ఒక అంచునంతా కుచ్చిల్లు పోసి రెండు గుప్పిళ్లమధ్య పట్టుకుని
రెండవ అంచుని
గాల్లోకి ఎగరేసి గింగిరాలు తిప్పుతూ బట్టలు బాదుతున్నపుడు
ఆమెలో
తరతరాలుగా ఈ దేశపు మహిళలు సాధించిన
నేర్పరితనపు వారసత్వం
అందిపుచ్చుకున్న  అద్భుతలాఘవం
ఆవిష్క్రతమైన జీవవిన్యాసం

అది
నిత్యం
సత్యం శివం సుందరం

శ్రమ ఆమె తత్వం
శుభ్రత ఆమె మతం
శుభ్రంగా ఉంచవచ్చనే
ఆమె ఇంటిని వస్తువుల్నీ ఇష్టపడుతుంది
గజం ఎత్తు కరెన్సీ కట్టకావాలా
అంతే ఎత్తున్న కొత్తవస్తువు కావాలా అంటె
నోట్లకట్టని కడిగి తుడవలేము కాబట్టి
వస్తువు కావాలంటుంది

ఒకసారి మంచినీళ్లు తాగిన గ్లాసును
మళ్లీ  బిందెలో ముంచి ఎంగిలి చేయకుండా ఉండడానికి
పెళ్లయిన కొత్తల్లోనే తెలివిగా
వాటర్ ఫిల్టర్ పేరుతో కుళాయి పద్దతి ప్రవేశపెట్టింది
వళ్లు తుడుచుకునే టవల్ తో
అన్నం చేయి తుడుచుకుంటే
టవల్ వెంటనే వైభవం కోల్పోయి
మళ్లీ వుతికిందాకా  జిడ్డుచేయితుడుచుకునే గుడ్డగా  మారిపోతుంది

ఇంట్లో  మసిగుడ్డకు చేతిరుమాలుకు తేడావుండదు
రెండూ తెల్లమబ్బుతునకల్లా తళతళమంటుంటాయి
విడిచిన బట్టను చూసినప్పుడు తననొక విడిచిన బట్టగా భావిస్తుందనుకుంటాను
అందుకే ఉతుకుతున్నంతసేపు తనే శుభ్రపడుతూ ఉంటుంది

పొరుగూరు వెళ్లి తోటకు నీళ్లు పట్టని రోజున
నూటొక్కమొక్కల దప్పికంతా ఒక్కతే గొంతుకెత్తుకుంటుంది
తిరిగివచ్చి తోటకు నీళ్లుపడుతున్నప్పుడు
తానే ఒక నల్లరేగడి నేలగా మారిపోతుంది

వర్షాకాలం  మొక్కలకు నీళ్లుపొయ్యక్కర లేదని
చాలామంది వృక్షప్రేమికులు సైతం సంతోషిస్తారు కాని
వృక్ష ప్రేమిక అయివుండి ఆమె
బట్టలు ఫెళ ఫెళా ఆరవనీ
ఇంటినీ వస్తువుల్నీ చెమరిస్తుందనీ
బయటంతా  బురదగా మురికిగా వుంటుందనీ
వర్షాకాలాన్ని విసుక్కుంటుంది
ముసురు పట్టిన రోజంతా రెక్కలు తెగిన పక్షిలా తప తపా కొట్టుకుంటుంది

ఇల్లు కడిగి కడిగి
బట్టలు ఉతికి ఉతికి
తోటకు నీళ్లు పట్టిపట్టి
నూటనాలుగు అడుగుల లోతుకు తీసిన బోరుపంపు క్రింద
భూమి పొరల్లో ప్రవహించే అంతర్వాహినిని
పదేళ్లలో పీల్చేసి
చుక్క నీరు లేకుండా చేసిన
ఆమెది సతతహరిత పరిశుభ్రదాహం
ఆమె ఒక నిరంతర వేసవి

ఇంటికి తాళంపెట్టి ఊరెల్లాల్సి వచ్చినపుడు
వస్తువుల్ని చిందరవందరగా వదిలేసి వెల్లే
ఆ ఒక్క అవకాశాన్ని చేజేతులా జారవిడిచి
శుభ్రంగా వుంచే అలవాటునే పొదివి పట్టుకుని
వస్తువుల్ని సర్ధి
ఇంటినంతా తడిగుడ్డతో తుడిచాకే తాళం వేస్తుంది
బహుశా ఇంటిని తనతోపాటే తీసుకువెల్తుందని
ఎవరింటికి వెళ్లినా తన చుట్టూ
తన ఇంటినే ప్రతిష్టించుకుంటుందనీ అనుకుంటాను

ఇల్లే ఆమె ప్రపంచం కాబట్టి
ఇంటికి తాళం వేసే ముందులాగే
ప్రపంచానికి తాళం వేసేప్పుడు కూడా
ఇట్లాగే చేస్తుందని నాకు పొడగడుతూ ఉంటుంది

తన అస్తిత్వం తనకెంతో ఇష్టం
ముందు తనను తాను చూసుకుని ప్రేమించురుని
అభినందించుకున్నాకే
ఎవరి వంతయినా వస్తుంది
కాబట్టే  ఎవరితోనూ నిమిత్తం లేకుండా
ఎవరితోనైనా
ఉల్లాసం గా
హల్లీసకమై పోతుంది

చదవడమంటే ఎంతో ఇష్టం
అప్పుడు నా సహ విద్యార్ధి
ఇవాల్టికి నా సహాద్యాయి
ఇంటికి తెచ్చిన పుస్తకం ఇద్దరిదీ
శరత్తూ ప్రేమచందూ
విశ్వనాధ శ్రీ పాద
రాహుల్ రావిశాస్త్రి ఎప్పడో పూర్తయిపోయారు

ఆమె  మధ్యాన్నం న్యూస్‌పేపర్
రెండు పూటలా న్యూస్ చావల్
వారానికొక్కసారి పాడుతా తీయగా
రోజంతా పాడుతూ హాయిగా

ఆడ పిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లోనే నిప్పులు చెరుగుతుంది
నచ్చనిదేదైనా కుండను చేసి బద్దలుకొడుతుంది

ఆమెకు పిట్టలిష్టం  పిల్లలుష్టం
పువ్వులిష్టం  నవ్వులిష్టం
పండ్లిష్టం

ఇంగువ ఇష్టం. సాంభ్రాణి ఇష్టం
కస్తూరీ కర్పూరాలిష్టం
దవనం ఇష్టం
మరువం మాచపత్రి ఇష్టం
అగరు పొగలిష్టం

అన్నింటికి మించి
కొత్తదనం ఇష్టం
కొత్తదనం లోని పరిమళం ఇష్టం

సాయి ఇష్టం
సాయం వేళ దీపారాధన ఇష్టం
సంధ్య సమీరం ఇష్టం
ఆధునికం ఇష్టం
ప్రాచీనం ఇష్టం
చీరలిష్టం
చిన్న చిన్న ఆభరణాలిష్టం
శ్రుతిమించని అలంకరణ ఇష్టం

మన జీవన సూత్రాలు ఏ సిధ్దాంతం లో వున్నాయో కాని
ఆమె మాత్రం మాత్రం
పనిలో వుంది
శుభ్రతలో వుంది
అందంలో ఉంది

మన ప్రాణధాతువులు ప్రాకృతమై ఉన్నాయో లేదో
కాని
ఆమె ప్రాణ రహస్యం మాత్రం
నీళ్లల్లో ఉంది
నిప్పుల్లో ఉంది
ఎండలో ఉంది
నేలలో ఉంది

అవును ఆమె ప్రకృతే
కాబట్టే ఆమెలో
జలప్రళయాలు
ఝంఝామారుతాలు
భూకంపాలు
అగ్ని విస్పోటాలు
పెచ్చరిల్లుతూ ఉంటాయి
నన్ను అతలాకుతలం చేస్తుంటాయి

నిజంగా
ఆమె ప్రకృతి
నేను మానవుణ్ణి

 భ్రూణ హత్యలూ, వరకట్న సమస్యలూ, రాజకీయ ఉద్యోగ వివక్షలూ, స్త్రీ స్వేచ్ఛ వంటి సమస్యల సుడిగుండంలో ఆధునిక మహిళ ఉంటే,  గృహిణి గృహ హింసలో అన్యాయానికి గురవుతున్నది. చదువుకున్న గృహిణులు పెరుగుతున్న మధ్యతరగతి సమాజంలో భార్యాభర్తలిద్దరి మధ్యా అవగాహనా రాహిత్యం లేకపోవటం, మానవీయ కోణంలో విలువలనూ అవసరాలనూ అర్థం చేసుకోవటం ఎంతో అవసరం. ఈ కవిత ఆ దిశగా చేసిన మొదటి ప్రయత్న౦. ఏర్పరచుకున్న పాక్షిక అభిప్రాయాల్ని వాటి చుట్టూ ఉన్న భ్రమల్నీ దాటి లోతుగా కొత్తగా ఆలోచించ వలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

కవిత్వ సందర్భం 29
22-11-16

అద్దంలో మనిషి ll మైఖేల్ జాక్సన్ ll

అద్దంలో మనిషి ll మైఖేల్ జాక్సన్ ll
-------------------------------------------

ఒక్కసారిగా నా జీవితంలో
మార్పు వచ్చెయ్యాలని అనుకుంటాను

ఆ మార్పు ఎంతో హాయి గొల్పాలనీ,
ఎంతో విభిన్నంగా ఉండాలనీ
అన్నింటినీ సవ్యంగా చేసేయ్యాలనీ కోరుకుంటాను

ఒక మంచు కురిసే ఉదయం పూట
నా చలి కోటు కాలర్ ని పైకి లాగినపుడు
చెవిలోకి దూరే గాలి కోరుకునే మార్పే అది.

పసిపిల్లలు వీధుల్లో చేరి
పస్తులు పడుకుంటుంటే..
వారి అవసరాలని పట్టించుకోనంత
గుడ్డి వాడిలా బతికేయటానికి..
నేనెవర్ని?

వాళ్లు కోరుకునేదంతా
తమని పట్టించుకోని వేడి వేసవినీ
మూతమూసిలేని నీళ్ల బాటిల్ నీ
తోడుగా ఒక మనిషి ఆత్మనీ
అంతే కదా!!

వారంతా ఒకరినొకరు అనుసరిస్తూ
అక్కడక్కడే నడుస్తుంటారు
అచ్చం ఈ గాలి లాగే...
ఎందుకంటే ఇంటికి పోవడానికి
దాక్కోవడానికి వాళ్లకు ఏమున్నదని?

అందుకే నేను నిన్ను తెలుసుకోమంటాను
అద్దంలో కనిపించే మనిషితో నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను
ఇంతకు మించిన స్వచ్ఛమైన సందేశమేదీ లేదంటాను
ఈ ప్రపంచం నివాస యోగ్యంగా కావాలంటే
నిన్ను నీవు మొట్టమొదట చూసుకోవాలంటాను
మార్పు నీలోనే రావాలంటాను

ఒప్పుకుంటాను
నేనొక స్వార్థ పూరితమైన ప్రేమ బాధితుడను
కానీ ఇక్కడ కొందరు ఉండడానికి ఇల్లు లేకుండా
నయా పైసా అప్పు పుట్టకుండా ఉన్నారే..
ఇది నేనేనా...
ఈ కొద్దిమంది మాత్రమే ఇలా ఒంటరిగా జీవిస్తున్నారని
నటిస్తున్నది నేనేనా..

లేలేత తొలి చిగురుకు ఐన లోతు గాయం
ఇంకెవరిదో పగిలిపోయిన హౄదయం
ఇంకొక తుడిచిపెట్టుకుపోయిన స్వప్నం
ఇవన్నీ గాలిలాగా తరలిపోతుంటాయి ఎందుకో తెలుసా.?
వాటికుండటానికి ఈ ప్రపంచంలో స్థానమెక్కడని?.
అందుకే నేను నాతో మొదలు పెడతాను
అద్దంలో కనిపించే మనిషితోనే నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను

నీకింకా సమయముంది కాబట్టి
నీవిప్పుడే ఆ పని చేయాలి
హృదయాన్నెపుడో మూసుకున్న నీవు
ఆలోచించే నీ మనసునైతే మూసుకోలేవు కదా..!

ఆ మనిషిని
ఆ మనిషిని
ఆ మనిషిని
అద్దంలో కనిపించే ఆ మనిషిని
పద్దతులు మార్చుకోమని అడుగుతాను

నీవే నీవే నీవే
ముందుకు కదలాలి సోదరా
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లేచి నిలబడి నిన్ను నీవు నిలబెట్టుకో సోదరా

నీకు తెలుసు
నీకు తెలుసు
నీకు తెలుసు
ఈ మార్పేంటో నీకు తెలుసు
మార్చివేసేయ్ సోదరా..!!

(Micheal jackson " Man in the mirror" కి స్వేచ్చానువాదం.)
26-11-16

చాక్లెట్ తీపి

విరించి ll చాక్లెట్ తీపి ll
--------------------------------

చిట్టి చేతులను ముందుకు చాపుతూ
నా చెల్లెలి కూతురు అడుగుతుంది..
"మామా..! చాక్లెట్ కోనీయ్యవా" అని.

ఒక అమాయకపు లోకం లోంచి
ఈ లోకం లోకి తొంగి చూస్తున్నట్టు
తను చూసే చూపుతో..
నాలో ఎన్నెన్ని ప్రశ్నలుదయిస్తాయో..!

ఐదు రూపాయల ఓ చిన్న చాక్లెట్...
తన ప్రపంచాన్నంతా ఆనందంగా మార్చేస్తుందంటే...
ఆనందం తనలో ఉందో చాక్లేట్లో ఉందో అర్థం కాకుండా ఉంటుంది.
బాల్యంలోని తీపినంతా నాలికమీద ఆ చిన్నారి చప్పరిస్తుంటే
పెద్దగైపోయామని, తీపిని మనం అసహ్యించుకోవడంలో
అర్థమే లేదనిపిస్తుంటుంది.

ఈ పసిపిల్లల ఆనందాన్ని
ఐదు రూపాయలకూ
పదిరూపాయలకూ
అమ్ముకునే దౌర్భాగ్యుడెంత ముసలివాడో..
బాల్యాన్నెంతగా మరచిపోయాడో..

బుజ్జి నాలుకనీ, బుజ్జి పెదవులనూ
తీయటి మకరందంలా చేసుకుని, పాప నా చెవిలోకి వొంపుతుంది
"మామా..! నన్ను ఎత్తుకోవా"  అని.
ఒక కంపనీని భుజాలకెత్తుకున్నాననే భావనని
ఆ చిట్టి తల్లి తేలిక శరీరం తేలిక చేసేస్తుంటుంది.

27/11/16

Sunday, 13 November 2016

అసామాన్య వ్యవస్థలో అసామాన్య నిర్ణయాలు

అసామాన్య వ్యవస్థలో అసామాన్య నిర్ణయాలు
---------------------------------------------------------

"మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే" అన్న మార్క్స్ మాటలను కళ్ళారా చూడటానికి ఇపుడు మనదేశంలో నెలకొని ఉన్న పరిస్థితి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నది. ఆర్థిక శాస్త్రం అనేది పుస్తకాలను చదువుకుని ఊహించినంత, గత చరిత్రను చూసి అంచనా వేసినంత సులువుగా ఏమీ ఉండదనేది మరోసారి నిరూపణ అయ్యింది. "ఈ విధంగా చేస్తే పరిస్థితి ఈవిధంగా జరుగుతుంది, ఇవ్విధమైనటువంటి ఫలితం వచ్చేస్తుంది" అని ఊహాగానాలు చేసేంత సులువుగా ఆర్థిక విషయాలు కొనసాగకపోగా, ఊహించని మలుపులతో ఊహించని సమస్యలతో నిరంతర జాగురూకత స్థితిని డిమాండ్ చేస్తుందనేది ఇపుడు మనకు అర్థం అవుతుంది. ఈ పెద్దనోట్ల నిలుపుదల విషయం మన ప్రభుత్వం తీసుకున్న 'అనాలోచిత చర్య' అనడానికి పూర్తి అవకాశం ఉన్నా, దాని వెనుక ఆర్థిక శాఖా విభాగం చేసిన కసరత్తు ఏ మాత్రం సరిపోనిదిగా తయారయింది. దేశంలో ప్రజల జీవితాల్ని తక్షణమే ప్రభావితం చేసే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఏ మాత్రం ముందస్తు కసరత్తు లేకుండా చేశారా, ఊహించని పరిణామాల్ని అసలు ఊహించనే లేదా అనేటువంటి అనుమానాల్ని కలిగిస్తున్నది.

"బడాబాబులకు అనుకూలంగా జరిగింది" అన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఇది ప్రభుత్వ వ్యవహారాల్లో బడాబాబుల పెత్తనాన్ని అవమానించడమే. బూర్జువా సమాజపు ప్రభుత్వాల పనితీరుని సరిగా అంచనా వేయలేకపోవడమే.  అందుకే "బడాబాబుల కనుసన్నలలో జరిగిందనడం" సముచితమేమో. ఇది ఈ ప్రభుత్వం చేసింది కనుక, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం కాదుగానీ, ఏ ప్రభుత్వం చేసినా ఇంతకు మించి వేరేగా చేయలేదన్నది సత్యం. ప్రపంచ మార్కెట్టు విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచమంతటా ఉన్న ప్రభుత్వాలన్నీ బడాబాబుల ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే కమిటీలుగా మారుతాయన్నాడు పెద్దాయన మార్క్స్. ఇంతకు మించి వేరేగా ఉండలేదు కాబట్టి, బడాబాబులకు ఇటువంటి నిర్ణయాలవలన ఏమీ అన్యాయం జరగలేదు అని బాధపడటంలో అర్థం కూడా లేదు. గత ప్రభుత్వాలే తీసుకుంటే లైసెన్స్ రాజ్ లోని లొసుగులనుండి ఎంత మంది బడాబాబులు ఉదయించారో తెలియక కాదు. లైసెన్స్ రాజ్ ల విషయంలోనే పరిస్థితి అలా ఉంటె, ఆర్థిక సవరణల యుగం లో ఇంతకు మించి వేరేగా ఉండదు. ఎలక్షన్లలో నాయకుల ప్రచారాలకు పెట్టుబడి ఎక్కడినుండి వస్తున్నదో, బడాబాబుల బడా బడా బ్యాంకు లోన్లకు ఋణమాఫీలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేనంత, అర్థం చేసుకోలేనంత బీరకాయ సంబంధమేంకాదీ వ్యవహారం. బడా బాబులంటే ఎవరు అంటే ఏ అంబానీనో, అగర్వాలో, థాపరో, టాటానో, బిర్లానో అనుకోవడం అంటే మనం ఇంకా పురాతన మైండ్ సెట్ తో నివసిస్తున్నట్టే. ఎనభై ఐదు శాతం మన పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా మనం అవమానించినట్లే. వీళ్లందరోఓ పార్లమెంటుకు ఎంపిక కావడానికిగల మినిమం క్వాలిఫికేషన్ అంతకుముందు వ్యాపారవేత్త అయుండటమే. మనమే ఎన్నుకంటాం వారిని, బాగా మాట్లాడుతున్నాడని, నిజాయితీగా పనిచేస్తాడనీ కాదు, బాగా డబ్బున్నవాడని. వీరిలో అస్మదీయులనూ తస్మదీయులనూ ఆయా ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి తప్ప, నిజానికి బడాబాబులెందరో మన దేశంలో.

మరి అటూ ఇటూ కాక ఎవరికోసమీ ఆకస్మిక నిర్ణయాలు?. ప్రభుత్వం( బడాబాబుల ప్రాథమ్యాలను పరిరక్షించే ప్రభుత్వం అని బై డీ ఫాల్ట్ గా చదువుకోవాలి) దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీయటంకోసమే అంటున్నపుడు, దేశంలోని సగంపైగా సంపద బడాబాబుల చేతిలో పోగుపడిఉండగా, ప్రభుత్వం బడాబాబుల కోసమే పని చేస్తూ ఉండగా, ఇక బ్లాక్ మనీ ఎవరి చేతిలో ఉన్నట్టు?. సామాన్యుడి చేతిలో ఉన్నట్టా..?. ఐతే ఈ దేశంలో సామాన్యుడి డెఫినిషన్ చాలా కష్టమైనది. ప్రతీ అసామాన్యుడూ తానో సామాన్యుడినే సుమా! అంటుంటాడు అనడానికి పరాకాష్ట రాజకీయ నాయకులు తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా బయటపెడుతున్నామని చెప్పుకోవడం. ఆ వివరాల్ని మనం వ్యక్తి పూజతోనో, కులం లేదా మతం పూజతోనో "అవునవును ఎంత నిజాయితీ పరుడో" అని నమ్మి సంతోషపడిపోవటం చేస్తుంటాం. ఇందులో, ఓటరు తన ఓటు నిజాయితీగల వాడికే పడిందని కొంతసేపు ఊగిపోయే ఆనందానికి లోనవడం తప్ప ఇంకోటి కనిపించదు. అంత వెర్రి వారిమి కనుకనే నిజాయితీకి మన దేశంలో అర్థాలే మారిపోతుంటాయి. పైగా నమ్మించే కార్యక్రమాలతో అనుసంధానకర్తగా ఉంటూన్న మీడియా, అవినీతి రహిత భారతదేశం కోసమే తాము పనిచేస్తుంటామని ఇంకో నమ్మకాన్ని ముందే మన మనసుల్లో నెలకొల్పుతూ ౦టుంది. ముఖ్యమంత్రాదులు సైంతం తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా తెలియజేస్తూ, అతి సామాన్యుడిలా బతికేస్తున్నాం, వాచీ లేదు, తినడానికి తిండిలేదు అని చెబుతున్నపుడు, అసలైన సామాన్యుడు "ఇంతకీ నేనెవర్నీ ..?" అని బహుబలి రేంజ్ లో అడగక తప్పదు.

మన వ్యవస్థే అసామాన్యంగా తయారైనపుడు సామాన్యుడనేవాడిని వ్యవస్థకి బయట మనం వెదకాల్సి ఉంటుంది. వ్యవస్థలో అంతగా పాలు పంచుకోని, పంచుకోలేని, పంచుకోనివ్వని మనిషినే మనం సామాన్యుడని నిర్వచించుకోవాల్సి  ఉంటుంది. కూతురి వివాహానికి ఒక పూటకోసం పది కోట్ల సెట్టింగ్ వేయగలిగిన సామాన్యుడు, కొడుకు మెడికల్ కాలేజీ సీటుని కోటిన్నరకు కొనుక్కునే సామాన్యుడు, ఐసీసీయూ లో ఒక రోజుకు యాభైవేలు సమర్పించి ట్రీట్మెంటు చేసుకోగల సామాన్యుడు, పది కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుని, పది రోజుల్లో ఇరవై కోట్లకు అమ్ముకునే సామాన్యుడు, బ్యాంకు లోను మీద బెంజ్ కారు కొనుక్కుని తిరిగే సామాన్యుడు, సంవత్సరంలో సంపాదించిన కోట్ల సంపాదనని కరెక్టుగా రెండున్నర లక్షలకు అటు ఇటుగా చూపించేసి చేతులు దులుపుకునే సామాన్యుడు, హోటల్ కి వెళ్ళి ఒక పూట భోజనానికి పది వేలు ఖర్చు పెట్టి, టిప్పు ఐదువందలు వేయగలిగిన సామాన్యుడు, లైసెన్సు కోసం లైన్లో నిలబడేబదులు ఐదువేలు లంచమిచ్చి పనిగావించుకునే సామాన్యుడు, మున్నగు వారందరూ ఈ వ్యవస్థ నిర్మించిన అతి సామాన్య ప్రజలుగా మనం చెప్పుకుంటే, వీరందరికీ ఈ జీవిత విధానాన్నీ, ఆలోచననీ, కలలనీ కల్పించిన అసామాన్య వ్యవస్థను ముందుగా తయారు చేసిందెవరని ప్రశ్నించాలి. నిజానికి వీటన్నింటికీ బయట, వీటితో ఏమాత్రం సంబంధం లేకుండాగా ఉంటుంది, పూట గడవడానికి కాయా కష్టం చేసే అసలైన సామాన్యుడు, వాడి జీవితం. "నేను సామాన్యుడిన"నుకునే ప్రతీ అసామాన్యుడూ ఈ రోజు బ్యాంకు ముందు లైన్లో నిలబడి తన సామాన్యత్వాన్ని ప్రదర్శిస్తూన్నపుడు, అసలైన సామాన్యుడి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఏలిన వారు చెప్పే నల్లధనం సంగతేమోగానీ, అసలు ఉండాల్సిన ధనం లేని వాడు బ్యాంకు ముందు ఎందుకు కనిపిస్తాడు?. అంతే గుడ్డిగా రాహుల్ గాంధీ అడుగుతాడు, "ఇక్కడ లైన్లో సూటు బూటు వేసుకున్న వారెవరైనా ఉన్నారా?" అని. సామాన్యుడి వేషధారణలమీద ఎంత నమ్మకమో ఆయనకు మరి.

నల్లధనం వెలికితీత అసామాన్యమైన మన వ్యవస్థను సామాన్యంగా తయారు చేస్తుందని నమ్మే అసామాన్యులందరూ వ్యవస్థలోని లోపాల్ని గుర్తించగలుగుతారనుకోవడం పొరపాటు. ఒకే  ఫ్రేం ఆఫ్ రిఫరెన్సులో ప్రభుత్వం, వ్యవస్థ సమాన వేగాలతో నడుస్తుంటాయన్న భౌతిక శాస్త్ర విషయాన్ని కొద్దిగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి ఈ పెద్దనోట్ల రద్దు విషయం వ్యవస్థలో నిజానికి కొంత మార్పు తేగలిగినా వ్యవస్థ మారనంతవరకూ అది నీటి మీద రాయేయడం తప్ప ఇంకేమీ కాదు.

13-11-16
విరించి విరివింటి

Saturday, 29 October 2016

విరించి ll అడవి చెట్లు ll
..............................
అడవి చెట్లన్నీ
ఆకుపచ్చగానే పుట్టి పెరుగుతాయి
ఎర్రెర్రటి పూలే విరగబూస్తాయి
ఆకుల్ని జెండాల్లా ఎగిరేస్తాయి
కొమ్మల్ని తుపాకుల్లాగా చాస్తాయి
అంతాకలిసి,
ఒక్క సూర్యోదయాన్నే కలగంటాయి

అడవి చెట్ల మీద
కోయిలలు పాటలు కడతాయి
వసంతం నుండి శిశిరం దాకా అవి
చెట్ల భాషే వినిపిస్తాయి
ఆ చెట్ల మీదే అవి గూళ్ళు కడతాయి
అంతా కలిసి,
ఒక్క సూర్యుడినే ముక్కుతో కొరుక్కుతింటాయి.

అడవిలో చెట్లెందుకని అడిగాడు వాడు
లోకంలో పచ్చదనం కోసమన్నాయవి
అడవిలో వుండి ప్రయోజనమేమన్నాడు వాడు
వర్షాలకోసమన్నాయవి
నగరంలో వుంటే నీడుండేదన్నాడు వాడు
అక్కడంతా కాలుష్యమన్నాయవి
అడవి పూలెందుకన్నాడు వాడు
కొమ్మలు, ఆకులెందుకన్నాడు
చెట్లన్నీ కూలుస్తానన్నాడు
అడవుల్ని కాలుస్తానన్నాడు వాడు
*       *       *       *       *
అడవిలో రాళ్లు శ్వాసిస్తున్నాయిపుడు
కోయిలలన్నీ పైకెగిరాయిపుడు
పక్షి కంటికన్నీ కనిపిస్తాయి,
వాటికి
అడవీ తెలుసు, నగరమూ తెలుసు

26/10/16

Tuesday, 25 October 2016

ఓటరు సణుగుడు

ఈ మధ్య చాలా విచ్చలవిడిగా వాడబడుతున్న పదాలు రెండున్నాయి. ఒకటి భక్తులు( కొద్దిగా వెటకారంగా బత్తులు), రెండు మేథావులు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మనోభావాలకనుగుణంగా వారు మాట్లాడే హక్కు ఉంటుంది గానీ, మరీ అయిందానికీ కానిదానికీ ఈ పదాలు ఉపయోగించేస్తూంటే అసలెవరు భక్తులో ఎవరు మేథావులో అర్థం కాని పరిస్థితి ఉంది.ప్రభుత్వం తీసుకునే ఏదైనా ఒక నిర్ణయాన్ని స్వాగతించే వాళ్లు అందరూ భక్తులు గానూ, వ్యతిరేకించే వారందరూ మేథావులుగానూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నిర్వచించేస్తూ ఉన్నారనిపిస్తుంది.

     ఇపుడుండే ప్రభుత్వం బీజేపీ పార్టీతో కూడిన ఎన్డీయే కూటమి కాబట్టి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా ఏ సందర్భంలోనైనా సమర్థిస్తే వారు అదే క్షణంలో భక్తులుగా అభివర్ణింపబడటం చూస్తున్నాం. అసలు భక్తులనే పదమే సరయినదికాదు. ఎన్నికల ద్వారా దేశంలోని మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా. ఇపుడా ఎన్నుకోబడిన ప్రభుత్వం నుండి తమ హక్కులను అవసరాలను పొందే ప్రజలు, ప్రభుత్వ విధానాలను సమర్థించినంత మాత్రాన వారిని భక్తులని హేళన చేయనవసరం లేదు. బీజేపీ కూటమిని ఏదో ఓ విషయంలో సమర్థించినంత మాత్రాన పక్కా హిందూ వాదులుగా, పరమ భక్తులుగా, తొత్తులుగా చిత్రించే ప్రయత్నాలు కనిపిస్తూంటాయి. ఇది ఒక వైపు మాత్రమే, ఇంకో వైపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జేజేలు పలికే వారు లేక కాదు. ఐతే సమర్థనలూ, వ్యతిరేకతలూ ఎపుడూ ఉండేవే..వారికో వెటకారమైన పేరు పెట్టడమే ఇపుడుండే ట్రెండ్.

ప్రజాస్వామ్యంలో పార్టీలుంటాయి. వాటికి ఎజెండాలుంటాయి. ప్రజలుంటారు. ప్రభుత్వాలని ఎన్నుకుంటారు. ఐతే ఎన్నుకునేది ప్రభుత్వాలను, అంతేగానీ పార్టీలను కాదనే విషయం పార్టీలు, లీడర్లు తెలుసుకోవాలి. ప్రభుత్వాలను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ఏ పని చేసినా తమ పార్టీ గొప్పదనం వలననే సాధ్యమయిందన్న పోకడ కనిపించటం చూసినపుడు, అసలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా పార్టీని ఎన్నుకున్నామా అని సామాన్యుడు బుర్ర గోక్కోక తప్పదు. ఆ మధ్యన బీజేపీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణా కు వచ్చి 'కేసీ ఆర్ అండ్ కంపనీ పాలన 'అంటూ ఏదో వెటకారాలు చేసి పోయాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు గానీ, కంపనీలను కాదు అని ఆ సదరు లీడరంగారికి తెలీదు అనుకోలేం. తెలిసినా తాత్కాలికంగా పడే చప్పట్లు, అయిదేండ్ల తర్వాత ఓట్లుగా మారకపొతాయా అనే దుగ్ధ. ఆయన లెక్క ప్రకారమే తీసుకుంటే, ఇపుడు కేద్రంలో 'మోడీ అండ్ కంపనీ' పరిపాలనలో ఉన్నట్టా?. రాజ్యాంగంలో ప్రభుత్వాలని ఎన్నుకోవాలని కదా ఉన్నది, ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా కంపనీలను కాదు కదా..ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి చెందిన అధ్యక్షుడే ఇలాగున్నాడు మరి. ఇక సామాన్య నోటి దురుసు మనుషుల సంగతి చెప్పనేల?.

ఇక, ప్రజలుండగా, పార్టీలుండగా, ప్రభుత్వాలుండగా.. మధ్యలో ఈ మేథావులంటే ఎవరు?. ప్రభుత్వాన్ని ఆ విధానాల్ని విమర్శించే వారినందరినీ కట్టగట్టి మేథావులు అని వెటకారంగా అంటున్నారనటంలో ఎంత నిజం వుందో, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే ప్రతీవాడూ తనను తానో మేథావి అని అనుకుంటుంటాడనటంలో అంతే నిజం ఉంది. నిజానికి మేథావులు అనే వారు పార్టీ సిద్ధాంత కర్తలు. వీరు రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటూ, సమాజాన్ని, రాజకీయాలను దగ్గరి నుండి పరీక్షిస్తూ, పరిశీలిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా రూపొందిస్తూ సూచనలిస్తూ ఉండేవారు. కమ్యూనిష్టు పార్టీకి ఈ సిద్ధాంత కర్తల బలమే అసలైన బలం. మిగితా పార్టీలకు అలాంటి సిద్ధాంత కర్తలున్నారని అనిపించదు. ఉన్నా, ఒక సిద్ధాంతం కోసం కాక ఎలక్షన్లలో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి దందాలు చేయాలనే సలహాలిచ్చే వారుగా తప్ప ఇంకోలా ఉన్నట్టు అనిపించదు. పైగా కొన్ని పార్టీలకు కర్త భర్త కార్యకర్త సకలమూ ఆ పార్టీ అధ్యక్షుడే. అంతే కాక ఆ అధ్యక్షుడి కొడుకు, కొడుకుకి కొడుకు, ఇలా ఆ ఇంట్లో పొరపాటున పుట్టిన ప్రతి వాడు ఆటోమేటిక్ గా అధ్యక్షుడు అయ్యుంటాడు. వయసొచ్చి తల నెరిసినా చోటా భీం ఆటలు ఆడుకునే వాడైన సరే..ఆ ఇంట్లో పుట్టిన మహానుభావుడిగా సర్వమూ తానే కావాల్సిందే.  ఇపుడు "సిద్ధాంత రాజకీయాలు" అనే మాటే వినిపించటం లేదు. ఆ పదాన్నే మరచిపోయాం. "ఓటు బ్యాంకు రాజకీయాలు" అనే మాటే వింటుంటాం. ఓటు బ్యాంకు కోసం పనిచేసే వారిని మేథావులు అనగలమా?. చివరికి కమ్యూనిస్టు పార్టీ వారు కూడా అవసరానికనుగుణంగా పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ సైద్ధాంతిక మేథావులను బలహీన పరిచేసరికి, మేథావులనే పదం చాలా నీచంగా వెటకారంగా తయారై కూర్చుంది. అందువల్ల ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా, సామాన్య మానవుడైనా కొంత వ్యతిరేకించగానే మేథావి ఐపోతుంటాడు.

చివరగా, ఓటరు అనే సామాన్యుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం తనకు నచ్చినది చేసిందని సంతోష పడతాడు, ఇంకొన్ని విషయాల్లో ఇదేంటి ఇలా చేసిందని బాధపడతాడు. వాడు భక్తుడూ కాడు, మేథావీ కాదు. ఓటరు ఓటరే. సామాన్యుడే.

విరించి విరివింటి

కవిత్వ సందర్భం 28 juluru

ఓ జెండా నీవెటు వైపు?
-------------------------------

సమసమాజ కాంక్ష అనేది అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడినట్టుగా మనిషిలోకి ప్రవేశించదు. దాని పునాదులు సమాజంలోనే, అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే నిగూఢంగా వేళ్లూనుకుని ఉంటాయి. సారంలో పెట్టుబడీ దారీ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న సమాజం సోషలిస్ట్ భావజాల విత్తులకు కూడా అవసరమైనంత శక్తిని కలిగించేదిగా వుంటుంది.  పెట్టుబడిదారీ వ్యవస్థలోని పారడాక్స్ ఏమంటే అది సమాజాన్ని ముక్కలు ముక్కలుగా, వర్గాలుగా ఒకవైపు విడగొడుతూ నే, మరో వైపు అనంత విశ్వంలో మానవుడు తాను బావిలోని కప్పను కాదనీ, తానూ ఈ ప్రపంచంలో ఒక భాగమనీ, తనకూ పరిపూర్ణ మానవుడిగా మారే సర్వ హక్కులూ ఉన్నాయనీ తెలుసుకోగలిగేలా కూడా చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు పీడితులపై పీడకుల అణచివేతను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నా, మరో వైపు అదే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడగలిగే ఆలోచననీ పీడితుల్లో తీసుకువస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో దయ, నిస్వార్థత, ఏకత, ఆధ్యాత్మికత, సంస్కృతి వంటి గుణాలు తమకవసరం లేనపుడు నీచమైన వాటిగా, అవసరమొచ్చినపుడు గొప్ప విషయాలుగా చూపించబడితే, సోషలిస్ట్ భావజాలం వీటి వెనుకాల ఎంతటి దోపిడీ నిగూఢంగా దాగి వుందో చూపిస్తుంది. ఒక సమాజంలో ఈ భావనల బలాబలాల్ని తేల్చటం అంత సులువేం కాకున్నా, పెట్టుబడిదారీ వ్యవస్థలో సోషలిస్ట్ భావనల విత్తులు ఉన్నపుడు మాత్రమే ఆ సమాజంలో దోపిడీ, తిరుగుబాటు, అణచివేత వంటి మాటలు, కనీసం భావనల రూపం దాల్చే ప్రయత్నం చేస్తాయన్నది వాస్తవం. ఈ విత్తులు లేని సమాజంలో దోపిడీపై తిరుగుబాటు కాదు కదా, కనీసం దోపిడీని గుర్తించగలిగే శక్తిని కూడా మనిషి కలిగి ఉండడు. తెలంగాణా సమాజం అటువంటి విత్తులు పుష్కలంగా ఉన్న సమజం. ఏ సోషలిస్ట్ భావనల్నైతే కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజంలోకి తీసుకుని వచ్చిందో, అవే భావనల విత్తులు పెరిగి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ రూపంలో మొక్కలుగా, వృక్షాలుగా మారుతున్న సమయాన కవి జూలూరీ గౌరి శంకర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకూ, దాని ఆచరణకూ మధ్య దొరకని లంకెను పట్టుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.

తెలంగాణా సమాజానికి సోషలిస్ట్ భావనలని తీసుకొచ్చింది నిస్సందేహంగా కమ్యూనిస్ట్ పార్టీనే. అంతేకాక కమ్యూనిస్ట్ పార్టీ మనదేశంలో బలపడటానికి కూడా తెలంగాణా సమాజం అంతే కారణం. తెలంగాణా భూ పోరాటాలు, సమైక్య రాష్ట్రంలోని నక్సలైట్ ఉద్యమాలూ, పాలకులలో, పరిపాలనలో తెచ్చిన మార్పులు తక్కువేం కాకున్నా , అంతకన్నా ఎక్కువగా ప్రజలలో ప్రశ్నంచే తత్వాన్నీ, అందుకు తగ్గ రాజకీయ సామాజిక చైతాన్యాన్నీ కలిగించింది. కానీ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కమ్యూనిస్ట్ ఆశయానికి అనుగుణంగా, అణచివేతకూ, దోపిడీకి వ్యతిరేకంగా ఏ వేర్పాటువాద ఉద్యమం మొదలైందో, అదే ఉద్యమం విషయంలో ఆ పార్టీ అవలంబించిన మౌనం కమ్యూనిస్ట్ అభిమానులనూ ఆశ్చర్యపరిచింది. రాజకీయ కారణాలో ఇంకే కారణాలోగానీ, వారి  వ్యూహాత్మక మౌనం, ప్రత్యేక తెలంగాణా వాదులకు ఊహ లేని మౌనంగా కనిపించింది. నైతిక మద్ధతు అవసరమైన సమయంలో మొండి చేతులు చూపించవలసిన అవసరం ఏముందో నిజానికెవ్వరికీ తెలీదనే చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలకు తప్ప. కమ్మునిస్టు అభిమానిగా కవి జూలూరి గౌరీశంకర్ ఆ పార్టీతో సైద్ధాంతికంగా తాడోపేడో తేల్చుకోవాలనుకుంటాడీ కవితలో. "ఓ ఎర్రజెండా నీవెటు దిక్కో తేలాలిపుడు" అని పట్టుబడతాడు. "విముక్తి పోరాటమే ఎర్రజెండా మ్యానిఫెస్టో కదా, తెలంగాణా విముక్తి అంటే ఎర్ర జెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?" అంటూ ప్రశ్నిస్తాడు.  కమ్యూనిస్ట్ భావజాలం మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద అపారమైన ప్రేమ నమ్మకం కూడా కనిపిస్తుందీ కవితలో. ఆ ప్రేమతోటే కాబోలు ఒకింత గట్టిగా అడుగుతాడు నీవెటువైపని. ఆ నమ్మకంతోటే కాబోలు, ఈ పోరు గడ్డ మీద రియలెస్టేట్ కబ్జాలను తుడిచేయడానికి నీవే కట్టమైసమ్మవి కమ్మంటూ ప్రార్థిస్తాడు.

తెలంగాణ  రగల్ జెండా
------------------------------
         జూలూరి గౌరీ శంకర్.

నిన్నెట్ల  సాదుకున్నం
మా నెత్తురు  పోసి  ఎట్లపెంచుకున్నం

నువ్వు
అనగారినోల్లకు  అండవని
నేల  విముక్తి  నేతవని
ఆకలి  కడుపుకు  బువ్వవని
నేర్రలు  బాసిన మట్టికి  నీళ్లవని
నిన్ను  పిచ్చిగా  ప్రేమించినోన్ని
ఈ వెర్రి  గొంతుకతో  ఎర్రపాట పాడినోన్ని

మా  కలతలల్ల  కస్టాలల్ల
కన్నీళ్ళల్ల  కల్లోలాలల్ల
పాడుకున్న పాటకదే నువ్వు
నా  మనసు ఎగరేసిన ఎరుపు  కదే నువ్వు
మా  వాకిళ్ళ నొదిలి
సెట్టు సెలకల్ని బట్టి
ఈ  బొందిల  పాణం
నీకోసమేనన్నోళ్ళ నొదిలి
ఎట్ల  బోతవే సెప్పు ఓ నా ఎర్రజెండా
నన్ను నీకు  ఎడబాసేదేవరో సెప్పు  రగల్ జెండా

నా నేలను  సెరబట్టినోళ్ళపై కదా
దండు కట్టాల్సింది
అక్రమణతత్వం మీద  కదా
ఎర్రజెండా కలబడాల్సింది
నా బువ్వ లో మన్నుబోసినోడి చెంత
ఎట్ల  నిలుస్తవే  సెప్పు నా  ఎర్రజెండా
ఎర్ర జెండంటే సాయంకోరినోళ్ళ  సేతికర్ర  కదా

నా నేలని  నాకిస్తవని  కదా
కొడవలికి  కంకినైoది
సుత్తి  కొడవలి  నక్షత్ర మైంది

ఈ సేత్తో  ఉగ్గుపాలు తాపికదా
నిన్ను  ఎర్రగా  ఎగరేసింది
నా  నేల  పొత్తిళ్ళలో పెరిగే కదా
దేశానికీ  ఎర్రజెండానిచ్చింది

నా నేలను  ఉచ్చుల్లో బిగిస్తున్న వాళ్ళ సేతుల్లో
సిక్కినవు  కదే  ఓయమ్మా

ఓ ఎర్ర  జెండా
నువ్వు  ఎటుదిక్కో  తేలాలిప్పుడు
ఎర్రజెండాకిది  పరీక్షాకాలం
పేగుబంధాల్ని తెగతెంచేటొల్ల  జోలేందుకే  అవ్వ

మా బాధలు  తీర్చే ఓదార్చే
కట్టమైసమ్మవి  కావే ఓ నా ఎర్రజెండా
పోరాట జాగపైన రియలెస్టేట్ ల్ని తుడిసేయవే తల్లీ

కసికసిగా  ఎర్రెర్రగా
తెలంగాణ  పాట పాడవే ఎర్రజెండా

ఆ  నాయకత్వం  సేతులిడిసిపెట్టి
ఈ ప్రత్యెక  పాట  పల్లవించవే అమ్మా
ఈ నేలపై  ఏ ఆధిపత్యం  సెల్లదని సెప్పవే  ఎర్రజెండా
మూడు  కోట్లమంది  పక్కన  నిలవవే ఎర్రజెండా
నా  ఎర్రజెండాను  ఎట్ల ఎగరేయాలో తెలుసు నాకు
విముక్తి పోరాటమే  ఎర్రజెండా  మ్యానిఫెస్టో కదా
తెలంగాణా  విముక్తి  అంటే
ఎర్రజెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?

ఇప్పటికీ తెలంగాణా ఉద్యమం ప్రాంతీయ వాదమనే వారూ ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదం ఎంత అప్రాంతీయమో, అంతకన్నా ఎక్కువగానే సమైక్యాంధ్ర వాదం ప్రాంతీయం. కాల పరీక్షకు నిలవని ఒకే భాషవాదం, విశాలాంధ్ర వాదం వంటివి వాటిలోని దోపిడిని ఎంతో అందంగా అలంకరించి దాచి వుంచుతాయి. చివరికి ఆ చారిత్రక ఘట్టమైతే ముగిసింది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణా ఐతే విముక్తి పొందింది. కానీ కేవలం భౌతికమైన విముక్తి విముక్తికి పూర్తి రూపం కాదు. ఆ లెక్కన కమ్మునిస్టు ఆశయం అప్పటికీ ఇప్పటికీ కూడా సజీవమే. ఉద్యమసమయంలో ఏకాగ్రతతో కొంగ జపం చేసిన పార్టీ, ఇపుడు ఆశయాన్ని ఆచరణను కలిపుతూ  సాగాలని కోరుకు౦దాం. కవితలో కవి ఆశయం ప్రత్యెక తెలంగాణా మాత్రమె కాదు, కమ్యూనిస్ట్ భావన అందించే ఉద్యమ స్ఫూర్తి కూడా.


కవిత్వ సందర్భం 28
26-10-16

Saturday, 15 October 2016

జాతకం ll విరించి ll

జాతకం ll విరించి ll
........................
మనుషులూ నక్షత్రాలు
గ్రహాలూ బంధువులూ
ఆకాశమూ, భూమి

కనుచూపు మేరలోనే
భూమ్యాకాశాల కలయిక
నాసాలో, ఇంకా తొలిదశలో..

మనిషి గీసుకున్న నమూనాలు
ఆకాశంలో పన్నెండు దేశాలు
భూమ్మీద నూటతొంభైయ్యారు రాశులు

కొండలు, సముద్రాలు, కాంతి సంవత్సరాలు
మనసులు దూరాలు దూరాలు

బిగ్ బ్యాంగ్ లో జన్మ కుండలి
కృష్ణ బిలం లో ఒబిచ్యువరీ

అవును, విశ్వం వ్యాపిస్తోంది

మనుషుల ప్రభావం నక్షత్రాల మీద
ఒంటరితనం.

7-10-16

Friday, 14 October 2016

కవిత్వ సందర్భం 27 vimala



వంటింట్లో ఏముంది?
-----------------------------

ఎపుడైతే మనం మన అస్తిత్వం కోసం పోరాటం మొదలు పెడతామో...మనమీద ప్రపంచానికున్న దృష్టికోణంతో కూడా పోరాడాల్సి వుంటుంది. ఆ దృష్టికోణాన్ని బద్దలు చేయాల్సి వుంటుంది. అలా చేయాలంటే ఎన్నుకునే మార్గం కఠినంగా ఉండాలా లేక మృదువుగా ఉండాలా అన్నది ప్రపంచానికున్న ఆ దృష్టికోణపు కర్కశత్వాన్ని బట్టి ఉండాలి. సాహిత్యంలో పదాల సహాయంతో అస్తిత్వ పోరాటం చేయటమంత సులభమైనది కాదు. స్త్రీ వాద కవిత్వం స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణాన్ని ఎంతవరకు మార్చిందో తెలుసుకోవటానికి కంటిముందున్న ప్రస్తుత సమాజమే సాక్షి. దీనికి ఈ కవిత్వం, దురదృష్టవశాత్తూ  వాసి ఉన్నంతగా రాశి తగినంతగా లేకపోవడం బహుశా ఒక కారణంగా కనిపిస్తున్నది. శారీరక స్త్రీని, సమాజం ఏర్పరిచిన మానసిక స్త్రీని వేరుచేసి చూపించటం ద్వారా, తన అస్తిత్వం శరీరంలో కాదు, మనసులో ఉందని చెప్పటానికి 80 వ దశకంలో మొదలైన తెలుగు స్త్రీ వాద కవిత్వం ఇంకా ఎక్కవలసిన శిఖరాలెన్నో ఉన్నాయన్నది కాదనలేని నిజం. ఈనాటికీ స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులూ, యాసిడ్ దాడులూ స్త్రీ వాద కవిత్వపు పటుత్వాన్ని పెంచాల్సిన అవసరాన్ని తెలుపే సవాళ్లుగా మిగిలిపోతున్నాయి. ఒక సంఘటన జరిగినపుడు దానిని ఖండిస్తూ వచ్చే కవిత్వం వచ్చినట్టుగా, ఆ విషయం పట్ల ప్రపంచపు దృష్టికోణం మార్చగలిగిన కవిత్వం రావాల్సిన అవసరం ఉంది.

 స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక తల్లికే పుడతారు. ఈమె భౌతిక మైన స్త్రీ. కానీ మానసికమైన స్త్రీ లేదా సమాజపపు దృష్టికోణంలోని స్త్రీ మాత్రం వంటింట్లో పుడుతుంది. ఇది సమాజం నిర్మించిన ఒక నమూనా. దానిని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కవయిత్రి విమల ఈ కవితలో. డాll కాత్యాయినీ విద్మహే గారి ప్రకారం, స్త్రీ వాద కవిత్వంలో నాలుగు ప్రధాన ధోరణులు. ఒకటి స్త్రీల ఉనికికి సంబంధించిన కవిత్వం, రెండు కుటుంబ సంబంధాల్లో తమ స్థానాన్ని గురించి వివేచించిన కవిత్వం. మూడోది కుటుంబం నుంచి బయటకు వచ్చినపుడు తనకు సంబంధించి సమాజంలో వచ్చే స్పందనను చిత్రించే కవిత్వమైతే, నాలుగవది సామాజిక పరిణామాలు, సామాజిక సమూహాలను స్త్రీగా తను చూసే పద్దతికి సంబఁధించినది.  ఈ కవితలో మొదటి రెండు ధోరణులూ కనిపిస్తాయి. స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణం మారటానికి ఈ రెండు ధోరణులూ ఎంత వరకు సహకరిస్తాయన్నది ఆలోచించ వలసి ఉంటుంది. చిన్న ఆయుధంతో పెద్ద శత్రువును ఎదుర్కోవడం వంటిదిది. అయినా కవయిత్రి విమల విమలంగానే రాడికల్ స్త్రీవాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారీ కవితలో.

మగ, ఆడ అనేవి లింగ బేధాన్ని సూచిస్తే, తల్లి పాత్ర అనేది ఒక మానసిక స్థితిని సూచించే సింబల్ అవుతుంది. భార్య గానీ, భర్తగానీ, ఇంకెవరైనాగానీ తల్లి పాత్రను పోషించకపోతే ఆ పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువని సైన్సు చెబుతోంది. తల్లి పాత్రను కన్వీనియంట్ గా స్త్రీకి అప్పజెప్పడం పితృ స్వామ్య  సమాజం నేర్చుకున్న పోకడ. తల్లి, తల్లి పాత్ర కేవలం ఒక సింబల్ గా మనం తీసుకోలేనపుడు, దానిని ఒక జెండర్ కు మాత్రమే పరిమితమైన అంశంగా మార్చినపుడు, దాని చుట్టూ ఎన్నో దోపిడి వ్యవస్థలు మొదలవుతాయి. అటువంటి దోపిడిలో వంటిల్లు ప్రధాన పాత్ర పోషిస్తూ స్త్రీ జీవితాన్నే శాసిస్తున్నపుడు, ఆ వంటింటిని కూల్చేయాలి అనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. కవయిత్రి విమల తన వంటింటిలో తన బాల్య జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నపుడు వంటిల్లు వంటిల్లు లాగానే అద్భుతంగా, ప్రాణంతో శ్వాసించే దానిలా, రుచులతో ముస్తాబయ్యే దానిలా, మేల్కోవటం, పడుకోవటం తెలిసిన దానిలా అనిపిస్తుంది, కానీ బాల్యం కరిగిపోయాక, ఆ వంటింటిలోనే తన స్త్రీత్వం కూడా పుడుతుందని తెలిసినపుడు, అదే వంటింటిలో బందీ అయిన తన తల్లి, గరిటలా, పెనం లాగా కనిపించటమూ, నిశ్శబ్దంగా, నిరాశగా, భయం భయంగా జీవించే ఆమె ఒక ప్రేతంగా కనిపించటమూ మనం ఈ కవితలో చూస్తాం. తల్లి పాత్ర ద్వారా సమాజం స్త్రీ మీద చేసే అదనపుదోపిడీని కవయిత్రి చాలా సమర్థవంతంగా చూపిస్తారీ కవితలో. తరం మారినా, శ్రమ దోపిడిని తగ్గించే ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినా, వంట వండే పదార్థాలు మారినా, వంట చేయడం స్త్రీకి, ఇంకా చెప్పాలంటే, తల్లి పాత్ర పోషిస్తున్న స్త్రీ కి తప్పటం లేదు. ఆ వంట పాత్రలన్నింటి మీదా, అమ్మ తరం లో నాన్న పేరు ఉండటం, ఈ తరంలో తన భర్త పేరు ఉండటాన్ని సూచించటం ద్వారా, చాలా బలమైన అస్తిత్వ వాదనను వినిపిస్తారు కవయిత్రి విమల.

వంటిల్లు
          ----------- విమల
--------------------------------

ఎంత అద్బుతమైంది ఈ వంట గది
రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ
తెరచిన తినుబండారాల దుకాణంలా
ఎంత నోరురిస్తుందో !
తాలింపు ఘుమాయిన్పులతో
పూజ మందిరం అగరొత్తుల సువాసనలతో
మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ  ఉంటుంది.
వసారాలో చల్ల చిలికే చప్పుడుతోనో
అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో
రోజు ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది
అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి
మండేందుకు ముస్తాబవుతుంది
వంటింటి పోపు డబ్బాలో చిల్లర పైసలు
దాచుకు తిన్న మిటాయి ఉండలు
పప్పు బెల్లలతో ఉత్తుత్తి  వంటా-వడ్డనలు
అమ్మ నాన్న ఆటలు
ఈ వంటిల్లోక వదలని మొహమై
నా బాల్యాన్నంత చుట్టేసుకుంది .
నాకు మా వంటిల్లోక అద్బుత మాయా బజార్
ఇప్పుడు వంటిల్లోక ఆట స్థలం కాదు .
మెల్లగా బాల్యపు చాయలు వదిలిపెడుతున్డగానే
ఇక్కడే నన్ను తీర్చి దిద్దటం మొదలయ్యింది
"వంటింటి తనాన్ని" ఇక్కడే నేర్పారు  నాకు
మా అమ్మ, మా అమ్మమ్మ,
ఇంట్లో అమ్మలంతా ఇక్కడే "స్త్రీ" లయ్యారట
గిన్నెలు, డబ్బాలు, బస్తాలతో
రకరకాల శవాలు నిండిన శ్మశానంలా
మా వంటిల్లు -
తడి కట్టెల పొగ మేఘాల మధ్య
మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది
భయం, భయంగా నిశ్శబ్దంగా, నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అస్సలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది,
ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారి పోయాయి.
తోమి  తోమి ఆమె చేతులు అరిగి పోయాయి
మా అమ్మకు చేతులు లేవు
ఆమెను చుస్తే
ఒక గరిటగానో, పెనం లానో
మా వంటింటిని అలంకరించిన ఓ పరికరం లానో ఉంటుంది.
ఒక్కో సారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది.
అప్పుడు బంది అయిన పులిలా ఆమె
వంట గదిలో అశాంతిగా తిరుగుతుంది .
నిస్సహాయతతో గిన్నెలు తిప్పితే చాలు
వంట సిద్దం అంటారంతా !
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నేలన్నింటి పైనా
మా నాన్న పేరే !
అదృష్ట వశాత్తూ నేనో మంచి వంటిట్లో పడ్డనన్నరంత !
గ్యాసు, గ్రైన్దర్లు, సింకులు , టైల్స్ ...
అమ్మలా గారెలు, అరిసెలు కాక
ఇప్పుడు కేకులు , పుడ్డింగులు చేస్తున్నాను నేను
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తదే
కుక్కర్ కూత తోనో , గ్రైండర్ మోత తోనో
నా వంటిల్లు మేల్కొంటుంది .
నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాల ల ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లోక కసాయి
దుకాణంలా ఉంది
కడిగిందే కడిగి ఏళ్ళ తరబడి , వండి ,వండి,
వడ్డిస్తూ ఎంగిళ్ళు ఎత్తెసుకుంటూ
చివరకు నా కలలలోను వంటిల్లె
కళాత్మకమయిన వంటింటి కలలు
మల్లె పూవుల్లోను పోపు వాసనలే !
ఈ వంటింటి ని తగలెయ్య
ఎంత అమానుష మయ్యిందీ    వంట గది !
మన రక్తం పీల్చేసి , మన ఆశల్ని , కలల్ని కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసి గదా ఈ వంటిల్లు
వంటింటి సంస్కృతి ; వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం
మనం ఏమయినా మన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పడం గా చేసిన ఈ వంటిళ్ళను
ద్వంసం చేద్దాం రండి !
ఇక గిన్నెలపై ఎవ్వరి పేర్లు వద్దూ
వేర్వేరు స్వంత పొయ్యిలను
పునాదులతో సహా తవ్వి పొద్దం రండి!
మళ్లి మన పాపలు ఈ వంటరి  వంటిళ్ళలోకి
అడుగిడపోతున్నారు.
మన పిల్లల కోసం
వంటరి వంట గదులు కూల్చేందుకు రండి
 వంటల పుస్తకాలు నిజానికి ఎంత మంది చదువుతారో గానీ, ఈ రోజుకీ ప్రపంచంలో బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో ఈ వంటింటి సాహిత్యమే టాప్ లో ఉంటోంది. పొరపాటున ఈ వంటింటి సామ్రాజ్యానికంతటికీ స్త్రీ యే ఇప్పటికీ మహారాజ్ఞి. స్త్రీ వాద కవిత్వమిస్తున్న పిలుపులోని బలాన్ని ప్రశ్నించేదిగా ఈ లెక్కలున్నాయి. వంటింటిని కూల్చేయలేక పోయినా, వంట చేయటం నీచమైన కార్యమేమీ కాదనే దృష్టికోణమొకటి ప్రపంచంలో మొదలైంది. అది స్త్రీవాదం వలన కలిగిందా, లేక వంటను వ్యాపారంగా మార్చే కాపిటలిస్ట్ పోకడలు మార్చాయో తెలుసుకోవాలంటే, హోటల్ మేనేజ్మెంటు కోర్సుల్లోని పురుషాధిక్యతను గమనించకతప్పదు. స్త్రీ వాదం నిర్దేశించిన వంటిల్లు లేకపోవడం అన్నది, కాపిటలిస్ట్ సమాజంలో పురుషులతో పాటుగా స్త్రీల ఆఫీసు పనిగంటల దోపిడీగా, రెడీ మేడ్ ఫుడ్ ని అందించే కే.ఎఫ్.సీ, డొమినో, మ్యాక్ డొనాల్డ్ వంటి బహుల జాతి కంపనీలు పుట్టుకురావడంగా రూపాంతరం చెందుతూ వస్తూంది. పనిలో పనిగా ఈ మారుతూన్న కుటుంబ వ్యవస్థలను కంపనీలు పలువిధాలుగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. కాపిటలిస్ట్లకు పనికొచ్చే విధంగా స్త్రీ వాదం మారుతోందని, దీనిని బూచిగా చూపించి స్త్రీ వాదాన్ని పలుచన చేసే పోకడల్ని చూస్తున్నపుడు, వంటల పుస్తకాల స్థానాన్ని వంటింటి కవితలు నింపాల్సి ఉంటుంది. ఈరోజు వంటిల్లు ఉందా లేదా అంటే..లేదు, కాపిటలిస్ట్ లకు అవసరమైనంత మేరకే లేదు, ఉంది కాపిటలిస్ట్లకు వంటింటి సామాగ్రిని అమ్ముకోవడం వరకూ ఉంది. కానీ స్త్రీ మాత్రం వంటింట్లోనే వుంది, ఆఫీసుకు ముందూ, ఆఫీసుకి తరువాత. ఇది వాస్తవం. మారుతున్న సామాజిక రూపంలోని మితుల్నీ, పరిమితుల్నీ దాటి స్త్రీవాద కవిత్వం తన విస్తృతిని పెంచుకోవటం కేవలం స్త్రీలకే కాదు, మొత్తం సమాజానికి కూడా అవసరం.

My posts in fb

1.   మతం ఒక పజిల్, పద్మవ్యూహం.
పరమపద సోపానంలో ఉన్నట్లు ఇందులో విషనాగులుంటాయి, మెట్లూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటూకుంటూ సత్యాన్ని చేరటమే ఆధ్యాత్మిక సాధన

------------------

2-    చైనాలో ఆడపిల్లకు పెళ్ళి చేసి, భర్త తో పంపించేటపుడు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి కొన్ని సుద్దులు చెబుతూ  ఉంటారు మన దేశంలో లాగే.
ఆ సుద్దుల్లో ముఖ్యంగా చెప్పే అంశం "ఇంటి నిప్పు బయటకు పోనీయకు, బయటి నిప్పు లోపలికి రానీయకు" అని.
నిప్పు అంటే మాట అని అర్థం. నిజంగా మాట నిప్పువంటిదే, దానిని సరిగా ఉపయోగించుకోక పోతే అది తప్పకుండా కాల్చేస్తుంది.
ముఖ్యంగా సంసారానికి సంబంధించిన విషయాల్లో, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఇపుడు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రాంలలో ఇంటి నిప్పును తీసుకొచ్చి అందరి ముందరా ఆరేస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.
డబ్బులకు నటించే నటీమణులు, కౌన్సిలర్ల అవతారం కాదు, ఏ అవతారం ఎత్తమన్నా ఎత్తుతారు.
డబ్బులకు ఆశపడే టీవీ ఛానల్స్ అడ్డమైన ప్రతీ ఆలోచననూ ప్రోగ్రాంలాగా మలుస్తూ ఉంటారు,  క్రియేటివ్ జీనియస్ లు మరి.
ఈ సదరు ప్రోగ్రాంలను స్పాన్సర్ చేసే కంపనీలు, ఏ చెత్త ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేసేస్తారు డబ్బుల కోసం.
కాబట్టి ఈ నటీనటులనూ, టీవీ ఛానల్స్ నూ, ఆ స్పాన్సరర్లనూ అంతకు మించి గొప్పగా ఊహించడం కష్టం.
అందుకే, డబ్బులకోసం గడ్డితినమన్నా తినే గాడిదల మధ్యకు పచ్చని సంసారాన్ని తీసుకెల్లడం ఎంతవరకు అవసరమో, ఆ ప్రోగ్రాంలకు వెళ్ళే ప్రజలు నిర్ణయించుకోవాలి. చదువుకున్న లాయర్లు, కౌన్సిలర్లు కూడా, ఈ టీవీ ప్రోగ్రాంలకు ఎగబడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక లాయర్ దగ్గరికో, ఒక డాక్టర్ దగ్గరికో,ఒక పర్సనల్ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళినపుడు, పూర్తి ప్రైవసీని కలిగించడం ఆ సదరు ప్రొఫెషనల్స్ ల యొక్క మినిమం కర్టసీ. తమ బాధను చెప్పుకోవటానికి వచ్చిన వారితో పరాచకాలూ, పరిహాసాలూ చేయటం ఆ ప్రొఫెషన్ కే కళంకం. బయట ఎందరో తమ బాధను చూసి నవ్వుతారని నొచ్చుకునే కదా మనం వారి దెగ్గరకు వెళ్ళేది. ఇంక వాళ్లు కూడా ఆ మినిమం ప్రైవసీని కాదని గేలి చేయటానికీ, పదుగురిలో నవ్వుల పాలు చెయ్యటానికి తమ ప్రొఫెషన్ ని ఉపయోగించుకుంటే ఆ బాధాతప్త హృదయులకు దిక్కెవరు?. ఇలాంటి చెత్త ప్రోగ్రాములకు వెళ్ళే ప్రొఫెషనల్స్ ఈ విషయమై పునరాలోచించుకోవాలి.

కుటుంబాల్లో సమస్యలు ఉండవని కాదు. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఈ రచ్చకె్క్కడాలు కాదు. తమ తమ హ్యూమన్ డిగ్నిటీని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోలాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోక పోవటం వలననో, బీదరికం వలననో ఇంకెవరో తమ సమస్యలను తీరుస్తారని అనుకున్నపుడు చిత్త శుద్ధిలేని యాంకరమ్మలు కూడా కొడదామని చేతులెత్తడాలు చూస్తున్నాం. వీరికెవరిచ్చారీ కొట్టే అధికారం. ప్రోగ్రాంకి వచ్చిన వారంటే అంత అలుసా?. అయినా ఇంకొకరి ప్రాబ్లంని పబ్లిక్ గా చూపిస్తూ డబ్బులు సంపాదించాలనుకోవడం, ఎంత లేకితనం!!. టీవి ఛానల్సనీ ఆపలేం, బాధల్లో పరిష్కారాల కోసం  వెతికే తోటి మనుషులనూ ఆపలేం, కానీ గౌరవ ప్రదమైన ప్రొఫెషన్స్ లో ఉండే లాయర్లూ, కౌన్సిలర్లూ, హ్యూమన్ డిగ్నిటీని కించపరిచే ఇటువంటి ప్రోగ్రాంలకు దూరంగా ఉంటారని ఆశిద్దాం.

3. రాజకీయాల్లో పదాల మార్పులు

1."ప్రతిపక్షం" అనడంలోనే, ఆ పదంలోనే దాన్ని తీసి పక్కన పడేయడం ఉంది.
ప్రతిపక్షం పదాన్ని "ప్రత్యామ్నాయ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి...మీరేమంటారు??.

2.దక్షిణ పక్షం అనే పదమే లేనపుడు, "వామ పక్ష"మనే పదమెందుకు వచ్చింది?. ఇది కూడా పక్కకు తోసేసే ప్రయత్నమే.
ఉదయించే సూర్యుడు సింబాలిక్ కాబట్టి "తూ రుపు పక్షం" లేదా "అరుణ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి....మీరేమంటారు?.

4. స్వచ్ఛ భారత్ వీధి నాటకంలో చీపురు పట్టుకుంది వీధి ఊడవటానికి కాదట!!
విద్యార్థుల్లో స్పూర్తి నింపి వీధంతా ఊడిపించటానికట

      విరించి విరివింటి
ఒక ముద్దులొలికే బుజ్జి పిల్లి మా వసారాలోకి ప్రతీ మధ్యాహ్నం వచ్చి, ఒక రెండు గంటలు ఆ వెచ్చటి సూర్యకాంతిలో చుట్ట చుట్టుకుని కునుకు తీస్తుంటుంది.కునుకునుండి లేవగానే, తన పాదాలమీద అలవోకగా లేచినిలబడి, వెన్నును చాచి వంచి ఆవలించి, ఆ తర్వాత తనొచ్చిన దారినే మెల్లిగా వెళ్ళి పోతుంది. ప్రతీ రోజూ అది అక్కడే పడుకుంటుంది, అలాగే పడుకుంటుంది. లేచి అదే విధంగా, అంతే మెల్లిగా వెళ్ళి పోతుంది.
పడుకోవడానికి, సేద తీరడానికీ, ఇంతకంటే వెచ్చనయిన, నిశ్శబ్దమైన ప్రదేశం, అపుడపుడూ పక్షుల కిలకిలరావాలు వినిపించే ప్రదేశం ఆ పిల్లి వెతికితే దొరకవచ్చు కూడా. కానీ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పలేం. వెతుకులాట అనేది వెంటనే ముగిసేదేమీ కాదు. వెతికింది దొరికిన తర్వాతైనా ప్రశాంతంగా నిద్రపోవటానికి ఎపుడోకానీ సమయం దొరకొదు.

నాకినిపిస్తుంటుంది, ఈ పిల్లి మహా జ్ఞానేమో అని. అలా అని చెప్పి నా ఉద్దేశంలో మరీ కఠినమైన నియమాలుగల జ్ఞాని కాదు. జ్ఞానం కోసం తదేక దీక్షతో మాత్రమే ఉండే వ్యక్తి ఎవరైనా, దానిని పొందుతాడని నేననుకోను. ఒక సుజ్ఞాని అనేవాడు, సాత్వికంగా, సున్నితంగా, ప్రపంచం పట్లే కాకుండా తన పట్ల కూడా కరుణతో ఉంటాడనుకుంటాను. కనిపించిన ప్రతీ ఉన్నతాన్నీ ఎక్కకపోవడమే సబబని అతడు తెలుసుకుని ఉంటాడు.

నిజమైన జ్ఞాని ఐనవాడు తృప్తిని సంపాదించడం ఆనందాన్ని పొందగలిగినదానికన్నా సులువనీ, అదే చాలుననీ తెలుసుకుంటాడు.

A translation from A BOOK OF SIMPLE LIVING --by Ruskin Bond

My posts in fb

1.   మతం ఒక పజిల్, పద్మవ్యూహం.
పరమపద సోపానంలో ఉన్నట్లు ఇందులో విషనాగులుంటాయి, మెట్లూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటూకుంటూ సత్యాన్ని చేరటమే ఆధ్యాత్మిక సాధన

------------------

2-    చైనాలో ఆడపిల్లకు పెళ్ళి చేసి, భర్త తో పంపించేటపుడు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి కొన్ని సుద్దులు చెబుతూ  ఉంటారు మన దేశంలో లాగే.
ఆ సుద్దుల్లో ముఖ్యంగా చెప్పే అంశం "ఇంటి నిప్పు బయటకు పోనీయకు, బయటి నిప్పు లోపలికి రానీయకు" అని.
నిప్పు అంటే మాట అని అర్థం. నిజంగా మాట నిప్పువంటిదే, దానిని సరిగా ఉపయోగించుకోక పోతే అది తప్పకుండా కాల్చేస్తుంది.
ముఖ్యంగా సంసారానికి సంబంధించిన విషయాల్లో, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఇపుడు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రాంలలో ఇంటి నిప్పును తీసుకొచ్చి అందరి ముందరా ఆరేస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.
డబ్బులకు నటించే నటీమణులు, కౌన్సిలర్ల అవతారం కాదు, ఏ అవతారం ఎత్తమన్నా ఎత్తుతారు.
డబ్బులకు ఆశపడే టీవీ ఛానల్స్ అడ్డమైన ప్రతీ ఆలోచననూ ప్రోగ్రాంలాగా మలుస్తూ ఉంటారు,  క్రియేటివ్ జీనియస్ లు మరి.
ఈ సదరు ప్రోగ్రాంలను స్పాన్సర్ చేసే కంపనీలు, ఏ చెత్త ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేసేస్తారు డబ్బుల కోసం.
కాబట్టి ఈ నటీనటులనూ, టీవీ ఛానల్స్ నూ, ఆ స్పాన్సరర్లనూ అంతకు మించి గొప్పగా ఊహించడం కష్టం.
అందుకే, డబ్బులకోసం గడ్డితినమన్నా తినే గాడిదల మధ్యకు పచ్చని సంసారాన్ని తీసుకెల్లడం ఎంతవరకు అవసరమో, ఆ ప్రోగ్రాంలకు వెళ్ళే ప్రజలు నిర్ణయించుకోవాలి. చదువుకున్న లాయర్లు, కౌన్సిలర్లు కూడా, ఈ టీవీ ప్రోగ్రాంలకు ఎగబడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక లాయర్ దగ్గరికో, ఒక డాక్టర్ దగ్గరికో,ఒక పర్సనల్ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళినపుడు, పూర్తి ప్రైవసీని కలిగించడం ఆ సదరు ప్రొఫెషనల్స్ ల యొక్క మినిమం కర్టసీ. తమ బాధను చెప్పుకోవటానికి వచ్చిన వారితో పరాచకాలూ, పరిహాసాలూ చేయటం ఆ ప్రొఫెషన్ కే కళంకం. బయట ఎందరో తమ బాధను చూసి నవ్వుతారని నొచ్చుకునే కదా మనం వారి దెగ్గరకు వెళ్ళేది. ఇంక వాళ్లు కూడా ఆ మినిమం ప్రైవసీని కాదని గేలి చేయటానికీ, పదుగురిలో నవ్వుల పాలు చెయ్యటానికి తమ ప్రొఫెషన్ ని ఉపయోగించుకుంటే ఆ బాధాతప్త హృదయులకు దిక్కెవరు?. ఇలాంటి చెత్త ప్రోగ్రాములకు వెళ్ళే ప్రొఫెషనల్స్ ఈ విషయమై పునరాలోచించుకోవాలి.

కుటుంబాల్లో సమస్యలు ఉండవని కాదు. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఈ రచ్చకె్క్కడాలు కాదు. తమ తమ హ్యూమన్ డిగ్నిటీని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోలాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోక పోవటం వలననో, బీదరికం వలననో ఇంకెవరో తమ సమస్యలను తీరుస్తారని అనుకున్నపుడు చిత్త శుద్ధిలేని యాంకరమ్మలు కూడా కొడదామని చేతులెత్తడాలు చూస్తున్నాం. వీరికెవరిచ్చారీ కొట్టే అధికారం. ప్రోగ్రాంకి వచ్చిన వారంటే అంత అలుసా?. అయినా ఇంకొకరి ప్రాబ్లంని పబ్లిక్ గా చూపిస్తూ డబ్బులు సంపాదించాలనుకోవడం, ఎంత లేకితనం!!. టీవి ఛానల్సనీ ఆపలేం, బాధల్లో పరిష్కారాల కోసం  వెతికే తోటి మనుషులనూ ఆపలేం, కానీ గౌరవ ప్రదమైన ప్రొఫెషన్స్ లో ఉండే లాయర్లూ, కౌన్సిలర్లూ, హ్యూమన్ డిగ్నిటీని కించపరిచే ఇటువంటి ప్రోగ్రాంలకు దూరంగా ఉంటారని ఆశిద్దాం.

3. రాజకీయాల్లో పదాల మార్పులు

1."ప్రతిపక్షం" అనడంలోనే, ఆ పదంలోనే దాన్ని తీసి పక్కన పడేయడం ఉంది.
ప్రతిపక్షం పదాన్ని "ప్రత్యామ్నాయ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి...మీరేమంటారు??.

2.దక్షిణ పక్షం అనే పదమే లేనపుడు, "వామ పక్ష"మనే పదమెందుకు వచ్చింది?. ఇది కూడా పక్కకు తోసేసే ప్రయత్నమే.
ఉదయించే సూర్యుడు సింబాలిక్ కాబట్టి "తూ రుపు పక్షం" లేదా "అరుణ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి....మీరేమంటారు?.

4. స్వచ్ఛ భారత్ వీధి నాటకంలో చీపురు పట్టుకుంది వీధి ఊడవటానికి కాదట!!
విద్యార్థుల్లో స్పూర్తి నింపి వీధంతా ఊడిపించటానికట

      విరించి విరివింటి
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం" అన్నాడు శ్రీశ్రీ
కానీ ఈ ప్రపంచంలో ఏదో మూలన యుద్ధోన్మాదం లేని దేశం ఒకటుంటుంది.
మనదలాంటి దేశమే.
మంచికో చెడుకో మన పక్కలో బల్లెంలా మారిన శత్రువు
శాంతికాముకులైన మన దేశ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే,
ఇంకా శాంతి శాంతంటూ చేతులు ముడుచుక్కూచోవటం ఒకటైతే,
మనదేశంలోనే కుహానా విలాస విశ్వనరులు బయల్దేరి మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే...
నా దేశ సైనికుడు కనపడితే వాడు మీసం మెలేసేటందుకొక కవిత కావాలి.
అందుకే ఈ కవిత.

విరించి- llఒకింత గర్వ౦ కావాలిll
------------------------------------------

నా దేశానికొకింత గర్వం కావాలి
నా దేశ చరిత్రకొకింత గర్వం కావాలి
సరిహద్దుకవతల, సరిహద్దుకివతల అని
ప్రస్ఫుటంగా ఒక ముళ్ల కంచె,
నా కంటికెపుడూ కనిపిస్తూండాలి.

గాలికెగిరొచ్చిన శత్రు దేశ మట్టినయినా
బూటుకాలితో ఈ దేశ భూమిలోకి నేను తొక్కేయాలి.
అటువైపునుంచి చొచ్చుకొచ్చిన పిల్లగాలినైనా నేను
ముక్కుతో పీల్చి నోటితో ఉమ్మేయాలి.
నా దేశ జండా ముందు అటెన్షన్ తో సెల్యూట్ కొట్టినపుడు
గుండె దడ మీద గర్వం దరువేయాలి

నేను కర్కశంగా ఉండనేకూడదని
నీవెందుకనో సూత్రీకరిస్తుంటావు
నేను శాంతంగా మిన్నకుండటమే
మానవత్వమని నీవక్కడక్కడా వాపోతుంటావు
నీ లెవలుకు తెలిసేదా రెండు ముక్కలే
యుద్ధమంటే నీ ఇంటిముందు నల్లా దగ్గరి పోట్లాట కాదు
శత్రువంటే పక్కింటి సత్తిగాడూ కాదు

అరే...యుద్ధంలో నన్ను బతికించేది
నీ శాంతి వచనాలు కాదు
చీల్చుకు వచ్చే శత్రువు ముందు నన్ను నిలబెట్టేది
నీ కుహానా విశ్వ ప్రేమలు కాదు
నా యూనీఫాం, నా తుపాకులూ, నా తూటాలూ
నెత్తి మీది టోపీ, కాలి బూట్లూ,
గుండెలోని ధైర్యమూ ఇవేవీ కాదు.
ఒక్క భారతీయుడననే గర్వం తప్ప.
అందుకే...
నా దేశానికొకింత గర్వ౦ కావాలిపుడు

5-10-16

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.
.....................................................

ఇపుడు భారత దేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోందా లేదా అన్న విషయం ఎంతో ప్రాముఖ్యమైనది. పాకిస్థానుతో మనం యుద్దం చేయటమా చేయకపోవటమా అనేది ముఖ్యం కాదిక్కడ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మనం తల మీద మోస్తున్న భారాన్ని వదిలించుకోగలమా లేదా అన్నది ప్రశ్న. దానికై యుద్ధం ఒక మార్గం మాత్రమే, బహుశా చాలా బలమైన సమర్థవంతమైన మార్గం కూడా కావొచ్చు. మన ఆసియా దేశాలనే తీసుకుంటే, తూర్పు ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియా, తైవాన్, హంగ్ కాంగ్, సింగపూర్ లు అభివృద్ధిలో పశ్చిమ దేశాలవలే చొచ్చుకుపోతున్నాయి. మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేసియాలు కూడా వడివడిగా అటు వైపే అడుగులు వేస్తున్నాయి. మధ్య, సౌత్ ఏసియన్ దేశాలలో ఉండే మనం మాత్రం పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే దశాబ్దాల వెనుక పడి ఉన్నామన్నది వాస్తవం. ప్రపంచ జనాభాలో దాదాపు డెభ్భై శాతం మన ఆసియా దేశాల్లోనే ఉన్నా గానీ, మనం ఆధునిక నాగరికతని నడిపించే పగ్గాల్ని మాత్రం పశ్చిమ దేశాలకు అప్పగించేసి, అంతర్గత కుమ్ములాటలలో పడిపోయి ఉన్నాం. నిజానికి ఈ ఆసియా దేశాల మధ్య యుద్ధాలు జరగటం అనేది పశ్చిమ దేశాలకు బాగా కలిసొచ్చే విషయం. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు ఉత్పత్తి చేసే దేశం అమెరికా అయితే, మధ్య ప్రాచ్యం అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తూన్నది. ఈ లెక్కన మన మధ్యన యుద్ధాల్ని కోరుకునే వారిలో ముందెవరుంటారో చెప్పనవసరం లేదు. అంతే కాక యూరోప్ లో పదహారవ శతాబ్దంలో రెనీసాన్స్ ఆ తరువాత పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామికీకరణ జరగనంత వరకూ ప్రపంచాధిపత్యం ఆసియానే వహిస్తూ వస్తోంది. వలస వాదం కూడా జత కావడంతో ప్రపంచ పటం లోని ఆసియా ఆధిపత్యం తారుమారై యూరోప్ చేతిలోకి పోయింది. ఇప్పటికిపుడు యుద్ధోన్మాదాలు, మత భావజాలాలు లేని ఆసియాను పశ్చిమ దేశాలు ఊహించలేవు సరి కదా, తమ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండటం కోసం, కనీసం ఆశించవు కూడా..

ఆసియాలో పెద్ద దేశాలైన చైనా ఇండియాల మధ్య స్పర్థలూ, మధ్యలో చిన్న దేశం పాకిస్థాన్ లో అంతర్గత పోరాటాలు, ఇండియా పాకిస్థాన్ పోట్లాటలూ, వాస్తవానికి పశ్చిమ దేశాలకు కలిసొచ్చే అంశం. రెండు ప్రపంచ యుద్ధాల్లో విపరీతంగా నష్టపోయిన బ్రిటన్, ఫ్రెంచ్, జర్మనీ దేశాలకు యుద్ధమనేది ఇపుడొక చరిత్రగా మాత్రమే మారుతోందనిపిస్తోంది. అవి వాటి మధ్య ఉండే సమస్యలను యుద్దాలతో పరిష్కరించుకోవాలనే పిచ్చి ఆలోచనను ఇప్పట్లో చేస్తాయనిపించట్లేదు. లౌకిక వాదం, పారిశ్రామికీకరణ, ప్రజాస్వామ్యం వంటి ఆయుధాలను చేబట్టి పశ్చిమ దేశాలు ముందుకెల్తూన్న సమయంలో మన ఆసియా వ్యవస్థల్లో ఈ భావాలు సగం సగాలుగా, అటూ ఇటూ కాకుండా కలగాపులగంగా తయారయ్యాయి. మతాలకూ తీవ్రవాదాలకూ ఎంత లంకె పెట్టామో, మతాలకూ రాజకీయాలకూ అంతే లంకె పెట్టుకున్నాం. అఫ్ఘానిస్థాన్ లో ప్రగతిశీల నజీబుల్లాను కిందికి తోయడానికి తాలీబాన్లను ఉపయోగించుకున్న అమెరికాకు, మన సమాజాల తెలివితేటలల స్థాయి ఏమిటో తెలియదని అనుకోలేం. ఇప్పటికీ మన ఆసియా సమాజాల్లోని మేధావులు పురాతన కాలంలో లాగానే మతానుయాయులుగా, మత వ్యతిరేకులుగా విడిపోయి మాత్రమే పోట్లాడుకుంటున్నారు తప్ప( మత వ్యతిరేకత కూడా మతం చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి, అదేదో గొప్పగా,ఊడొచ్చి పడిన ఫిలాసఫీ కాదనేది గ్రహించాలి), యూరోపియన్ మేధావుల్లాగా మతాతీతులుగా, కొత్త ప్రపంచాన్ని కనీసం ఊహించనైనా ఊహించటం లేదనిపిస్తోంది. ఈ కారణాల వల్లనే కావచ్చు బహుశా ఈనాటికీ మనం యూరోపియనులకంటే తక్కువవారమనే భావాన్నే మోస్తూ, మన సొంతమైనటువంటి నూతన నాగరికతా విధానాన్ని దేన్నీ ప్రపంచానికి అందివ్వలేకున్నాం.

మన ఆలోచనా స్థాయి పెరిగినపుడు మాత్రమే మన దేశాలమధ్య జరుగుతూన్న ఘర్షణలు పశ్చిమ దేశాలకు ఆహారాన్నందిస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. కనీసం తోటి ఆసియా దేశమైన జపాన్ ని చూసయినా మనం బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం ఉంది. మన అంతర్జాతీయ సంబంధాలు, పక్క దేశాన్ని బూచిగా తనను తాను శుచిగా చూపించుకోవటానికి తప్ప ఒక్క నూతన సామాజిక ఆవిష్కరణాకూ ఉపయోగ పడటం లేదన్నది వాస్తవం. ఈ లెక్కన, పశ్చిమ దేశాలన్నీ ఏవో అత్యద్భుతాలు చేసేస్తున్నాయనీ కాదు, వాటి సమస్యలు వాటికున్నాయి, కానీ అవి కాలానుగుణంగా ఆలోచించడం నేర్చుకున్నాయి, మనం ఆలోచించటమే మానివేశాం. అవి సమస్యలను పరిష్కరించుకునే స్థాయి, మన స్థాయికంటే ఉన్నతంగా సహజంగా మేథోపరంగా ఉంటే, మనవి ఇంకా పాత చింతకాయ పచ్చడిని తలపిస్తున్నాయి. ఇపుడు పాకిస్థాన్ తో మనకున్న సమస్యనే తీసుకుంటే యుద్ధం చేయాలా వద్దా అనేదానికి కూడా రాజకీయ కార్యాకారణ సంబంధాలు, వోట్ల వ్యూహ ప్రతివ్యూహాలూ ముందరేసుకుని కూర్చుంటాం. మనకు సిగ్గుండదు, ఎందుకంటే మనం ఆలోచించం. అరే..! ఎడతెగని ఈ సమస్యను ముందు పరిష్కరించుకుని, ఇంకొంచం ముందుకు పోదాం అనుకోము. ఒక చిన్న పాటి భూభాగం కోసం తరాల తరబడి తల బద్దలు కొట్టుకుంటాం. దీనికి పైగా సామ్రాజ్య కాంక్ష అని బోడి పేరొకటి పెట్టుకుంటాం, నవ్వి పోవుదురు గాక. ఇదే సామ్రాజ్య కాంక్ష ఐతే, మన మధ్యన చిచ్చుపెట్టి ఆయుధాలమ్ముకుంటున్న అమెరికాది ప్రజారంజకమా?. ఇక బానిసత్వమూ, పురాతన మత భావజాలమూ తలకెక్కిన వాళ్లు యుద్ధం రాకమునుపే యుద్ధం శాంతికి విఘాతమని కోడై కూస్తూ ఉంటారు..అరే!!  ఏదీ యుద్ధం? ఏది శాంతి?. తరాలబడి జరిగే తెలివి తక్కువ యుద్ధానికి చరమ గీతం పాడటం, శాంతికెట్లా విఘాతమౌతుందో ఈ మహా మహా మేధావులే చెప్పాలి. వీళ్లను చూస్తుంటే ప్రజా చైతన్యం మన దేశం వరకే రాలేదు, ఇక ఆసియా అంతటా వచ్చేస్తుందనుకోవటం ఎంతటి మూర్ఖత్వం అనిపిస్తుంటుంది. ఇపుడు మనకు మన దేశాన్నో పక్క దేశాన్నో నడిపే నాయకుడు సరిపోడు. మొత్తం ఆసియాను ఒక దేశంగా పరిగణించి తుర్పును మొత్తంగా సూర్యోదయం చేయించగల నాయకుడు కావాలి. అది జరిగితే తప్ప పశ్చిమ దేశాలాడే యుద్ధమాట ఆగడం అనేది సాధ్యం కాదు. అలా జరిగితేగానీ ప్రపంచంలో శాంతి అనేది ఏర్పడటం సాధ్యపడదు. ఇకనైనా ఒక దేశంగా కాకుండా ఒక ఖండంగా ఆలోచిచండం నేర్చుకుందాం.
                       ---- విరించి విరివింటి

Friday, 30 September 2016

కవిత్వ సందర్భం 26 kondepudi

Brain drain returns without heart
---------------------------------------------------------------------------------

ఒక ప్రపంచ పటాన్ని తీసుకుని చేతిలో నలిపివేస్తే, దేశాలన్నీ ముడుచుకుని దగ్గరయినట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి ఒక సింబాలిక్ ఇమేజ్. దేశాల మధ్య భౌతిక దూరాలే తరిగాయి. ప్రాక్ పశ్చిమ దేశాలుగా విడిపోవటమన్నది పొరలు పొరలుగా బహురూపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో మార్పు ఊహించనంత వేగంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ వేగానికి తట్టుకుని తమ తమ జీవిత విధానాల్ని, మానవ సంబంధాల్నీ మార్చుకుంటూ బతక నేర్చిన వారు ఒక వైపూ, మార్చుకోలేక, లేదా మార్పును అందుకోలేక వెనుకబడిపోయే వారు ఇంకోవైపూ కనిపిస్తూ ఉంటారు. మార్పు అనే పద్ధతి ద్వారా మనకు తెలియని భవిష్యత్తు మన జీవితాల్ని నిర్ధాక్షిణ్యంగా తొలిచేస్తూనే ఉంటుంది. "కాలం గడిచేకొద్దీ, సామూహికత్వం నుండి వ్యక్తివాదం వైపుకు పశ్చిమ దేశాలు స్వయం ప్రేరణతో సహజంగానే నడిస్తే, ఎలాంటి స్వయం ప్రేరణా లేక కేవలం పశ్చిమ దేశాలతో ఏర్పడిన పరిచయ ప్రభావం చేత మాత్రమే తూ ర్పు దేశాలు వ్యక్తివాదం (individualism) వైపు నడిచాయంటారు" శ్రీ అరవిందులు. భారత దేశంలో ఆధునిక టెక్నాలజీని అందుకుని, విదేశీ చదువులు చదివిన వారు, విదేశాల్లో నివసిస్తున్నవారు, ఆ పశ్చిమ సమాజాల పరిచయ ప్రభావానికి లోనైనపుడు, తీవ్రమైన ప్రవర్తనా మార్పులకు లోనవటం సహజం. వాళ్ల ప్రవర్తనల్లో వచ్చిన మార్పు, వ్యక్తిగతంగా వాళ్లు గుర్తించలేక పోవచ్చు. కానీ స్వంత దేశానికి తిరిగి వచ్చినపుడు, తోటి బంధువులూ స్నేహితులూ, వ్యక్తి వాదాన్ని మోసుకొచ్చిన ఈ కొత్త మనిషిని అర్థం చేసుకోవటానికి ఇబ్బంది పడతారు. వ్యక్తి వాదంలోంచి పుట్టుకొచ్చిన కొత్త మానవ విలువలనీ, మానవ సంబంధాలనీ చూసి, ఏది నిజమనే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. డెట్రాయిట్ నుండి సొంత ఊరికి తిరిగి వచ్చిన తమ్ముడిని, ఆ సందర్భాన్నీ కవిత్వం చేస్తూ, ఎన్నో ఆసక్తికర విషయాల్ని చర్చిస్తారీ కవితలో కవయిత్రి కొండేపూడి నిర్మల. ఇదొక చారిత్రక సందర్భానిది. విదేశాల్లో కొడుకు లేదా కూతురున్నారని గొప్పగా చెప్పుకునే 'ఐటీ బూమ్' పెచ్చరిల్లుతున్న సందర్భం. ఆ సందర్భంలోని ఒకానొక కుటుంబం అందులోని అనుబంధాలూ, మానసిక ఘర్షణలూ అన్నీ ఈ కవితలో ఇమిడిపోయి కనిపిస్తాయి.

కుటుంబం, విద్య, మతం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం అని సమాజంలో ఐదు ప్రాథమిక వ్యవస్థలుంటాయి (primary institutions of society). ఇవన్నీ కూడా మనిషి మనసుకీ అతని అవసరాలకీ, చుట్టూ ఏర్పడిన పరిస్థితులకీ అనుగుణంగా మార్పులు చెందుతూ నే ఉంటాయి. ఈ శతాబ్దపు ఆధునిక జీవితం, ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వాలపై విపరీతంగా ప్రభావితం చేసింది. మతం గానీ, విద్య గానీ అందుకు అనుగుణంగా మలచబడ్డాయి. చివరకు కుటుంబం కూడా ఈ ఆధునిక పోకడలను అందిపుచ్చుకోవడానికి విచ్ఛిన్నం చెందటం ప్రారంభించింది. కుటుంబం చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అఘాతాలకు షాక్ అబ్సార్బర్( shock absorbers) గా పని చేయాల్సింది పోయి, ఆ కుటుంబాలే షాక్ కి గురవుతున్నాయి. ఆధునిక నగర సమాజంలో కుటుంబం నిర్వహించాల్సిన బాధ్యతలను, ఓల్డేజ్ హోం లూ, క్రష్ లూ, కౌన్సిలింగ్ సెంటర్లూ వంటి కొత్త సంస్థలు నిర్వహిస్తూ, సమాజంలో కుటుంబ పాత్రను( role of family in society) శూన్యం వైపు నడిపిస్తూన్నాయి. నగరీకరణ తెచ్చే నూతన సమాజాన్ని, వెస్ట్ భౌతికంగానూ మానసికంగానూ కూడా అర్థం చేసుకోగలిగింది. ఇండియా వంటి దేశాలు భౌతికంగా దానిని అనుసరిస్తున్నాయే తప్ప, మానసికంగా గ్రామీణ వ్యవస్థతో ఇంకా పెనవేసుకుని ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు వ్యవస్థల నడుమ వేలాడుతూ  సందిగ్ధావస్థలోనే ఉన్నాయి. ఈ కవితలో కవయిత్రి నిర్మల ఆ సందిగ్ధావస్థలో కనబడతారు. కానీ అంతర్గతంగా ఈ మార్పును వ్యతిరేకిస్తూ గ్రామీణ సమాజాన్ని కోరుకున్నట్టుగా చూస్తామీ కవితలో. గ్రామీణ సామూహిక తత్వానికీ, నాగరిక వ్యక్తి వాదానికీ జరిగే ఘర్షణను అక్కా తమ్ముళ్ల పాత్రల ద్వారా ఆవిష్కరిస్తారు.

ఈ కవితలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ముందుగా కవిత రూపంలో మనకు ఆ సందర్భాన్ని చెబుతున్న అక్కగా కొండేపూడి నిర్మల. విదేశాలనుంచి తిరిగి వచ్చిన ఆమె తమ్ముడిని చూసి, మనతో మాట్లాడుతుందీ కవితలో. సూర్యోదయాన్ని తమ్ముడి కంటే పదిగంటలు ముందుగా చూడగలిగిన ఒక భౌగోలిక అద్భుతంలో ఉన్న ఆమె, తన తమ్ముడిన చూసిన తరువాత అతడికంటే ఎంతగానో వెనుకబడి ఉన్నానని గుర్తిస్తుంది. అల్విన్ టఫ్లర్ చెప్పే ఫ్యూచర్ షాక్( Future Shock) వంటిదిది. చిన్నప్పటి ప్రపంచ పటానికీ, ఇపుడు నలిగిపోయి ముడతలు పడి ఉన్న ప్రపంచ పటానికీ ఉన్న పోలికలను సింబాలిక్ గా అర్థం చేసుకుంటుంది కవయిత్రి. శత్రు వ్యూహాలూ, వ్యాపార సంబంధాలూ కొనసాగించే దేశాలు, అక్కా తమ్ముళ్ల అనుబంధాల్ని కూడా వెట్టితో, వలసలతో ప్రభావితం చేయడం చూస్తుందామె. ఖచ్ఛితంగా చిన్నప్పుడు తను చూసిన తమ్ముడైతే కాదతను. కొత్త విలువలు, కొత్త అనుబంధాలూ నేర్పే మరో ప్రపంచానికి చెందిన తమ్ముడిని చూస్తుందామె.

ఇక తండ్రి పాత్ర. రోజూ కట్టుకునే చీరల్ని కొనీయటానికి విసుక్కునే ఆ తండ్రి, తమ్ముడు విదేశాలనుండి వస్తున్నాడని తెలియగానే, ఇల్లు పీకి పందిరేసినంత హడావుడీ చేయటం. దానికై లక్షలు ఖర్చు చేయటం. కానీ తను చనిపోయిన తరువాత, అంత్య క్రియలకు కూడా ఈ కన్న కొడుకు రాడని తెలియదా తండ్రికి. ఒక మనిషితో ఇంకో మనిషికుండే అనుబంధం, మరణం వరకూ కొనసాగుతుంది. మరణం తరువాత ఆ మనిషి ఉనికే ఉండడు. చివరిసారిగా ఆ మనిషిని స్మరించుకునే అంత్య క్రియలకు కూడా రాని, రాలేని పరిస్థితి చూస్తే ఈ సమాజం మనుషులను ఎంత కఠినంగా తయారు చేసేసిందో అర్థమవుతుంది. తనను కనీ పెంచిన తల్లి తండ్రులను అవసాన దశలో దగ్గరుండి చూసుకోలేని, తోడు ఉండలేని స్థితిని ఆధునిక జీవితం, కన్వీనియంట్ గా మభ్యపెడుతుంది. తండ్రి చనిపోయినప్పుడు, ఆ అంత్యక్రియల వ్యవహారమంతా వీడియో తీసి పంపితే చూడటమో, స్కైప్ లో చూడటమో జరగటం, వ్యక్తి తన జీవితంలో కనిపించని శక్తుల మధ్య పరాయీకరణ (Alienation) చెందాడనటానికి తార్కాణం. అంతేగాక, వాటిని వీడియోల్లో చూసి కన్నీరుమున్నీరవటమన్నది ఈ సమాజంలోని, తనలోని నిస్పృహ(insensitivity)ను చూసి బోరున విలపించలేని అశక్తత తప్ప, ఇంకోటి కాదు. పైగా ఈ ఆధునిక పోకడలను సమర్థించుకోవడానికి తగినన్ని కారణాలు, పాత సెంటిమెంట్లను వదిలించుకోవడానికి వీలైనన్ని బహానాలూ ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి.
ఇక తల్లి పాత్ర. ప్రేమనే పాకంతో అరిసెలనూ, పూత రేకులనూ, సున్నుండలనూ తయారు చేసి కొడుకుచేత తినిపిస్తుంది. కానీ బిజీ బిజీగా తీరికనే లేనట్టు కనిపించే కొడుకుతో మాట్లాడటానికి, ఇంటర్వ్యూకోసం అపాయింట్మెంట్ తీసుకోవాలసిన పరిస్థితిలో ఉంటుంది. ఇక విదేశీ వస్తువుల మీద మోజు పెంచుకునే పెద్దమామయ్య, ఇంపోర్టెడ్ మొగుడికోసం ఇంపోర్టెడ్ కలలు కనే పక్కింటి పారిజాతం, విదేశాలనుండి వస్తున్నాడు అనగానే, సెంటు బాటిల్ల కోసం, గడ్డం బ్లేడుల కోసం, వాలిపోయే బంధు మిత్ర గణం. ఇవన్నీ నిజ జీవితంలో కనిపించే పాత్రలే.

ఇక తమ్ముడి పాత్ర. ఒక ఆధునిక జీవితానికి ప్రతీక. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలకంటే ఎక్కువగా చూడలేని సమాజానికి చెందిన పాత్ర. వ్యక్తి వాదం ముందు, అన్నీ సెంటిమెంట్లనూ 'ఐ మిస్స్డ్ యూ' వంటి కొన్ని తేలిక పదాలతో ప్రకటించేసి చేతులు దులుపుకునే ఒక పాత్ర. పాత చెక్క ఆట బొమ్మను జీవితాంతం కార్డ్ బోర్డ్ లో దాచుకున్న తరం నుండి, కొద్ది రోజులు ఆడుకున్న బార్బీడాల్ ను పాతగయిందని, ఎక్చేంజ్ ఆఫర్ కింద కొత్తది కొనుక్కునే తరానికి మార్పు చెందుతున్నామంటాడు అల్విన్ టోఫ్లర్. శాశ్వతత్వం నుంచి తాత్కాలికత్వానికి మన సంబంధ బాంధవ్యాలూ, అనుభూతులూ, మారిపోయినపుడు ఆ మార్పు రక్త సంబంధంతో పెనవేసుకున్న కుటుంబ సభ్యులమధ్య స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాల్యంతో పెనవేసుకుని పోయిన ఇంటిని అపార్ట్ మెంటుకిచ్చి, కొంత డబ్బు వెనుకేసుకోవటం, నాన్న అంత్య క్రియలను వీడియో తీయమని చెప్పటం, తీయనందుకు అక్కపై అలిగి మాట్లాడక పోవటం, నాలుగేళ్ల కోసారి వచ్చినపుడు, ఐ మిస్డ్ యూ అని కౌగిలించుకుంటే సరిపోతుందనుకోవటం, ప్రేమతో వండి చేసిన వంటలు తింటే ఆరోగ్యమేమవుతుందోనని డాక్టరు దగ్గర వాపోవటం వంటివన్నీ ఇప్పటికీ విదేశాల్లో కొడుకులుంటున్న ప్రతీ ఇంటిలో ఉండేవే. సెంటిమెంట్స్ లేని ఇన్సెన్సివిటీనే ఆధునిక ట్రెండ్ అయినపుడు బ్రెయిన్ డ్రెయిన్ హార్ట్ లెస్ గా తిరిగొస్తుంటుందనటానికి ఈ కవిత ఒక ఉదాహరణ.

ఊపిరాడ్డంలేదు

              కొండేపూడి నిర్మల
--------------------------------------

ఎంత  పండగ  పొద్దయినా
ఇండియా లో  పగలు  పన్నెండింటికి  నిద్ర లేచే  నా తమ్ముడు
ఉగాది  పచ్చడి  కోసం డెట్రాయిట్ నగరమంతా
తవ్వి బోర్లిన్చాడ్టా

పొరుగింటి పుల్లకూర  రుచే మరి
స్కూల్ కెళ్ళే  వయసులో  కోకాకోల  నీళ్ళే
వాడి  కడుపు  నిండా  ప్రవహించేది
మార్చురీ  ఐస్ లా ధగధగ  లాడే విదేశి ఉప్పుతో
ఉజ్జాయింపు  తెలియక విసుక్కుంటూనే
అమ్మ  ఉలవచారు  కాస్తుంది
చారు కెరటాల్లో సత్యాగ్రహం చేసినవాల్లంతా
కొట్టుకుపోతున్నారు
లేబుల్స్  విప్పకుండానే మరో దేశం  వస్తువులు చేతులు మార్చే
ఏజెన్సీ ఉద్యోగి  మా పెదమామయ్య  వాగ్ధాటికి
స్వదేశి ఆత్మ బహిష్కరణ  జరుగుతూ వుంటుంది ,

వలస పోవడం కంటే భావప్రాప్తి  సిద్దించే కల  ఇంకొకటి  తెలీని
పక్కింటి పారిజాతం  ఇంపోర్టెడ్ పెళ్ళికొడుకు  కోసం ఎదురుచూస్తుంది
చిన్నప్పుడు  నాకూ తమ్ముడికి ఉమ్మడి ఆస్తిగా
ప్రపంచ పటం ఒకటి  గోడకి వేలాడేసి  వుండేది
నిట్టనిలువుగా  ను౦చున్న సముద్రాలు
ఎడారుల్లోకి ఒలికి పోయినా
ఒకే సారవంతమయిన  నేల ఎందుకు పుట్టదో
తరగని  ఆలోచన నాకు
అప్పట్లో  కూడికలంటేనే ఇష్టం  మరి
వాడి దారి వేరు వాడిదంతా తీసివేతల పరిజ్ఞానం
ఎంతచిన్న  నదినయినా గట్టుకొక  పేరు చొప్పున విభజించాలనే
సమాచారం వాడే ముందు నాకు యిచ్చాడు
తమ్ముడు ఇంటికొస్తున్నట్టు కబురందితే చాలు
బిల్ క్లిoటనో, వాడి  తాతో కరుణించినoత
భయ సంబరాలు మా కళ్ళలో
కట్టుడు చీరలు కొనడానికి నసిగే నాన్న
లక్షలాది  రూపాయిలతో ఇంటికి ముస్తాబు చేయించాడు
గారడివాడో  చిలుక జోస్య గాడో వచ్చినంత
సంభ్రమంగా బంధు మిత్రులు చుట్టూ మూగారు

ఏ సంచి లోంచీ ఏ అద్భుతం బయటకు తీస్తాడో అని
నరాలు  తెగిపోయే౦త ఉత్కంట
గెడ్డం బేళ్ళు,  సెంటుబాటిళ్ళు, వాకీ టాకీలు
ఓహ్! ఒకటేమిటి  ఇల్లోక  స్మగ్లింగ్  కేంద్రంగా మారుతుంది
జారిపోతున్న పాము కుబుసాల్లాంటి  చీరలతో, లుంగీలతో
బొక్కబోర్లా  పడుతూ  గొప్పగా  నడవడం
మంచి  సర్కస్ లా  వుంది
ఎవర్ని చూస్తున్నా  పొట్లాలు  విప్పుతున్న చప్పుడే
అంటుకున్న కుటీర పరిశ్రమల తాలూకు  నిట్టాడ పాకల్లా
ఒకటే  చిటపటలు
ఎన్నాళ్ళుoటాడో  ఎప్పుడెగిరి పోతాడో తెలియక
అడిగేందుకు  ఇంటర్వూ దొరక్క
ముత్యాల గర్భం  వచ్చినంత  సందేహం మా అమ్మకి
ప్రేమనే  పాకం పట్టి  డబ్బాలకెత్తిన
అరిసెల్ని , సున్నుండల్ని, పూతరేకుల్ని తినేసి
గాలి, నీళ్ళు ,మనుషులు  వికటిస్తున్నారని
మా  డాక్టర్ దగ్గర  తమ్ముడు  కంప్లయింట్ చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ ఇన్నోవేటివ్  బ్రెయిన్  కదా
బాల్యానికి  చిహ్నంలాంటి  విశాలమయిన ఇంటిని కూల్చి
అపార్ట్ మెంట్ల కివ్వాలని  ఆలోచన  చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ  ఎమోషనల్  బ్రెయిన్  కదా
‘ ఐ మిస్సడ్ యూ ’ అంటూ  నాలుగేళ్ళకొకసారి  కావిలించుకొని
మేము నిజమనుకునే  లోగా  ఎగిరిపోతాడు
తమ్ముడిదెప్పుడూ  డాక్యుమెంటింగ్  బ్రెయిన్  కదా
నాన్న  అంత్య క్రియల్ని క్యాసెట్టు తీసి  పంపనందుకు
అలిగి  మాటలాడ్డ౦ మానేసాడు
వాడికంటే  పదిగంటల  ముందు  సూర్యోదయాన్ని చూడగల
ఒక బౌగోళిక  అద్భుతం లో వున్నా నేను
ఎక్కడో  ఎందుకో  వెనుకబడిపోయాను
దేశాల మధ్య  శత్రు వ్యూహాల్ని
శవాలు లెక్క తేలుస్తాయి
దేశాల  మధ్య  వ్యాపార  సంబంధాలు
అంకెలతో  సహా  దొరుకుతాయి
అక్కా తమ్ముళ్ళ  మధ్య  రక్త సంబంధం  ఒక  వలస
రాగ సంబంధం ఒక  వెట్టి
మనుషులందరూ  విండోస్ లో కిటకిటలాడ్డం మూలానో ఏమో
రోడ్ల  మీద  బరువు  లేదు
ముడతలు పడ్డ నా చిన్నప్పటి  ప్రపంచ పటం లా
దేశాలకు  దేశాలే  దగ్గరకు నొక్కుకుపోయాయి
ఆక్సిజన్  లోపమో.....ఇంకేమి  లోపమో
ఎవరికీ  ఊపిరాడ్డం లేదు

కవిత్వ సందర్భం26
14-9-16

Tuesday, 27 September 2016

దోమల బాధ, గాధ

దోమల బాధ, గాధ. A short notes on the way.
-----------------------------------------------------------------------
దోమలు లేని రాష్టంగా తయారుకావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమర్థించదగినదే, కానీ మనకులాగా దోమలకు రాష్ట్ర సరిహద్దులూ తెలియదు, రాజమౌళి ఈగ లాగా పారిపోవడానికీ పగబట్టడానికీ వాటికంత తెలువులు కూడా లేవు. రాష్ట్రాన్నంతా ఒక పెద్ద దోమతెరలో కుట్టేయకపోతే పక్క రాష్ట్రాలనుండి ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంటాయవి. మలేరియా, డెంగ్యూ ,ఎల్లో ఫీవర్ వంటి జబ్బులకు సంబంధించిన వ్యాధికారక క్రిములను దోమలు ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వ్యాపింప చేస్తూ ఉంటాయి. ప్రతీ యేటా ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలమందికి పైగా ఈ జబ్బుల బారిన పడి మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ మరణాల సంఖ్య కాస్త తగ్గినా, జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. నేటికీ ట్రైబల్ ఏరియాల్లో దోమల వల్ల విషజ్వరాలు సోకుతూ నే ఉన్నాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పనవసరం లేదు. ఆడదోమ గుడ్లు పెట్టడానికి నిలువ ఉన్న మంచి నీరు అవసరం కాబట్టి, ఇక ఆడదోమలకు వర్షాకాలం పండగనే చెప్పాలి. రెండు రాష్ట్రాలనూ వర్షాలు తడిపేస్తుంటే, ఏ పీ గవర్నమెంట్ దోమలు లేని రాష్ట్రంగా మారాలనుకోవటం హర్షణీయం.

అయితే దోమలని ఒక రాష్ట్రం నుండి పూర్తిగా నాశనం చేయటం సాధ్యమా..? అలా చేయటం శ్రేయస్కరమా అనేది చర్చించాల్సిన విషయం. దోమలలో దాదాపు 3500 రకాల జాతులున్నాయి. వాటిలో కేవలం 100 జాతులు మాత్రమే మనుషులకు ఈ భయంకర జబ్బులను కలిగిస్తున్నాయి. మిగతా జాతులన్నీ పూవుల మీద, పండ్ల మీదా, చిన్న కీటకాలమీద ఆధారపడి బతుకుతాయి. ఈ మిగతా రకాల దోమలు కూడా ఎన్నో పక్షులకు, చేపలకూ ఆహారంగా పనికొస్తూ ఉంటాయి. అంటే పర్యావరణ ఫుడ్ చెయిన్ (food chain) లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతే కాక ఈ దోమలు పుప్పొడిని పూవులకు అందించే బాధ్యతను కూడా నిర్వహిస్తాయి కాబట్టి, ఫలదీకరణలో ఎన్నో ఇతర కీటకాలవలె, ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోమలంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి, వీటన్నింటినీ నాశనం చేయాలనుకోవడం వలన ఈ ఫుడ్చెయిన్ తెగిపోయి ఇతర జీవులకు కూడా ఇబ్బందులను సృష్టిస్తాయని పర్యావరణవేత్తలంటారు. ఇంకో విషయమేమంటే ఈదోమలను చంపాలంటే రెండు రకాల మందులుంటాయి. లార్వీసిడల్ మందులు, దోమల గుడ్లు పొదగకుండా లార్వా దశలోనే నాశనం చేయగలిగితే, అడల్టీసిడల్ మందులు, లార్వాలు దోమలుగా రూపాంతరం చెందిన తర్వాత నాశనం చేస్తాయి. ఐతే ఈ మందులు కేవలం దోమలనే కాక ఎన్నో ఇతర క్రిమి కీటకాలను కూడా చంపుతున్నాయని, అందువల్ల ఇకో సిస్టం (eco system) సమతౌల్యం దెబ్బతింటూందని కూడా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. డేవిడ్ కామెన్ అనే సైన్స్ రైటర్ ఏమంటాడంటే..దోమలు మనుషులు చేసే పర్యావరణ విధ్వంసాన్ని సమర్థవంతంగా ఆపగలుగుతున్నాయని. ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ లు ఈ రోజుకీ మానవుల ఆక్రమణల బారిన పడకుండా బతికి మనగలుగుతున్నాయంటే కేవలం ఈ దోమలే కారణం అంటాడు. క్రూర జంతువులనైనా బంధించో చంపో ఆ అరణ్యాలను జయించగలడేమో గానీ, చిన్న చిన్న దోమలని జయించి బతకగలగటం సాధ్యం కాకపోవటం వలననే నేటికీ ఆ రెయిన్ ఫారెస్ట్ లు అలాగే ఉన్నాయంటాడీయన. అంటే మనకు తెలియకుండా ప్రకృతిలో దోమలు నిర్వహించే బాధ్యత ఎంతో అర్థం చేసుకోవాలి.

వ్యాధుల బారిన పడవేసే దోమల వృద్ధి జరగకుండా తగు సహజ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నిలువ ఉన్న మంచి నీరు ఎక్కడున్నా దోమలు గుడ్లు పెడతాయి. ముఖ్యంగా తెరచి వుంచిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరి వుంటుంది. వాటిల్లో లక్షల సంఖ్యలో దోమలు గుడ్లు పెడతాయి. కొబ్బరి బొండాలు తాగి అక్కడే పడవేయకుండా వీలైతే వాటిని ఇంటికి తెచ్చుకుని కాల్చేయాలి. అలాగే మనం బయట ఉంచిన నీటి బకెట్ లూ, చెత్త కుండీలు, నీల్ల టాంకులూ కూడా. వీటినన్నింటినీ గట్టిగా మూసి ఉంచటం వలన దోమలనువృద్ధి చెందకుండా చేయవచ్చు. వర్షాలు పడినపుడు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలువ ఉన్న నీటి మీద కొంత కిరోసిన్ లేదా, మంచి నూనె పోయటం ద్వారా, లార్వాలకు ఆక్సిజన్ సప్లై లేకుండా చేయవచ్చు. దోమల లార్వాలను తినే గంబూసియా వంటి చేపలను కుంటలలో పెంచటం కూడా ఒక మంచి పద్దతి. ఆ తరువాత దోమతెరలూ, ఆలౌట్ లూ ఎలాగూ ఉన్నాయి. అంతేకాకుండా మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రజలలో కొంత అవగాహన పెంచి సకాలంలో మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యన్గా ట్రైబల్ ఏరియాల్లో వర్షాకాలం లో తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. చివరగా చెప్పేదేమంటే, దోమ రహిత రాష్ట్రంగా మారాలి అనడం కంటే దోమల మీద అవగాహన పెరిగిన రాష్ట్రంగా తయారు కావాలి. దోమలన్నింటినీ చంపేయటం పరిష్కారం కాదని మనం గ్రహించాలి.    --- virinchi virivinti

Monday, 26 September 2016

Reply to Aranya krishna garu..on the debate over interview

అరణ్య కృష్ణ గారు మీరు ఈ ఇంటర్వూ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు.
మీరొక ఆసక్తికర చర్చను కూడా ఈ సందర్భంలో ముందుకు తీసుకొచ్చారు.
ఈ చర్చలో పాల్గొనే ముందు కొన్ని విషయాలు చెప్పాలి.
ఇది ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ కాదు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెల్లడానికి గంట ముందు నేను ఇంటర్వూ తీసుకోవాలని అనుకోవడమూ,
కారులో వెల్తూ వెల్తూ ఓ పది ప్రశ్నలను తయారు చేసుకోవడమూ జరిగింది. చిత్ర కళ మీద నాకున్న ప్రాథమిక అవగాహన ఆ ప్రశ్నలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడింది. రెండో విషయం నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని శ్రీనివాస్ గారిని కలిసిన తర్వాత చెప్పాను. ఆయన దానికి వెంటనే అంగీకరించటం జరిగింది. రాసుకున్న పది ప్రశ్నల్లో ఐదో ఆరో అడిగాను. మిగిలిన ప్రశ్నలన్నీ ఆ సమయంలో స్పాంటేనియస్ గా వచ్చినవే. ఇంటర్వ్యూలో ఉండే ప్రశ్న సమాధానం పద్ధతి కాకుండా, ఒక సంభాషణలా జరిగింది. ఆ సమయంలో సత్య శ్రీనివాస్ గారి అంతర్లోకాల్ని కొంత స్పృశించగలిగే ప్రయత్నం అనుకోకుండా జరిగిపోయింది. ఒక ప్రీ ప్లాన్డ్ కాకపోవటం వలననే, ఒక స్పాంటేనిటీ ఇటు నా వైపూ, అటు సత్య గారి వైపూ ఉండటం వలననే ఈ సంభాషణ వాదాల భీషణఘోషణలు లేకుండా స్వచ్ఛంగా వచ్చింది అనుకుంటాను. ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంభాషణలానే మీరుచూడాలి. వాదా వివాదాల దృష్టితో చూసినపుడు మీకు ఎన్నో అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటికి దూరంగా సంభాషణ జరిగినపుడు, మీరు వాటిలో అవి వెతకడం చేస్తున్నారేమోనని నా అనుమానం. ఇదెలా ఉంటుందంటే పోలీసు వాడు ప్రతీ ఒక్కరినీ అనుమాన దృక్కులతో చూస్తూ ఉంటాడు, వాడి ఉద్శోగరీత్యా..ఆ సమయంలో జరిగే పొరపాట్ల లాగా చెప్పవచ్చు.

ఇక రెండో విషయం, మీరు చర్చలో లేవనెత్తిన పాయింట్లు చూసినపుడు, మీరు ఇంటర్వ్యూ పూర్తి శ్రద్ధతో చదవలేదని నాకనిపించింది. మీలో ఈ అభాస జరగటానికి కారణం ఉంది. ఇంటర్వ్యూ చాలా పెద్దగా ఉండటం, చదవటానికి మొదలుపెట్టినపుడుండే శ్రద్ధ తరువాత్తరువాత తగ్గుతూ ఉండటం సహజంగా జరిగే పరిణామం ఎవరిలోనైనా. ఇంకోటేమంటే ఇంటర్వ్యూ ఒక విషయం మీదేకాదు, ఎన్నో అంశాల మీదకి మారుతూ ఉండటం వలన, ఈ అభిప్రాయమే ఫైనల్ వర్డ్ అనటానికి కూడా లేదు. ఆ కొద్ది సమయంలో ఉన్న స్పేస్ లో అదొక అభిప్రాయం. ఒక విషయం మీద ఒక సమయంలో ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండం, అదే విధంగా వేరు వేరు సమయాల్లో ఆ అభిప్రాయాల్నే మోస్తూ కూడా ఉండిపోం.  ఏ అభిప్రాయమైన ఫైనల్ కాదు, మనం అభిప్రాయాల్ని కాలానుగుణంగా మార్చుకుంటూ ఉంటాం కాబట్టి.

ఇకచర్చలోకి దిగుదాం.
-------------------------

Friday, 23 September 2016

Intro of The Voice of Colours

ఆయనొక కవి, పెయింటర్, ఫోటోగ్రాఫర్. గ్రామాల్నీ, ట్రైబల్ ప్రదేశాల్నీ, అడవుల్నీ తన విస్తృత పర్యటనల ద్వారా ఆత్మీకరించుకుని, ఆ ఆత్మని ఈ కళల ద్వారా వ్యక్తపరుస్తూంటారు. ఒక ఎన్విర్న్మెంటలిస్ట్ గా దేశ దేశాల సంస్థలతో సంబంధాలు నెరపుతూ, ప్రకృతిలోని సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ  అయన తనను తాను సిటీలో నివసించే ఒక సహజమైన వ్యక్తిగా మలచుకున్నారు. ఆయన ప్రకృతి ఆరాధన ఎంతటిదో ఆయన కవితలనే చదవనవసరం లేదు, ఆయన ఇంటిని చూసినా చాలు. తన కలలంటే ఎంతటి ఇష్టమో, గ్రామీణ జీవితమన్నా, స్వచ్ఛమైన ఆ మట్టి మనుషులన్నా ఆయనకు అంతే ఇష్టం. "20 మెమోయిర్స్" పేరిట హైదరాబాదులోని గోథే సెంటర్ లో మొదటి సారి తను గీసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు 'శ్రీ సత్య శ్రీనివాస్' గారు. తను జీవితంలో చూసిన ఎందరో గ్రామీణ అమ్మలను బొమ్మలుగా గీసి ప్రదర్శించారు. అమ్మలనే ఎందుకు గీశాడో తెలుసుకుందామని అనిపించింది. ఒక సాయంత్రం పూట, ప్రశాంతమైన వాతావరణంలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచిన గోథే సెంటర్ లోనే, ఆ అమ్మల చిత్రాల మధ్యనే ఈ మా సంభాషణ సాగింది. కళలకు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ, ఒక కళాకారుడిగా తన అంతరంగాన్ని కూడా ప్రదర్శనకు నిలిపినట్టుగా అనిపించింది ఆయనతో మాట్లాడుతుంటే. సత్య శ్రీనివాస్ గారికీ నాకూ మధ్య సాగిన ఆ సంభాషణలే "The Voice of Colours"  గా మీ ముందుకు తెస్తున్నాను.

                                                                                Virinchi Virivinti

Thursday, 22 September 2016

The Voice of Colours

Virinchi: ఏ కళలో అయినా రాణించాలి అంటే, గురువు ఉండాలి అంటారు.  చిత్రకళ (art of painting) లో మీకు గురువు ఎవరైనా ఉన్నారా?. వారి గురించి చెబుతారా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Satya Srinivas: ఈ కళ ను టెక్నికల్ గా నేర్చుకున్నది మాత్రం 'నరేంద్ర రాయ్' అనే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దగ్గరే. 1982 కాలంలో కేశవ మెమోరియల్ లో వారి దగ్గర నేర్చుకున్నాను. కానీ తరువాత నాకు చిత్రాలు వేయాలి అనే ప్రేరణ కల్పించింది మాత్రం ఇదిగో కనిపిస్తున్నారు గా ఈ అమ్మలే. ఒక రకంగా చెప్పాలి అంటే మనలో అంతర్గత ప్రేరణ కలగటానికి గురువులెందుకు?. గురువులు మనకు ఒక దారిని చూపిస్తారు...కానీ, నడవాల్సిందీ ఆ ప్రేరణ పొందాల్సిందీ మాత్రం మనమే. మన అంతర్గత ప్రేరణకు గురువులు నేర్పిన విద్య ఒక టెక్నిక్ ని అందించేదిగా, ఒక సహాయకారిగా ఉంటుంది. అసలు ప్రేరణే లేనపుడు, కేవలం టెక్నిక్ మాత్రమే ఏమి చేయగలదు. ఇంకో విధంగా చెప్పాలంటే మన ప్రేరణే మనకు అసలైన గురువు. ఆ రకంగా చూసుకుంటే, నరేంద్ర రాయ్ తో పాటు ఈ అమ్మలందరూ నాకు గురువులే.

V: ఈ అమ్మలు మీలో అంతగా ప్రేరణ కలిగించటానికి కారణం ఏంటి?. మిమ్మల్ని కదిలించేంతగా వారిలో మీరేం చూసారు!?
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
S: వారి జీవన విధానమే గురూ!  ఎన్విరోన్మెంటలిస్టు(environmentalist) గా నేను గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాల్లో, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ అమ్మలను దెగ్గరినుండి గమనించే అవకాశం కలిగింది. ఆ అమ్మల జీవితాలు, జీవన విధానాలే కాకుండా వారి ఉద్వేగాలు (emotions) నన్ను ఆలోచింపజేసాయి. అంతర్గత ప్రేరణ అక్కడ అలా మొదలయ్యి౦ది. ఆ తరువాత ఆ ప్రేరణే, నా చుట్టూ ఉన్న అమ్మలని కూడా అర్థం చేసుకోవటానికి ఉపయోగ పడింది. ఇపుడు నేను పోట్రెయిట్ గీసిన ఈ అమ్మల్లో చాలా మందితో నాకు అనుబంధం ఉంది. వారి జీవితం, వారి మానసిక ఉద్వేగాలు నాకు చాలా దగ్గరగా తెలుసు. వారి ఉద్వేగాలను నేను అనుభవించాను. అందుకే వారి ఉద్వేగాలకు ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. బొమ్మలు వేయటం, అందులోనూ పోట్రెయిట్స్ వేయటం నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకు ఇష్టమైన కళ లో నాకు ఇష్టమైన వ్యక్తుల పోట్రెయిట్స్ గీయాలని అనిపించి బొమ్మలు వేయటం మొదలుపెట్టాను.

V:  ఈ అమ్మలందరూ మీకు వ్యక్తిగతంగా తెలిసినవారే అన్నమాట.
------------------------------------------------------------------------------------------

S: అందరూ తెలిసిన వారు కాదు. ఈ అమ్మల్లో కొంత మంది నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా ఐతే మాత్రం నాకు తెలిసిన వారే!. ఎందుకంటే కొంత మంది మిత్రులు వారి తల్లుల ఫోటోలు నాకు పంపి బొమ్మలు గీయించుకున్నారు. అటువంటి అమ్మలు నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా నాకు తెలియకుండా ఎలా ఉంటారు?  వారిని తెలుసుకున్నప్పుడే నేను బొమ్మ గీయగలను. ఉదాహరణకు  మీరు మీ అమ్మ ఫోటో ఇచ్చారనుకోండి. నేను వెంటనే ఆమె బొమ్మను వేయలేను. ఆమెను అర్థం చేసుకోవటానికి నాకు ఆరునెలలు కూడా పట్టొచ్చు. ఆమె ఫీచర్స్ ఏంటీ?..ఆమె జీవితమేంటి అనేది నేను ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. బొమ్మ వేయటానికి మూడు గంటలు లేదా మూడు రోజులు పట్టొచ్చు..కానీ ఒక అమ్మను నేను అర్థం చేసుకోవటానికి చాలా కాలం పట్టొచ్చు. అర్థం చేసుకోనిది, ఎలా వేయగలను?. "అర్థం చేసుకోవాలంటే ఆమె జీవితం గురించి క్షుణ్ణంగా తెలియాలా..?" అని మీరు అడగొచ్చు. కానీ ఒక కళాకారుడిగా నేను ఏ అమ్మనైనా అర్థం చేసుకోగలను. ఆమె జీవితమంతా తెలియాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఇన్ట్యూషన్(intution) నన్ను ప్రేరేపింపవచ్చు. వీళ్ళంతా అమ్మలు కదా..వాళ్ల మనసుల్లోంచి వినిపించే 'లల్లబీ' ని నేను వింటాను. వారి ఫోటోలను చూస్తున్నప్పుడు వారి జోలపాటలే నాకు వినిపిస్తాయి. అమ్మ ఎవరికైనా అమ్మే కదా..! కొడుకుగా మారటం మనం నేర్చుకున్నపుడే వారి జోలపాటల్ని మనం వినగలం. At the end of the day, it is not just a painting for me. కేవలం పెయింటింగ్ మాత్రమే అయ్యేట్టయితే ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు. నాకు ఒక కథ కావాలి. ఆ అమ్మకు నాకూ మధ్య ఒక కథ ఉండాలి. అలా ఉన్నప్పుడే మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధానికి ఈ పెయింటింగ్ అనేది ఒక నిదర్శనంలా మిగులుతుంది.  అపుడు నేను గీసిన పెయింటింగ్, నేను అమ్మతనాన్ని అర్థం చేసుకోగలిగటం వల్ల నాలోంచి బయటకు వచ్చే ఒక ఉద్వేగం వంటిది. It is not a painting for me. Its my emotion. My art is an expression of emotional outburst from me.

V:  అయితే కళాకారుడికి తను సృష్టించిన కళారూపం అందరూ భావిస్తున్నట్టు ఒక నిర్జీవ వస్తువు ఎంత మాత్రం కాదన్నమాట. ఎవరికి ఎలాగా ఉన్నా, ఎలాగా అనిపించినా,  అతడికి మాత్రం అది సజీవమైన అంశమే అంటారు..
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ..! అది సజీవం కాలేనపుడు ఇక కళకు అర్థమే లేదంటాను. అది ఏ కళేగానీ..!  చిత్రకళలోని విశేషమేమంటే ఒక సజీవమైన అంశాన్ని నిర్జీవమైనటువంటి పనిముట్ల సహాయంతో సృష్టి చేయాలి. పేపరూ, రంగులూ నిర్జీవమైనవే కదా!...కళాకారుడు ఆ నిర్జీవ పనిముట్లకు ముందు ప్రాణం పోసి, తన సజీవ వస్తువును సృష్టించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎటువంటి సజీవ సృష్టి చేయడానికి ఎటువంటి పేపరు ఉపయోగించాలి?..ఏ రంగు ఉపయోగించాలి? అనేది ఆర్టిస్ట్ కి తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఈ బొమ్మ చూడ౦డి... ఈమె యాకూబ్ గారి తల్లి. ఈమె పోట్రెయిట్ కి 'గ్రామ దేవత' అని పేరు పెట్టాను. ఈమెను పట్టుకోవడానికి గరుకు టెక్ట్చర్ ఉండే ఇండియన్ పేపర్ ను వాడాను. అదే ఈ బొమ్మ చూడ౦డి ఈమె కవి సిద్ధార్థ గారి తల్లి. ఈమెను ఆక్వారెల్లీ పేపర్ మీద పట్టుకున్నాను.


V: ఓహ్...! పేపర్ టెక్చర్ ను కూడా వేయబోయే బొమ్మకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటారా!?. Interesting. మీరు యాకూబ్ గారి మదర్ కోసం ఈ రఫ్ టెక్చర్ ఉన్న ఇండియన్ పేపర్ని ఎంచుకున్నాను అన్నారు. ఆమె కోసం ఆ పేపర్నే ఎ౦పిక ఎందుకు చేసుకున్నారో వివరిస్తారా..?
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను యాకూబ్ తల్లిని చూశాను. నిజంగానే ఆమె గ్రామ దేవత. ఎపుడూ రొట్టమాకురేవు ఊర్లోనే ఉంటుంది. సిటీకి రమ్మన్నా రాదామె. ఒక వేళ హైదరాబాదులోని యాకూబ్ ఇంటికి వచ్చినా, బయటనే సోఫాలోనో, మంచం మీదో కూర్చుంటుంది, అక్కడే పడుకుంటుంది. ఇంట్లో పడుకోమన్నా పడుకోదు. ఎందుకంటే..ఆమెకు స్పేస్ కావాలి. మనకులాగా గదులు ముఖ్యం కాదామెకు. బయట కూర్చుంటే నలుగురు మనుషులూ తిరుగుతూ  కనిపించాలామెకు. ఊర్లో అలాగే ఉంటుంది మనుషుల జీవితం. వారికి నలుగురూ కలిసే ఉండాలి. సిటీలో ఒక గదిలో కూర్చోపెట్టి ఒక టీవీని వాళ్ల ముందు పెట్టేస్తే..వాళ్లస్సలు ఉండలేరు. టీవీ ముందే జీవితమంతా గడిచిపోతే ఒక మనిషికీ ఇంకో మనిషికీ మధ్య సంబంధం ఏముంటుంది?. అందుకే ఆమె సిటీలో ఉన్నా పల్లెలో ఉండే స్వచ్ఛమైన జీవితాన్నే కోరుకుంటుంది. విశాలమైన స్పేస్ నే కోరుకుంటుంది. ఇటువంటి అమ్మను పట్టుకోవాలంటే ఈ టెక్చర్ ఉన్న పేపర్ ని ఉపయోగిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. గ్రామ దేవతకు మనం రోజూ పూజలు చేయం. బోనాలు ప్రతి రోజూ ఎత్త౦. ప్రతీ శనివారం వేంకటేశ్వర స్వామిని పూజించినట్టు పూజించం. ఒక సందర్భంలోనే ఆ దేవతలను పూజిస్తాం. ఈ దేవతల ఉనికి అంతర్లీనమైనది. ఉదాహరణకు చెఱువు కట్ట మీది మైసమ్మ... కట్ట మీద ఆమె కొలువై ఉన్నందుకే ఆ కట్ట ఉంటుంది. మైసమ్మను అక్కడనుండి తొలగించి చూడండి, ఇంక చెరువూ ఉండదూ, కట్టా ఉండదు. అన్నింటినీ తవ్వేస్తారు. మైసమ్మ ఒక దేవత అనే భయం ఉండటం వల్ల, ఆ కట్ట అలాగే ఉంటుంది. ఆమె కనిపించకుండా ఆ చెఱువును కాపాడతూ ౦టుంది. అంటే ఊరిని కాపాడుతున్నట్టే కదా. ఆమె అక్కడి నుండి జరగదు. ప్రజలు కూడా ఆమెను అక్కడినుండి జరపరు. అట్లాగే యాకూబ్ మదర్ కూడా కనిపించకుండా ఆ వూరిని కాపాడుతూ  ఉంటుంది. ఆమె అక్కడి నుండి జరగదు. ఆమె అక్కడ ఉండటం వల్లే యాకూబ్ రొట్టమాకు రేవుతో అనుబంధాన్ని కొనసాగిస్తూ..ఆ ఊరికి పదే పదే వెళ్తూంటాడు. రొట్టెమాకురేవు అనే ఊరు, యాకూబ్ కి తల్లి ఐతే..యాకూబ్ తల్లి ఆ ఊరికి దేవత. ఊరికి చదువుకున్న పిల్లలు పదే పదే ఒస్తేనే కదా ఊరు కాపాడబడుతుంది. ఈమె కూడా కనబడకుండానే రొట్టమాకురేవును కాపాడుతూ  ఉంది. అందుకే ఆమెను 'గ్రామ దేవత' అంటున్నాను. చూడటానికి రఫ్ గా కనిపించినా ఈ పేపర్ మీద కలర్ అంత త్వరగా ఆరిపోదు. యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఇదే పేపర్ సరయినదని నాకనిపించింది. Its my intution.

V: ఇపుడు మీరు పేపరును సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాల్ని పరిగణలోనికి తీసుకుని మీ ఇన్ట్యూషన్ తో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే, కలర్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా...?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అవును. ఉదాహరణకు ఇదే యాకూబ్ మదర్ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో కేవలం బ్రౌన్ కలర్ మాత్రమే ఉంటుంది. బ్రౌన్ అనేది మట్టి కలర్.  జీవితాన్ని పట్టుకోగలిగిన కలర్. చక్కదనాన్నీ, వెచ్చదనాన్నీ (warmth) ప్రతిబింబిస్తుందీ కలర్. ఈ బొమ్మలో పై నుండి కింది దాకా బ్రౌన్ కలర్ లోని వేరియస్ షేడ్స్ నీ, టోన్స్ నీ చూపించాను. తన ఊరినీ, మట్టినీ ప్రేమించే యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఈ కలర్ అయితేనే బాగుంటుందని..ఈ కలర్ ని తీసుకున్నాను.

V: నిర్జీవ వస్తువులైన పేపర్ కలర్ వంటి వాటికి ప్రాణం పోయడం అంటే ఇదేననుకుంటాను. చిత్రకారుడికి తన వస్తువే కాకుండా పేపర్, కలర్ వంటి వాటి మీద కూడా పూర్తి అవగాహన ఉండాలనిపిస్తుంది మీ మాటలు వింటుంటే..!
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ...! ఏ కళాకారుడికయినా ముఖ్యంగా వాని ఇన్స్ట్రూమెంట్(Instrument) ఏంటో వానికి క్షుణ్ణంగా తెలియాలి. వీణ వాయించే వాడికి ఏ తీగను మీటితే  ఏ వైబ్రేషన్ వస్తుందో తెలియకపోతే వాడి మ్యూజిక్ అపశృతిలోనే ఉండిపోతుంది. ఇన్స్ట్రూమెంట్ ని అవగాహన చేసుకోలేక పొతే ఆ కళ కూడా నిర్జీవంగానే ఉండిపోతుంది. Knowing the instrument itself is an art.

V: ఓకే. ఉదాహరణకు మీరు ఇపుడు ఒక కాన్సెప్ట్ అనుకున్నారనుకుందాం. ఒక అమ్మను గీయాలి అనుకున్నారు. మీ ఊహల్లో ఆమెను 'ఇలా గీయాలి' అని ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచుకున్నారు. ఇపుడు బొమ్మ గీయటానికి ముందు, మిమ్మల్ని  మీరు ఎలా సిద్ధపరుచుకుంటారు?
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఊహల్లో ఒక రూపాన్ని గీసుకోవడం అంత సులువుగా జరుగదు గురూ..! ఒక్కోసారి ఆరు నెలలకు పైగా కూడా పట్టొచ్చు. ఈ ఫోటో చూడ౦డి, కవి సిద్ధార్థ మదర్ ఈమె. ఈమె ఎపుడూ నవ్వుతూ  నవ్విస్తూ ఉంటుంది. మా అమ్మతో అప్పట్లో పురాణ కాలక్షేపం వంటివి చేసేది. మా ఇంటికి చాలా సార్లు వచ్చేది. ఎపుడూ చూసినా నవ్వుతున్నట్టే కనిపించేది. ఫోటోలో కూడా నవ్వుతూ  కనిపిస్తుంది. ఆ నవ్వును నా బొమ్మలోకి నేను ఎలా పట్టుకోవాలి అనేది విషయం. ఆమెలోకి నేను వెళ్లాలి. లేదా ఆమెనన్ను ఆవహించాలి. ఆ మాతృత్వపు పరిమళాన్నీ, ప్రేమనూ నేను ఆస్వాదించాలి. అపుడే ఆమె నవ్వును నేను పట్టుకోగలుగుతాను. ఆ నవ్వును ఆమె కళ్ల లో చూపించాలి. మనిషి తన మనసుతో నవ్వేటపుడు కళ్లు చెమక్కుమని మెరుస్తుంటాయి. చిన్న పిల్లగాడి నవ్వులా స్వచ్ఛంగా ఉంటుంది. పైపై నవ్వు తెలిసిపోతుంటుంది. ఆమె నవ్వు అలా స్వచ్చంగా ఉంటుంది. ఈ బొమ్మలో ఆమె నవ్వును పట్టుకున్నాననిపించింది, అందుకే ఈ బొమ్మకు 'soulful smile' అని పేరు పెట్టాను. ఆమె నవ్వులోని ఆ స్వచ్ఛతను నా కలర్ షేడ్స్ లోకి తీసుకురాగలగటమే ఆ బొమ్మ వేస్తున్నపుడు నేను పట్టుకోవలసినది కాబట్టి నా prior preperation అంతా ఒక కొడుకుని కావటమే! నాకు బొమ్మ గీయటం ఒక ఉద్వేగ భరిత స్థితి తప్ప ఇంకేమీ కాదు. ఆ ఉద్వేగ స్థితిలోకి పోవటానికే నాకు సమయం పడుతుంది. ఒకసారి ఆ స్థితికి చేరుకున్నాక బొమ్మ గీయటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కోపం అనే ఒక ఎమోషన్ రోజుల తరబడి ఉండదు కదా! కొన్ని సెకన్లు ఉండొచ్చు. కొన్ని నిముషాలు ఉండొచ్చు. ఆ సమయంలోనే కొట్టడమో తిట్టడమో చేస్తాం కదా! ఇదీ ఆంతే.

V: అమ్మలనే చిత్రించాలని మీరు ఎపుడనుకున్నారు?. ఈ నిర్ణయం ఎపుడు తీసుకున్నారు?. ఎందుకు తీసుకున్నారు?. నా ప్రశ్నలో నాన్నలు ఎందుకు కాదు అనేది కూడా అంతర్గతంగా ఉందనుకుంటాను.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: (నవ్వులు) ఎపుడు నిర్ణయం తీసుకున్నాను అంటే ఇదమిత్తంగా చెప్పలేను..అంతర్లీనంగా నాకటువంటి భావన కలిగించింది మాత్రం గ్రామాల్లో నేను చేసిన పర్యటనలే అనుకుంటాను . మా నాన్న జర్నలిస్ట్ గా ఉన్నపుడు, చాలీ చాలని జీతాలు ఉండేవి. పెద్ద ఫ్యామిలీ మాది. అందుకే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉండేవి. సంపాదనలో పడి మమ్మల్ని చూసుకోవటానికి సమయం కూడా ఉండేది కాదాయనకు. అప్పట్లో మేము హైదరాబాదుకు కొత్త. ఇక్కడ మాకంతా భయంగా ఉండేది. ఉర్దూలోనే మాట్లాడాలనే నిబంధనుండేది. ఈ రోజు సత్య శ్రీనివాస్ ఒక కవిగా ఒక పెయింటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనుకుందాం. అంతేగాక, సత్య శ్రీనివాస్ అన్నలూ, చెల్లెళ్ళూ అందరూ వారి వారి రంగాల్లో సెటిలయ్యారు. ఒక్క సత్య శ్రీనివాస్ ఇంటి పరిస్థితియే కాదిది. దాదాపు అందరి ఇంటి పరిస్థితీ ఇదే. ఈ పిల్లలు గానీ, నాన్నలు గానీ ఇలా గొప్ప గొప్ప వాళ్లుగా తయారు కావటానికి కారణం ఎవరు?. ఇంటిలో ఉండే అమ్మలే కదా..? కనిపించకుండానే వాళ్లు ఇంత మందిని గొప్పవాళ్ళుగా తయారు చేశారు. అందుకోసమని తమ జీవితాల్ని ఎంతగానో త్యాగం చేశారు. పైగా ఈ అమ్మలు మననుండి గానీ, జీవితం నుండిగానీ ఏమీ ఆశించలేదు. అనామకంగానే ఉండిపోయారు. సంతోషాల్ని మాత్రమే పంచిపోయ్యారు. వీళ్ల స్టోరీస్ కూడా ఎక్కడా ఉండవు. గొప్ప వాళ్ల గురించే చర్చించుకుంటాం. ఫలానా వాడు గొప్ప కవి అంటాం. వాడు అలా తయారవటానికి కారణం ఎవరు?. మా అమ్మనే తీసుకోండి..కుటుంబాన్నంతా ఆమే నడిపింది. ఆమె మాత్రం ప్రపంచానికి తెలియకుండానే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయింది. ఆమెను నేనెందుకు ఈ ప్రపంచానికి పరిచయం చేయకూడదు?. ఒక మొక్క నాటుతాం. పంట వస్తుంది. అది అలా ఎదిగి రావటానికి మొక్క గొప్పతనం అనుకుంటాం, లేదా విత్తనం గొప్పదనం అనుకుంటా౦. నేల లేకపోతే..నేలలో సారం లేకపోతే మొక్క ఎలా బతుకుతుంది?. ఎలా ఎదుగుతుంది? ఈ అమ్మలంతా నేల సారం వంటి వారు. నాన్నల గురించి పిల్లల గురించి వారి గొప్పతనం గురించి లోకం లో ఎన్నో కథలున్నాయి. ఈ అమ్మల కథలు ఎవరు గుర్తించాలి? ప్రపంచానికి ఎవరు అందించాలి?. (పది సెకన్ల గంభీర మౌనం)
మీ ప్రశ్న కు సమాధానం దొరికిందనుకుంటాను. (నవ్వులు)

V: మీరు అమ్మల్లో గత తరం అమ్మల్నే తీసుకున్నట్టు ఉన్నారు. ఈ జెనెరేషన్ అమ్మలను బొమ్మలుగా వేయలేదని అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ లో ఈ తరం అమ్మలైతే నాకెవరూ కనిపించలేదు. ఇలా ఆ తరం అమ్మలనే ఎంచుకోవటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఈ జెనెరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు గురూ..! కానీ ఆ జెనెరేషన్ అమ్మలను వెతుక్కుని, వారిని ఎక్ప్లోర్ చేసుకుంటూ పోతే..వాళ్లు వందల వేల యేండ్ల వృక్షాల్లాంటి వారని తెలుస్తుంది. నీడనిచ్చారే తప్ప, ఏమీ ఆశించలేదు వాళ్ళంతా. కుటుంబం నుంచిగానీ, సమాజం నుంచి గానీ ఏమీ ఆశించకుండానే వారు ఒక తరాన్ని ముందుకు నడిపించినవారు. ఇంకోటి వీళ్లకు పెట్టే గుణముంది. మీ అమ్మమ్మనే ఒకసారి గుర్తు తెచ్చుకోండి...ఆమె ఇంట్లో నలుగురు ఉన్నా పది మందికి సరిపడా వండేస్తుంది. ఎపుడెవరు ఇంటికొచ్చి తింటారేమో అనే ఆలోచన ఆ కాలం వారికుండేది. ఆ ఇల్లులు కూడా పదిమంది వచ్చీ పోయే ఇల్లుల్లా ఉండేవి. ఇపుడెవరన్నా ఇంటికి వస్తున్నారంటే..ఫోన్ చేసి రావాలి అనుకుంటున్నాం. ఫోన్ చేసి రాకు౦టే విసుక్కుంటున్నాం. వాడికెంత వండాలి..? ఎంత తింటాడో అని ఆలోచించే కాలంలో ఉన్నాం.

V:  అప్పటి అమ్మలందరినీ మీ చిత్రాల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారనుకోవచ్చా...?
------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కాదు గురూ...ఆ తరం అమ్మలు అంతరించి పోతున్నారంటే, ఆ సమాజమే అంతరించి పోతున్నట్టు. ఆ పెట్టే గుణమే అంతరించి పోతున్నపుడు, ఒక అందమైన సమాజాన్ని నేను ఊహించలేను I cannot expect a beautiful society. When Im living in an inorganic society, how can I aspire for an organic relations between human beings?  ఈ అమ్మలను చిత్రించటం ద్వారా వారి ఆర్గానిక్ కల్చర్ ను నేను చిత్రించదలిచాను. ఈ రోజుల్లో 'ఆర్గానిక్' అనే పదం ఒక జోక్ గా మారింది. ఆర్గానిక్ అంటే సహజమైన పద్దతుల్లో పంటలు పండించటం మాత్రమే కాదు. అదొక గుణం. ఆర్గానిక్ కూరగాయలు తిని, నేను ఆరోగ్యంగా ఉన్నాననుకోవటం మూర్ఖత్వం. ఆర్గానిక్ సైకాలజీ లేనపుడు, సైకలాజికల్లీ నేను ఆర్గానిక్ గా ఆలోచించలేనపుడు, ఉత్త ఆర్గానిక్ కూరగాయలు తిని సహజంగా, ప్రకృతికి దగ్గరగా జీవించేస్తున్నామనుకోవటం ఒక బిగ్ జోక్. మనుషుల మధ్య ఆ సహజమైన ఆర్గానిక్ రిలేషన్స్ లేకుండా, ఆ గుణ సంపద లేకుండా, పై పై చర్యలతో సహజత్వాన్ని ఎలా తీసుకు రాగలం. అప్పటి స్మాల్ విలేజ్ సొసైటీల్లో వారి జీవితాల్లో సహజత్వం ఉండేది. జీవ౦ ఉండేది. మనమిపుడున్న సమాజం, ఈ జీవితం పూర్తిగా ఇనార్గానిక్. మన ఆలోచనలు కూడా ఇనార్గానిక్. ఈ భావన నన్ను ప్రేరేపించింది. నేను కేవలం ఆ అమ్మలను మాత్రమే చిత్రించటం లేదు. వారి గుణాల్ని, ఆ సమాజపు సహజత్వాన్ని, వారి జీవితాల్లోని స్వచ్ఛమైన జీవ కళ నూ చిత్రిస్తున్నాను. యాకూబ్ అమ్మలాగా నలుగురితో మాట్లాడుతూ  ఆరు బయట కూర్చోవటంలో ఉండే జీవకళ, క్లోజ్డ్ రూమ్స్ లో టీవీల ముందు కూర్చోవటంలో వస్తుందా?.

V: మీరన్నట్టు, ఈ తరాల అంతరాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కానీ కాలానుగుణమైన ఈ మార్పు తప్పదేమో కదా..ఈ తప్పని పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలంటారు?.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అవును గురూ..! ఇది తప్పని సరి జరుగుతూ న్న మార్పు. కానీ నేను ఇంకో రకంగా దీనిని చూడదలిచాను. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఈ అమ్మలంతా ఆ కుటుంబాలనీ, అంత మందినీ నడిపినవారు. నడిపించిన వారు. ఆ సంబంధ బాంధవ్యాల్ని అర్థం చేసుకుని బతుకుని సంతోషంగా గడిపిన వారు. ఇపుడు కుటుంబం మాట వదిలేస్తే..పెళ్ళి అనేది కూడా లేదు. 'లివింగ్ టుగెదర్' అని వచ్చేసింది. నాకు నీవు ఫలానా ఇన్ని రోజుల్లో అర్థం కాకపోతే, నేను నిన్ను వొదిలేసేయవచ్చు అనే పరిస్థితిలోకి వచ్చేశాం. ఈ ట్రాన్సిషన్ జరిగింది.  స్వార్థం తప్ప ఇంకొకటి కనిపించని ఇటువంటి సమాజ౦లో why dont we document the people who have nurtured an organic thought in us. ఈ రోజు మనలో కొద్దో గొప్పో ఒకడికి అన్నం పెట్టే గుణమో సహాయం చేసే గుణమో ఉందీ అంటే అది ఆ తరంద్వారా సహజంగా మనలోకి ఇంబైబ్ అయిన గుణం. అది ఒక తండ్రి ద్వారానో..ఒక తల్లి ద్వారానో వచ్ఛిన గుణం కాదు. తల్లి దండ్రుల ద్వారా మనం వారి జీన్స్ ని పొందుతాం. కానీ ఆ గుణాల్ని కాదు. Gene itself is a subject. అది ఒక పదార్థం. దానికి ఎటువంటి ఎమోషనూ లేదు. అది కేవలం ఒక పదార్థం మాత్రమే. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కావాలసిన రకంగా మనం ఒక బేబీని సృష్టించవచ్చు. కానీ ఆ బేబీ గుణగణాల్ని ప్రవర్తనా రీతుల్నీ సృష్టించలేం. ఆ గుణాల్ని సమాజమే అందించాలి. గుండెనో కిడ్నీనో ట్రాన్స్ప్లాంట్ చేసినపుడు, ఆ అవయవం మాత్రమే మారింది, కానీ గుణాలు మారవు. అవయవ దానం చేసిన వ్యక్తి గుణాలు అవయవం స్వీకరించిన వ్యక్తి లోకి వచ్చేయవు. ఇపుడు ఒక సమాజంలోని గుణాల్ని ఇంకో సమాజానికి అందించాలంటే...ఆ సమాజాన్నే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒక నేచురల్ ఆర్గానిక్ సొసైటీ లోని గుణాలను, ఒక అన్నేచురల్ ఇనార్గానిక్ సొసైటీకి బదలాయించాలి. నేను అడవుల్లో పని చేశాను. అక్కడి ట్రైబల్ అమ్మలతో మనుషులతో కలిసి పని చేశాను. వారి దగ్గర ఈ సహజత్వాన్నీ జీవ కళనూ చూశాను. అలాగే ఆ తరం అమ్మల్లో కూడా ఈ సహజత్వాన్నీ, జీవ కళనూ చూశాను. ఆ గుణాల్ని ఈ తరంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటాను. అందుకే ఒక కళా కారుడిలా నా బొమ్మల ద్వారా ఆ తరాన్ని, ఆ గుణాల్ని ఈ తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నా.


V: మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ  ఈ జనరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు అన్నారు. ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా చెబుతారా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ..! మాతృత్వం పొందిన వారంతా అమ్మలైపోరు కదా...! అమ్మతనమంటే పెట్టే గుణం. అది లేనపుడు తల్లి అయినంత మాత్రాన అమ్మలెలా అవుతారు. ఇక్కడ నేను బొమ్మలు వేసిన వారంతా అమ్మలే. వీరందరిలో పెట్టే గుణం ఉంది. మా అమ్మ మాత్రమే కాదు. వీరందరూ అమ్మల్లాగే కనిపిస్తారు నాకు. అమ్మ ఎవరికైనా అమ్మలాగే కనిపిస్తుంది. అది అమ్మగుణం. అదే అమ్మతనం. ఆ అమ్మతనానికి లింగ బేధాలు కూడా లేవు. పురుషుడైనా అమ్మతనాన్ని కలిగి ఉంటే..అమ్మే అవుతాడు. ఆ తనం ఉండాలి. ఆ తనాన్ని సమాజంలో పెంపొందించాలి. అది లేనపుడు ఆ అమ్మలు, ఆ మనుషులూ అమ్మలెలా అవుతారు?.

V: మీరు ఇపుడు ఎగ్జిబిషన్ లో ఉంచిన బొమ్మలన్నీ ఎప్పటి నుండి వేస్తున్నారు?.
------------------------------------------------------------------------------------------------

S: ఇవన్నీ 2002 నుండి 2016 వరకు వేసిన చిత్రాలు. 2002 లో మా అమ్మ బొమ్మను గీసాను. అప్పటి నుండి మొదలయ్యింది. ఇప్పటిదాకా నలభై ఆరు బొమ్మలు వేసాను. ఇక్కడ ఇరవై ఆరు బొమ్మల్ని డిసప్లే చేస్తున్నాను.

V: 2002 నుండి ఇప్పటి దాకా వేస్తూ వస్తున్నపుడు, మీ చిత్రాల్లో మీరు గమనిస్తున్న మార్పు ఏమిటి?.
-----------------------------------------------------------------------------------------------------------------------------

S: ఏ కళాకారుడైనా రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి స్కిల్(skill), రెండు క్రాఫ్ట్మన్ షిప్(craftsmanship).  స్కిల్ ఇన్హెరెంట్ గా రావచ్చు. కానీ క్రాఫ్ట్ మన్ షిప్ ని కళాకారుడే అభివృద్ధి చేసుకోవాలి. ఒక కుమ్మరి, కుండలు చేస్తున్నపుడు ఎటువంటి క్రాఫ్ట్మన్ షిప్ ను ప్రదర్శిస్తాడో..అటువంటి పర్ఫెక్షన్ ని నేర్చుకోవాలి. క్రాఫ్ట్మన్ షిప్ అభివృద్ధి చేసుకోవాలంటే..మనకున్న ఇన్స్ట్రూమెంట్స్ పై అవగాహన పెంచుకోవాలి. నా విషయం వరకూ వస్తే, ఇప్పటిదాకా నేను నా మిత్రులు ఇస్తూ వస్తూన్న ఆర్ట్ మెటీరియల్ ని అవగాహన చేసుకుంటూ నా చిత్రకళను కొనసాగిస్తున్నాను. కానీ ఈ రోజు టెక్నాలజీ పెరిగాక, ఈ ఆర్ట్ మెటీరియల్ కి సంబంధించిన సమాచారం విస్తృతంగా దొరుకుతోంది. మెటీరియల్ కూడా చాలా సులువుగా దొరుకుతోంది. దాన్నంతా నేను ఎక్ప్లోర్ చేయాలి. ఇందాకా మిత్రుడు ఏలే లక్ష్మణ్ వచ్చారు. మెటీరియల్ ని ఉపయోగించే విషయంలో కొన్ని సూచనలు చేశారు. మార్కెట్ కి వెళ్ళి ఈ మెటిరియల్ వెదుక్కోవాలి అనుకుంటున్నాను. అది నా క్రాఫ్ట్ మన్ షిప్ ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

V: ఇదే ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతున్నాను. నుండి ఇప్పటి దాకా మీరు బొమ్మలు గీస్తున్నారు. ఈ 14 సంవత్సరాల కాల వ్యవధి మీలో,మీ అంతరంగంలో. మీకు మీరు గమనించిన మార్పు ఏంటి?.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఇంటర్నల్ గా నాకు ఖచ్ఛితంగా తెలిసిన విషయం ఏమంటే., my paintings are not marketable commodities.
ఈ అమ్మల్నీ అమ్మమ్మల్నీ నేను ఎలా అమ్ముకోగలను?. నాకు అమ్మలు కదా వీళ్ల౦తా...వారినెందుకు అమ్ముకోవాలి?. వారి బొమ్మలతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడినప్పుడు, అమ్ముకోవటమనే విషయం చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. అంతే కాదు, 'మా అమ్మ బొమ్మను అమ్ముకు౦టావా?' అని రేప్పొద్దున ఇంకెవరైనా అడగొచ్చు. ఇపుడిటువంటి చోట్ల ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కదా..! నా సొంత ఖర్చులతో నేను ఎంతకని ఈ ప్రదర్శనలను కొనసాగించగలను?. చిత్రాల ద్వారా ఈ అమ్మతనాన్ని ఇలా ఎంతకాలం సొంత ఖర్చులతో ఈ తరానికి అందించగలను అని ఆలోచిస్తుంటాను. నాకున్న సంపాదన రీత్యా నాకు ఈ పని తలకు మించిన భారం కాకూడదు అనుకుంటాను. లాభాలు రానవసరం లేదు నాకు ...ఎందుకంటే నేను అమ్మలను అమ్మతనాన్ని అమ్ముకోలేనని చెప్పాను కదా..కానీ నేను దివాలా తీయకుంటే చాలనుకుంటాను. దీనికో పరిష్కారం ఆలోచించినపుడు, ఇక పై అమ్మల బొమ్మలను వేయడానికి టోకెన్ లాగా కొంత డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది ఈ మధ్య వచ్చిన ఆలోచనే. ఆ డబ్బు ఇలా ప్రదర్శనలు చేయటానికి కొంత ఊరటనిస్తే చాలు. లేదా ఇంకెవరైనా స్పాన్సర్ షిప్ చేస్తామని ముందుకు రావచ్చేమో తెలియదు. చూడాలి..,నేను ఈ ఆలోచనను ఎంత వరకు ముందుకు తీసుకెళ్లగలనో. ఎందుకంటే ....

V: ఇపుడు ఈ గోథే సెంటర్ లో ప్రదర్శన ఏర్పాటు చేయటానికి ఎవరైనా స్పాన్సర్స్ దొరికారా సర్..?
------------------------------------------------------------------------------------------------------------------------

S: స్పాన్సర్లు ఎవరూ లేరు కానీ, ఈ విషయంలో ఈ రోజు నేను మార్కెట్ ను జయించానేమో అన్నంత ఆనందం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేయగలగటం నేను ఊహించనిది. సహకరించిన యాకూబ్ కీ, గోథే సెంటర్ నిర్వాహకులకు, బొమ్మలను అమర్చిన మిత్రుడు బంగారు బ్రహ్మం కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇది నేను ఊహించనిది అని ఎందుకు అంటున్నాను అంటే..ఈ గోథే సెంటర్ ఒకప్పుడు మేము నివసించిన ఇల్లు. సరిగ్గా ఇక్కడే మా ఇల్లు ఉండేది. తరువాత దానిని కూల్చి ఈ గోథే సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నిర్వాహకులను అడిగినపుడు వారు ఈ స్థలం ఒకప్పుడు మేము నివసించిన ఇల్లే అని తెలుసుకుని చాలా సంతోషించారు. ఎగ్జిబిషన్ పెట్టుకోవటానికి పూర్తి సహకారం అందించారు. మా అమ్మ బొమ్మను నేను మొదట ఈ ఇంటిలోనే వేశాను, ఇపుడు అదే చోట , దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తరువాత ప్రదర్శన పెట్టుకోవడానికి అవకాశం రావటం అనేది యాదృచ్ఛికం అనుకోవడం కన్నా అంతకుమించిని ఏదో అనుబంధం అనుకుంటాను. అతి తక్కువ ఖర్చుతో ఇలా పది మందితో నా అనుభవాల్ని పంచుకోవటం నేను మరచిపోలేని విషయం.

V: -(నేను చిత్రాల్ని పరిశీలిస్తూ...)చిత్ర కళలో ఎన్నో ఇజాలు వచ్చాయి కదా..! సర్రియలిజం, క్యూబిజం, ఎక్సప్రెషనిజం వంటివి..వీటిలో కొన్ని హృదయ జనితమైనవనీ, కొన్ని మేథో జనితమైనవనీ అంటూంటారు..అలాగే వీక్షకుడి విషయానికి వస్తే హృదయ రంజకమూ, మేథో రంజకమూ అని కూడా ఉంటుంటాయి. ఇపుడు మీ చిత్రాలు పాఠకుల హృదయాన్ని తాకాలి అనుకుంటారా లేక మేథస్సును తాకాలి అనుకుంటారా..?
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: బేసికల్ గా నేను ఈ ఇజంలనీ నమ్మను గురూ..!
ఈ కళ ఈ ఇజంలో ఉంది, ఆ బొమ్మ ఆ ఇజంలో ఉంది అనేది నేను నమ్మను. నమ్మను అంటే...ఒక కళాకారుడిగా నేను నమ్మను. అ౦టే ఆ ఇజాలు లేవని కాదు. కానీ ఒక చిత్రం ఏ ఇజంలోకి వస్తుంది అని తెలుసుకోవలసిన పని, ఆ విధంగా వివరించవలసిన పని నాది కాదు. అది విమర్శకుల పని. వీక్షకుల పని. ఒక కళాకారుడిగా నాలోపల ఉన్న కళను బయటకు తీయటమే నా పని. One who is a failure artist he turns to be a critic అంటాడు ఆస్కార్ వైల్డ్. నేను ఈ ఇజాల గురించి కొంతే తెలుసుకున్నాను, ఎంత అవసరమో అంతే తెలుసుకున్నాను. ఈ ఇజం ల గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ పోతే నేను విమర్శకుడినౌతానేగానీ..కళాకారుడిని కాలేను. ఇపుడు నా చిత్రాలు హృదయాన్ని తాకుతాయా..? మెదడును తాకుతాయా అంటే నేను చెప్పలేను. అది చూసేవాడి చూపుని బట్టి ఉంటుంది. అన్ని కళలూ హృదయాన్నీ తాకుతాయి, మెదడునూ తాకుతాయి...అలా తాకే ప్రయత్నం కళాకారుడు చేయగలగాలి. అంతవరకే అతడి పని అనుకుంటాను. ఒకసారి ఒక చిత్రాన్ని వేసిన తరువాత, ఇపుడా చిత్రం కళాకారుడిది కాదు, ప్రపంచానిది. ప్రపంచం ఎలా తీసుకుంటుందో ప్రపంచానికే తెలియాలి.

V: మనం ఈ విషయంలో ఇంకాస్త చర్చించాలి అనుకుంటాను. ఉదాహరణకు ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ని ఒక ఆర్టిస్ట్ వేశాడనుకుందాం. అతడు ఏమి చెప్పదలుచుకున్నాడో వీక్షకుడికి అర్థం కాదు. ఆ పెయింటింగ్ ని చూడగానే, అది వీక్షకుడి హృదయాన్ని తాకే అవకాశం ఉండదు. అపుడు అతడు తన మేథను ఉపయోగించాలి. కొంతసేపు ఆలోచించాలి, పలు రకాలుగా ఊహిస్తూ పోవాలి. అపుడుగానీ ఆ ఆర్టిస్టు ఏమి చెప్పదలచుకున్నాడో ఇద మిత్తంగా అర్థం కాదు. అటువంటి సందర్భంలో వీక్షకుడికి అదే విధంగా ఆర్టిస్టుకీ మధ్య బంధం తెగిపోయే అవకాశం, భావ ప్రసరణ సవ్యం గా జరిగే సంభావ్యత తగ్గి పోతుంటాయి కదా..?
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
S: సమాజం అనేది ఒక స్టాటిక్ థింగ్ అనుకోను గురూ...! అది డైనమిక్ గా కదులుతూ  ఉంటుంది. సమాజంలో ఆధునిక టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఇజాలు కూడా కళారంగం లో పుట్టుకు వస్తాయి. సొసైటీ పరిణామం చెందే కొద్దీ కళ, అలాగే క్రాఫ్ట్మన్ షిప్(craftmanship) పరిణామం చెందుతుంటాయి. ఇపుడు ఒక వీక్షకుడు వందేండ్ల కిందటి మనసుతో వచ్చి, ఇప్పటి బొమ్మను చూస్తే వాడికేమర్థమవుతుంది. వాడి ఎమోషన్ వంద ఏండ్ల కిందటిది, ఇప్పటి ఎమోషన్ నీ ఇప్పటి పరిణామాన్ని అతడెలా అందుకోగలడు?. వీక్షకుడైనా , పాఠకుడైనా ఆ కళ గురించిన ప్రాథమిక అవగాహన లేనపుడు అతడు కళాకారుడితో కలిసి నడవలేడు. అవగాహనకు కళాకారుడు సృష్టించిన కళ అడ్డంకికాదు...వీక్షకుడి వెనుకబాటు తనమే అడ్డంకి. పోయెట్రీ విషయమైనా అంతే. పాఠకుడు ఎంతోకొంత హోం వర్క్ చేయగలిగినపుడే కవిత్వాన్ని అందుకోగలుగుతాడు. మన తెలుగులో పాఠకులు ఇంకా శ్రీశ్రీ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఒక కవితను చూసి ఇది శ్రీశ్రీ కవితలా లేదు కాబట్టి, ఇది కవిత్వమే కాదనో, అర్థమే కావటం లేదనో అంటూంటారు. వారంతా అక్కడే ఆగిపోయి వున్నారు. శ్రీశ్రీ ఆధునికతకు, పరిణామానికి పెద్ద పీట వేశాడు.ఆయనే ఈ ఆధునికతకు ప్రతినిధి, కానీ అటువంటి శ్రీశ్రీ దగ్గరే పాఠకుడు ఆగిపోయాడు, అక్కడినుండి ఎదగటం లేదు. శ్రీశ్రీ తరువాత ఎన్నెన్ని కవిత్వోద్యమాలు వచ్చాయి..వాటిపై అవగాహనే లేనపుడు, పాఠకుడికి ఆ కవిత్వమెలా అర్థమవుతుంది?.

V:  ఐతే కళను అర్థం చేసుకోవాలంటే పాఠకుడు కూడా ఆ కళ పట్ల అవగాహన ఉండాలంటారు. ఈ మధ్య 'సామాన్య మానవుడు' లేదా 'సామాన్య పాఠకుడి'కి అర్థం కావటమే లేదు అని అనడం వింటూ ఉంటాం...
--------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను సెల్ ఫోన్ మాత్రమే వాడతాను. మా అబ్బాయి స్మార్ట్ ఫోన్ వాడతాడు. ఇపుడు నా చేతికి ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఉపయోగించమంటే నేను ఫోన్ కూడా చేయలేను. నేను స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలనే విషయం మీద ఇంకా అబ్డేట్ కాలేదు. నేను ఇంకా పురాతన సెల్ ఫోన్ యుగంలోనే ఉండిపోయానంటే..ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పటికీ అర్థం కాదు. ఇఫుడు తప్పు అబ్డేట్ కాలేని నాదే అవుతుందిగానీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీది కాదు. ఒకఫోన్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే..ఒక కళకు ఇంకెంత ఉండాలి?.కళ విస్తృతమైనది కదా.. యూనివర్సల్ కదా..దాని పరిధి చాలా పెద్దది. దాన్ని అర్థం చేసుకునే రీతిలో పాఠకుడు ఉన్నపుడే అది అతడికి అర్థమవుతుంది. ఇక సామాన్య పాఠకుడు అంటే ఎవరు? కవిత్వం చదివేవాడు సామాన్యుడు ఎలా ఔతాడు?. ఈ అర్థంలేని వాదాలు పాఠకుడిని అజ్ఞానంలోనే ఉంచేస్తాయి తప్ప..వాడి అవగాహనా పరిధిని పెంచేవి కావు. గొప్ప పాఠకుల మధ్యనే గొప్ప కవులూ పుడతారు.

V: అయితే కళాకారుడికి 'ఇజాలతో పెద్దగా పనిలేదంటారు..
--------------------------------------------------------------

S: అవును. కొంత బేసిక్ స్టడీ ఉపయోగపడొచ్చు. అలాగే ఆర్ట్ హిస్టరీ కూడా కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుందనుకుంటాను. ఆర్టిస్ట్ కి అన్నిటికంటే ముఖ్యం ఆర్ట్ వేయటమే. ఆర్ట్ వేస్తేనే అతడు నేర్చుకుంటాడు తప్ప వేరే ఏమి చదివినా, ఆలోచించినా అతడు నేర్చుకోలేడు. కవి కవిత్వం రాస్తూ రాస్తూనే కవిత్వం రాయటాన్ని నేర్చుకుంటాడు. ముందే కవిత్వానికి సంబంధించిన  ఆ ఇజంల మీద ధ్యాస వుంటే కవిత్వం రాసేదేముంటుందిక?.ఆకలేస్తే అన్నం తినాలి. ఆలోచిస్తే ఆకలి తీరదు..ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకోవటం వల్ల ఆకలి తీరదు. మీ వైద్య పరిభాషలో చెప్పాలంటే..గుండె పనితీరును గురించి తెలుసుకోవాలంటే గుండె పని చేస్తున్నపుడే నేర్చుకోవాలి. గుండెను బయటకు తీసి గుండె పనితీరుని నేర్చుకోలేవు, కేవలం అనాటమీనే నేర్చుకోగలవు.
V: మీరు ఒక పెయింటర్, అలాగే ఒక పోయెట్..ఈ రెండు కళల్లో దేనితో మీరు ఎక్కువగా ఐడెంటిఫై అవుతారు?.
--------------------------------------------------------------------------------------------------------------------------------

S: నాకు ఈ రెండూ ఇష్టమే గురూ..ఇవే కాదు, ఫోటోగ్రఫీ అన్నా ఇష్టమే, ఇంటిని అందంగా సర్దుకోవటమన్నా ఇష్టమే. ఇవన్నీ నా ఎక్స్ప్రెషన్స్. నన్ను నేను వీటి ద్వారా తెలియబరుస్తున్నాను, ఆవిష్కరించుకుంటున్నాను, అలాగే వీటిద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను. వీటిలో ఒకటి ఎక్కువ ఇష్టం, ఒకటి తక్కువ ఇష్టం అనేదేమీ లేదు. ఆయా సమయాల్లో.. స్పాంటేనియస్ గా నన్ను ఏది ప్రేరేపిస్తుందో ఆ ఎక్స్ప్రెషన్లోకి నేను ఒదిగిపోవటానికి ప్రయత్నిస్తాను. ఈ ఆర్ట్ ఫామ్స్ లో ఇది మోస్ట్ ప్రిఫర్డ్(most preferred) ఇది లెస్ ప్రిఫర్డ్(less preferred) అనేదేమీ లేదు. The purpose of my art forms is to express myself.

V: మిమ్మల్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్నపుడు, పాఠకుడు లేదా వీక్షకుడు మిమ్మల్ని రీచ్ అవగలుగుతున్నాడా..? లేదా మీరు మీ పాఠకుడి దగ్గరికి రీచ్ అవగలుగుతున్నారా?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: దానిని నేను చెప్పలేను. కొందరు మార్కెట్ ద్వారా విస్తరించి రీచ్ అవుతారు. కొందరు మౌత్ టు మౌత్ అవుతారు. నేను ఆలోచించేది first of all let me express myself.  రీచ్ అయ్యేది రీచ్ అవుతుంది. క్రికెట్ లో, సినిమాల్లో వొచ్చేసినంత తొందరగా డబ్బూ పేరూ ఈ పోయెట్రీలో, వ్యాసాల్లో, చిత్రాల్లో రావు. ఇది చాలా మెల్లిగా ముందుకు కదిలే విషయం. గంటసేపు జరిగే పుస్తకావిష్కరణ సభ గానీ, వారం రోజులు జరిగే art exhibition కానీ పాఠకుని దెగ్గరికి కళాకారుణ్ణి ఎంత వరకు తీసుకెళ్తాయి అంటే చెప్పడం కష్టమే. నా పోయెట్రీ ద్వారా, చిత్రాల ద్వారా ఇప్పటికిప్పుడే ప్రపంచానికి నేను తెలిసిపోవాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఆలోచించేది సమాజం లో ఆర్ట్ మీద ఉండే శ్రద్ధ ఎంతుందని?
మన కళల మీద కావలసినంత అవగాహనని ప్రభుత్వాలు కల్పించ గలుగుతున్నాయా?. అవార్డులు రివార్డులు వంటి క౦టి తుడుపు చర్యలకే మనం అలవాటు పడిపోయి ఉన్నాం.  ఇపుడు మనం రోడ్డు మీదకు పోయామంటే ఎన్నో గోడలు తెల్లగా నిర్వికారంగా కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద అందమైన చిత్రాల్ని ఎందుకు గీయకూడదు?. ఎందుకు ఖాళీగా ఒదిలేయాలి?. ఆ ఖాళీ స్పేస్ ని ఒక కళాకారుడు తనను తాను ఎక్స్ప్రెస్ చేయటానికి ఎందుకు కేటాయించకూడదు?. ఇటువంటివి ఎన్నో జరిగాలి. ప్రజల్లో కళ పట్ల చైతన్యం కలిగినప్పుడే కళ ప్రజల్ని చేరాల్సినంత చేరుతుంది.

V: ఇపుడు మీరు ఇక్కడ చిత్ర ప్రదర్శన చేశారు. మీరు స్వయంగా వీక్షకులకు మీ చిత్రాలను చూపించారు. వారి కళ్లలో మీరు మీ వీక్షకులను రీచ్ అయినట్టు మీకు అనిపించిందా..? మీ perspective ని తెలుసుకోదలిచి ఈ ప్రశ్న అడుగుతున్నాను.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను ఇక్కడ కేవలం నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. వారి ఎమోషన్ ను నేను ఖచ్ఛితంగా కొలవలేను. ఒక ఎమోషన్ ని అందరూ ఒకే తీవ్రతతో ఎక్స్ప్రెస్ (express) చేస్తారనుకోను. కొందరు మనసులో ఉంచుకుని బయటకు గంభీరంగా ఉండిపోవచ్చు. కొందరు వెంటనే బయటకు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. కొందరు ఏమీ అర్థం కాకున్నా, పొగడాలి కాబట్టి 'వావ్' అని పెద్దగా అరవొచ్చు. కాబట్టి ఆ ఎమోషన్ లోని ఎక్స్ప్రెస్సివ్ తీవ్రత( intensity of expression) ఆధారంగా నేను రీచ్ అయ్యానా లేదా అనేది అంచనా వేయలేను. ఇంకోటేమంటే ఈ ఆర్ట్ ద్వారా నేనేమీ సందేశాలివ్వదలచుకోలేదు. నా సందేశాలేమీ లేవు. కాబట్టి సినిమా చూసి సందేశం తీసుకుపోయినట్టుగా నా దెగ్గరేమీ లేదు. కానీ ఈ ప్లాట్ ఫారం ద్వారా నేను నా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ (emotional performance) గా మలచదలిచాను. ఇఫుడు మీరు ఇక్కడికొచ్చారు. ఈ బొమ్మల్ని చూశారు. చూసినపుడు, మీకు మీ అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో గుర్తుకు వచ్చి ఉంటుంది. బయటికెళ్ళాక కూడా మీరు మరచిపొయిన మీ అమ్మమ్మ, నాయనమ్మ మీకు గుర్తుకు రావాలి. వాళ్ళు మళ్లీ మీ జీవితాల్లోకి రావాలి. వాళ్లు బొమ్మలుగా, గోడ మీది ఫోటోలుగా మిగిలిపోకూడదు. లైఫ్ లోకి రావాలి. ఒక పోయెంను చదివి పాఠకుడు ఎలా మరల మరల మననం చేసుకుంటాడో..నా బొమ్మలు చూసిన వీక్షకుడు వాళ్ల అమ్మల్నీ, అమ్మమ్మల్ని, నాయనమ్మల్నీ గుర్తుకు చేసుకోవాలి. ఈ బొమ్మలు కొంతకాలం వాళ్లని హాంట్ చేయాలి. వెంటాడాలి. రేపు పొద్దున వాళ్ల అమ్మల్నీ అమ్మమ్మల్నీ చూసే దృష్టిలో కొంత మార్పు వచ్చినా చాలు. ఈ ఎగ్జిబిషన్ విజయం పొందినట్లే. ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇక్కడినుంచి మొదలవ్వాలి. అది మొదలవుతే, నేను వీక్షకుడికి రీచ్ అయినట్టే.

V: -ఈ ఆధునిక కాలంలో..బిజీ సిటీ లైఫ్ లల్లో మనుషులు ఎమోషనల్ గా ఉండటమే నేరమనుకుంటున్న తరుణంలో ..'ఎమోషనల్ పెర్ఫార్మన్స్' (emotional performance) ని మీరిక్కడనుండి మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా?.
------------------------------------------
S: నిజమే గురూ..! నిజానికి మనకు అన్నీ తెలుసు గురూ..! మనలో సునిశితత్వం చచ్చిపోతోంది. మనం ఎమోషన్ ని రేషనలైజ్ చేసేస్తున్నాం, లాజికల్ గా ఆలోచించటం మొదలు పెట్టాం. ఏదన్నా చేయాలంటే..ఒక సహాయం చేయాలంటే..నాకేంటి ఇందులో లాభం అనే స్వార్థ పూరిత ఆలోచనని కొనసాగిస్తున్నాం. ఎవరైనా ఎమోషనల్ గా పని చేసినా, ఏదో లాభం లేనిది ఎందుకు చేస్తారు అనుకుంటుంటాం. ఎమోషన్ ని కూడా మార్కెటబుల్ అవునా కాదా అని చూస్తున్నాం. ఎవడికైనా వ్యవస్థ మీద కోపమొచ్చేసి విప్లవ కవిత్వం రాసేస్తే..అది పొలిటికల్ గా, మార్కెట్ పరంగా ఎంతవరకు పనికొస్తుంది? అని ఆలోచిస్తున్నాం. పొలిటికల్ గానో..మార్కెట్ పరంగానో మంచి గిరాకీ లేదా మంచి పేరు వస్తుంది అనుకున్నపుడు, ఇంక విప్లవ కవిత్వమే రాయటం మొదలు పెట్టాం. నీ కెట్లా కావాలి కవిత్వం..? విప్లవంగా కావాలా..? ఇదిగో రాసేశా..!! లేదా రొమాంటిక్ గా కావాలా?  ఇదిగో రాసేశా..!! నీ మార్కెట్ కు అనుగుణంగా నేను కవిత్వం రాసినట్టయితే..ఇంక నేను నా కవిత్వం రాసిందెపుడు?. ఇటువంటి కవుల్నీ కళాకారుల్నీ నేను నమ్మను అని చెప్పడానికి నాకెటువంటి కాంట్రాడిక్షన్స్ లేవు గురూ! కవులే ఇలా ఉన్నపుడు పాఠకుడు, వీక్షకుడు అంతకు మించి ఉంటాడనుకోలేను కదా!. కానీ ఈ ప్లాట్ ఫాం ద్వారా నేను ఎమోషన్ ను రేషనలైజ్ చేయదలచుకోలేదు. నా సెన్సిబిలిటీస్ ని ఎలా ఉండనిస్తానో అలానే వీక్షకుడికి అదించాలనుకుంటాను. నేను కొత్త కళ్లద్దాలను వీక్షకుడికి ఇచ్చాను. వాళ్లు వాటిని ఉపయోగించుకు౦టారో తీసి పక్కన పెట్టేస్తారో నేను చెప్పలేను.

V: ఈ రోజుల్లో పోయెట్రీని ఒక కారణం కోసం, ఒక సందేశం ఇవ్వడం కోసం, లేదా ఒక గుర్తింపుకోసం రాయటం మనం చూస్తుంటాం...
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: పోయెట్రీకి నిన్ను మించిన, నీ ఎమోషన్ ని మించిన కారణం ఏముంటుంది గురూ..! నీ ఎమోషనే నీ పర్పస్. వేరే పర్పస్ ఏమీ లేదు. ఇదేమన్నా సినిమానా, ఒక ఫార్ములా సినిమా సక్సెస్ అయిందని అందరూ అవే కథల్ని అవే సన్నివేశాల్ని మార్చి మార్చి తీయటానికి. ఒకరు ఒక పర్పస్ తో రాసి పేరు తెచ్చుకుంటే ఇంక అందరూ అదే పర్పస్ కోసం రాసేయటం. అంతే కాకుండా ప్రతీ కవీ శ్రీశ్రీ లాగా అయిపోవాలనుకోవటం. అందరూ శ్రీశ్రీలే అయిపోతే..ఇంక కాళోజీ ఎందుకు? దాశరథి ఎందుకు? నెరుడా ఎందుకు? గోథే ఎందుకు?. ఎందుకంటే మనం ట్యూన్ చేయబడ్డాం. సినిమా ఫార్ములా లాగా కవిత్వ ఫార్ములా. ఆ ఫార్ములా కవికి, పాఠకుడికీ ఒకే రకమైన కళ్లద్దాల్ని ఇస్తుంది. ఇద్దరూ అవే కళ్లద్దాల్ని పెట్టుకుని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. పోయెట్రీలో కానీ, పెయింటింగ్ లో కానీ ఖచ్ఛితంగా నా ఐడెంటిటీ నాకు ఉండాలి. ఇంకొకరి ఐడెంటిటీ నాకెందుకు?. అసలే..ఈ రోజున్న కాంపిటీటివ్ ప్రపంచంలో, ఫాస్ట్ ప్రపంచంలో నీ ఐడెంటిటీ మహా అయితే పది రోజులకన్నా ఎక్కువ ఉండదు. కళాకారులైనా ఈ ట్రెండ్ కు అలవాటయి పోయారు. ఇప్పటి సినిమా గాయకులనే తీసుకోండి. రెండు మూడు సినిమాల్లో పాడాక, టీవీల్లో రియాలిటీ షో లకు వచ్చేస్తారు. లేదా దుబాయ్ లో పాటలు పాడి డబ్బులు సంపాదించుకుంటారు. ఆ గాయకుల పేర్లు కూడా మనకు గుర్తుండని పరిస్థితి వుంది. డబ్బు సంపాదించటమే ఐడెంటిటీ అనుకున్నపుడు, ఆర్ట్ ఉండేదెక్కడ?. అందుకే తన సొంత పనిని వదిలేసి,వేరే మార్గాల ద్వారా గుర్తింపు పొందాలనే తాపత్రయం. నేను నమ్మేదేంటంటే..నా పనికంటే నాకు వేరే గుర్తింపేది?

V: సినిమాల విషయంలో కళ కంటే కూడా మార్కెట్ ముఖ్యమవుతుందనుకుంటాను. అందుకే సినిమాల్లో కళనూ క్రియేటివిటీనీ ప్రశ్నించేలా ట్రెండ్ అనేది ఆధిపత్యం వహిస్తుంటూంది. ట్రెండ్ ని ఫాలో అవుతూ , మార్కెట్ ని పట్టుకుంటూ, సందేశాలు ఇచ్చే చిత్రాలు వస్తున్నాయిగా....
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అందులో కూడా రియాలిటీ ఎక్కడుంది గురూ..! రియాలిటీకి దూరంగా ఉంటూ నేను సినిమాల ద్వారా సందేశాలిచ్చేస్తాను అనుకోవటం ఎంత పిచ్చితనం కదా..! సందేశమే ఇవ్వదలచుకుంటే..సినిమా ఆపేసి ఒక ప్రసంగం ఇవ్వొచ్చుకదా..! ఈ పైపై నటనలెందుకు?. సినిమా అనేది ఒక చీకట్లో గుద్దులాట లాంటిది గురూ..!! సినిమా ద్వారా నేను ఒక కనిపించని వ్యక్తి తోటి మాట్లాడుతున్నాను. సినిమా చూసే వాడెవడో నాకు తెలియనపుడు, వాడి ఎమోషన్స్ ఏమిటో నాకు తెలియనపుడు నేను ఏదైనా చూపించేస్తాను. 'శ్రీమంతుడు' సినిమానే తీసుకోండి. గ్రామాల్ని దత్తత తీసుకోవటమనే సందేశం ఉందంటాడు. అసలు ఈ రోజు గ్రామాలు గ్రామాల్లాగా లేనపుడు నీవు ఏం దత్తత తీసుకుంటున్నావు?. గ్రామ జీవితం గ్రామం లాగా లేదు. ఒకపుడు ఎనిమిది గంటలకల్లా నిద్రపోయే గ్రామం ఈ రోజు రాత్రి ఒంటిగంట వరకూ టీవీల ముందు సినిమాలూ సీరియళ్ళూ చూస్తుంది. అందరింటికీ ఇంటర్నెట్ ఉంది. అందరి చేతుల్లో సెల్ ఫోన్లూ, స్మార్ట్ ఫోన్లూ, ఫేస్ బుక్ లూ, చాటింగ్ లూ వచ్చేసాయి. పేరుకే గ్రామంలాగా ఉంది, గ్రామం ఎపుడో నగరీకరణ జరిగిపోయింది. ఇపుడు గ్రామాన్ని దత్తత తీసుకుని నీవేం చేస్తావు. గ్రామాన్ని పోషించిన తరమే లేదిపుడు. నగరీకరణ చెందిన గ్రామాన్నీ, నగరీకరణ చెందిన మనుషులనూ దత్తత తీసుకుని నీవే౦ సందేశం ఇస్తావు?

V: నిజమే సర్..నిజానికిప్పుడు గ్రామాలు అనేవే లేవేమో ప్రపంచమనే కుగ్రామం తప్ప...
------------------------------------------------------------------------------------------------

S: గ్రామాలు ఉన్నాయి.  గ్రామానికి ఉండాల్సిన జీవకళ గల గ్రామాలు లేవంటాను. బాగా డబ్బున్న వాళ్లు ఉండే గ్రామాల్లో ఆ జీవం లేదు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ విలేజ్ లల్లో ఆ జీవం ఉంది. గ్రామాన్ని గ్రామంగా నిలపలేక, దానిని నగరీకరణ చేయటం కోసం దత్తత తీసుకోవడం చాలా పిచ్చి ఆలోచన కదా. జీవకళ ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ సొసైటీ గ్రామాల్లో లోపించినపుడు, నగరమనే ఒక ఇనార్గానిక్ సొసైటీని గ్రామాల్లోకి తీసుకురావడానికి దత్తత తీసుకోవటం ఏమిటి?, దానికి సందేశమిచ్చేశామనీ, సమాజాన్ని మార్చేద్దామనీ డప్పు కొట్టడమేమిటి?
----------------------------------------------------------------------------------------------

V: మనం మాటలలో చాలా దూరమే ప్రయాణించామనుకుంటాను, ఇక కొన్ని ప్రశ్నలు... మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి?.

S: రాబోయే మూడు నాలుగేండ్లలో వందకు పైగా అమ్మలను గీయాలనుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ కి వచ్చిన వారే అడుగుతున్నారు, మా అమ్మ బొమ్మ గీయండి అని. ఇంతకు ముందు చెప్పినట్టు 'టోకెన్' గా కొంత మనీ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. అంతే కాక ఇపుడు కొంతమంది వచ్చి మా విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టండి, కాకినాడలో పెట్టండి, వరంగల్ లో పెట్టండి అని అడుగుతున్నారు. నిజానికి ఈ ఖర్చులను భరించగలిగే స్తోమత నాకైతే లేదు, అందుకు ఎలా ఈ సమస్యను అధిగమించాలా అనే ఆలోచనలో ఉన్నాను. ఇక రెండో ప్రాజెక్టు, ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలోని ముసలి అమ్మల్నీ, అమ్మమ్మల్నీ చిత్రాలుగా గీయాలని ఉంది. ఎందుకంటే నగరీకరణ ఊరిని కబ్జా చేసేస్తోంది. కావాలని మనమే కబ్జా చేసేస్తున్నాం. ఊరిలో ఈ ముసలీ తల్లీతండ్రుల తరం అంతరించి పోతే ఊరే అంతరించి పోతుంది. కాబట్టి ఊరిని మనం మాన్యుమెంట్ లా భద్ర పరచుకోవాలంటే, ఊరి జీవకళ ను పట్టుకోవాలంటే, ఆ జీవ కళకు ప్రతినిధులైన ఈ ముసలి వారిని డాక్యుమెంట్ చేయాలి.  రొట్టెమాకురేవు ని ఆ విధంగా తీసుకోవాలి అనే ఆలోచన ఉంది.
ఈ రెండు ప్రాజెక్ట్ లూ ఇంకా ఆలోచనల దశలోనే ఉన్నాయి. కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.

V: ఔత్సాహిక కళాకారులకు కవులకు మీరు ఏదైనా సూచనలాంటిది ఇస్తారనుకుంటాను..
-----------------------------------------------------------------------------------------------------------

S: నేను సందేశాలిచ్చేదేమీ లేదు గురూ! You only deserve what you can make yourself worthy of. నాకంటే నా కవిత్వం గొప్పదవ్వాలి. నాకంటే నా పెయింటింగ్ గొప్పదవ్వాలి అనే ఆలోచన పెంపొందించుకోవాలి. ఒక పోయం రాస్తే అది ప్రపంచానికి నచ్చేయాలి అనుకోకూడదు. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. పొగడొచ్చు, తిట్టొచ్చు. కానీ నా పోయెట్రీతో అందర్నీ satisfy చేసెయ్యాలి అనుకోవటం మూర్ఖత్వం. Craftsmanship ని పెంపొందించుకోవాలి. నిరంతర విస్తృత అధ్యయనం కొనసాగుతునే ఉండాలి. క్రిటిసిజం లోకి ఎక్కువగా పోకుండా..కళ మీద ధ్యాస పెట్టాలి.

V: చివరిగా..ఒక ప్రశ్న. ఈ ఎక్జిబిషన్ ముగిసేసరికి మీ మీద మీకొచ్చిన అవగాహన ఏమిటి?.
-------------------------------------------------------------------------------------------------------

S: ఇంకా చాలా నేర్చుకోవాలి గురూ...! కొత్త కొత్త టెక్నిక్లను పట్టాలి. నేను బ్లాక్ పెన్సిల్ నీ, బ్లాక్ కలర్ నీ ఎక్కువగా ఉపయోగించలేదు. వీటిని ఎలా నా పెయింటింగ్స్లోకి తీసుకురావాలా అనేది అధ్యయనం చేయాలి. వైట్, కాంతిని రిఫ్లెక్ట్ చేస్తే.. బ్లాక్, కాంతిని పూర్తిగా గ్రహించేస్తుంది. అంటే అది ఒక శూన్యాన్ని పుట్టిస్తుంది. ఆ శూన్యాన్ని నా బొమ్మల్లో పట్టాలి. ఆ ఫైనర్ ఆస్పెక్ట్స్ లోని మెచ్యూరిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను.

V: థ్యాంక్యూ సర్...మీ సమయానికి ధన్యవాదాలు. ఎన్నో విషయాల్ని ఈ సాయంత్రం నాతో చర్చించారు.
మీకు ఈ ఇంటర్వ్యూ బోర్ కలిగించలేదనుకుంటాను.
-----------------------------------------------------------------------------------------------------------------------------

S: లేదు లేదు. ఇట్స్ ఎ సడన్ సరప్రైస్ ఫర్ మీ. కానీ మంచి ఆయుధాలతోనే నా మీదకు దుమికావు గురూ..! (నవ్వులు)
నిజానికి ఏకాంతంలో నా ఆత్మ తో నేను సంభాషించుకున్నట్టుగా అనిపించింది. నీ ప్రశ్నలు, అపర్ణ సైలెంట్ అబ్సర్వేషన్ నన్ను నాతో గడిపేలా చేసింది.
కృతజ్ఞతలు. సరే లేటవుతుంది. బయలు దేరుదాం.