పరిచయం
..............
అలిశెట్టి ప్రభాకర్
"అక్షర నక్షత్రమ్మీద..."
కవితా చిత్రాలు
ఒక విహంగ వీక్షణం - విరించి
.....................................
కొన్ని గీతల్ని పెన్నుతో గీస్తే అక్షరాలవుతాయి, అదే పెన్సిలుతో గీస్తే ఒక చిత్రమౌతుంది. అందంగా భావాలతో కవితలాగా అల్లిన అక్షరాలకి, ఒక చిత్రం ప్రతిబింబమయితే అది అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రమౌతుంది. "అక్షర నక్షత్రం మీద...కవితా చిత్రాలు" అనే ఈ పుస్తకంలో మనకు కనబడే కవితలూ వాటి చిత్రాలూ, సమాజాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకోడానికి గీసిన గీతలేమో అనిపిస్తుంటాయి. కానీ ఆ కవితా చిత్రాలని అర్థం చేసుకోడానికి మన కళ్ళు ద్వారాలుగా మారాల్సిందే. అపుడే హృదయం తేజోవంతమౌతుంది. ద్వారాలుగా మన కళ్ళు మారనపుడు మన ముందు కదిలే ఈ కవితా చిత్రాలు సైతం, తెల్ల గుడ్డ కప్పబడున్న శవాలుగా మిగిలిపోతాయంటాడు.
"కళ్ళు ద్వారాలైనప్పుడు/హృదయపు గదంత/తేజోవంతం కావాలి
అటువంటప్పుడే /జీవితాల్ని/క్షుణ్ణంగా పరిశోధించగలుగుతాం/లేదా
కనుగుడ్ల తెప్పలపై తేలిపోయే దృశ్యాలూ/తెల్లగుడ్డు కప్పబడుతున్న శవాలూ/రెండూ ఒకటే మరి."
కుంచెనీ కలాన్నీ నమ్ముకున్న వాడు కాబట్టి, ప్రభాకర్ సమాజాన్ని, ఆకలిని కూడా నమ్ముకున్నడేమో అమాయకంగా. అవి ఎప్పటిలాగే ఆయన్ని కూడా మోసం చేసాయి. కటిక దరిద్రంలోనే టీబీ వ్యాధితో చిన్న వయసులోనే మనల్ని వదిలి వెళ్ళిన ప్రభాకర్, నేటికీ తన కవితా చిత్రాలతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాడు. ఎంతటి ఆశ్చర్యం అంటే ఈనాటి సమాజాన్ని ఆయన అప్పుడే చూశాడా అన్నంతగా. కానీ తరచి చూస్తే, ప్రభాకర్ ఉన్నప్పటి కాలానికీ నేటికీ సమాజంలో పెద్దగా మార్పు యేమీ రాలేదనిపిస్తుంది.
ఈ కవిత చూడండి. ఇపుడు కూడా యువత ఇలాగే ఉంది. కాదంటారా.
వెండితెరపై /నువ్ వ్యభిచరిస్తున్నప్పుడో
క్రికెట్ క్రిమి/నీ మెదడుని తొలిచేస్తున్నప్పుడో
బురద రాజకీయాలు/నీ ముఖంనిండా/పులుముకున్నప్పుడో..తప్ప
లేనే లేదిక నువ్ బ్రతికున్న దాఖలా.
ఆయన చిత్ర కారుడి నుండి కవిగా ఎదగడానికి మధ్యన ఉన్న ఆలంబన సమాజమే, ప్రేరణ విప్లవ పోరాటాలూ ఆకలి బాధలే. శ్రీ శ్రీ, శివసాగర్, చేరబండ రాజుల కవిత్వాన్ని ఊపిరిగా పీల్చిన ప్రభాకర్, పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచే రెండూ ఉంటాయని ప్రకటించుకుంటాడు, అయినా తానొక ఉద్యమ దిశని సూచించే దిక్సూచినే అంటూ తన పరిధిని వ్యక్తపరుస్తాడు. అందుకే తన కవితలతో మనల్ని కుదిపి లేపుతాడు. భయాన్ని వదిలి పెట్టమంటాడు.
చీకట్లో జడుసుకుంటే
ఒక చెట్టే చుట్టూరా
అరణ్యమై భయపెడుతుంది
గుండెంటూ కలిగుంటే
నీ వెంట అదే పెద్ద
సైన్యమై నిలుస్తుంది
అనిధైర్యాన్ని నూరిపోస్తాడు.
నిజం చెప్పలేని నాలికలని, పని చేయని చేతుల్నీ శాపనార్థాలు పెడతాడు.
నిజం చెప్పటానికీ తడిలేని నాలుకలు/మూసిన నోల్ల చీకటి గుహల్లోనే పడుండి/గొంతెండి చావనీ
చేతులుండీ/అటు యిటూ పీనుగుల్లా వేలాడితే/వాట్ని సాంతం నరికెయ్యటమే ధర్మం
నా దృష్టిలో ధనమదాంధుడే అడుక్కు తినే వాడు అని శ్రామికుల పక్షం వహిస్తాడు. "అలా సమాధిలా అంగుళం మేరకన్నా/ కదలకుండా పడుకుంటే ఎలా? /కొన్నాల్లు పోతే నీ మీద నానా గడ్డీ మొలిచి /నీ ఉనికే నీకు తెల్సి చావదు" అని మొట్టికాయలూ వేస్తూ పెను నిద్దరని ఒదిలించేస్తాడు. రాజకీయాలమీద ప్రభుత్వాలమీద విమర్శనాత్మక విసుర్లతో ఆకట్టుకుంటాడు. "మెతుకులేరుకోవటం మీ విధి /మీ కడుపులు నిండకుండా చూసే బాధ్యత మాది /మెడలు వంచి శ్రమించటం మీ ఖర్మం /మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించటం మా కర్తవ్యం /మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి/ మిమ్మల్ని పూడ్చిపెట్టే పూచీ మాది" అంటు వర్గ తత్వాలపై వ్యంగాస్త్రాలు ఎక్కుపెడతాడు.
ఇక అలతి అలతి పదాల్లో ఆయన ఇచ్చిన కవితా నిర్వచనాలు అధ్భుతంగా ఉంటాయి. "న్యాయం గాయమై సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు " అంటాడు. "చట్టమేర్పరిచిన అగాధం బోను" అని, "పోగేసిన శవాల గుట్ట వంటిది బ్యాలెట్ పెట్టె" అనీ, "ఆశ -విత్తనం లేకుండా పెరిగే మొక్క యొక్క శ్వాస"యని, "నిరాశ -నాభిలేని ఊబిలో దిగబడక ముందే పొందే ప్రయాస" అనీ చమత్కరిస్తాడు. ఇక ముఖ్యంగా చెప్పు కోవాల్సింది వేశ్య కవిత గురించి.
"తను శవమై
ఒకరికి వశమై
తనుపుండై
ఒకడికి పండై
ఎపుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై"
అని అలతి పదాల్లో చెప్పేసి 'ఔరా' అనిపిస్తాడు.
కానీ ఈ పుస్తకంలో కవితా చిత్రాల కు ముందు ఉన్న మాటలు మనకు అలిశెట్టి ప్రభాకర్ జీవితవిశేషాల్ని అందిస్తాయి. ఆయన ఎంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడో అర్థం అవుతుంది. "సానుభూతి పరులైతే మనిషికో దోసెడు మట్టేసి పోండి" అని ఆయన ఎందుకంటున్నాడో తెలియాలంటే జయధీర్ తిరుమలరావు గారి ముందు మాట చదివి తీరాలి. కనులని ద్వారాలుగా మలచుకోమని చెప్పిన వ్యక్తే, "ఆకలి మండి పోతున్నపుడు/ ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా దగ్ధమైపోవాల్సిందే" అంటున్నపుడు మనసు బాధతో నిండిపోతుంది. ఆయన కవిత, జీవితం వేరు కాదు అని తెలుసుకున్నపుడు దోపిడీ సమాజంలో, కళ కూడా ఒక దోపిడీ సాధనం అయిన సమాజంలో ఇలాంటి కవులు బతకడం కష్టమే అనిపిస్తుంది. అందుకేనేమో
"తొంభై తొమ్మిది మంది
చర్మాన్ని వొలిచి
నూరో వాడొక్కడే
పరుచుకునే తివాసీ
ఈదేశంలో
కళా పోషణ" అంటాడు.
కలమూ, కుంచే, జీవితమూ, కవిత్వమూ అన్నీ ఒకటే అయి అలిశెట్టి ప్రభాకర్ స్వేదంలా, అశ్రువుల్లా, రక్తంలా మనముందు ప్రవహిస్తాయి. మొత్తంగా మునకలు వేస్తేకాని తెలియదు ఆ లోతులు.
11/3/15
..............
అలిశెట్టి ప్రభాకర్
"అక్షర నక్షత్రమ్మీద..."
కవితా చిత్రాలు
ఒక విహంగ వీక్షణం - విరించి
.....................................
కొన్ని గీతల్ని పెన్నుతో గీస్తే అక్షరాలవుతాయి, అదే పెన్సిలుతో గీస్తే ఒక చిత్రమౌతుంది. అందంగా భావాలతో కవితలాగా అల్లిన అక్షరాలకి, ఒక చిత్రం ప్రతిబింబమయితే అది అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రమౌతుంది. "అక్షర నక్షత్రం మీద...కవితా చిత్రాలు" అనే ఈ పుస్తకంలో మనకు కనబడే కవితలూ వాటి చిత్రాలూ, సమాజాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకోడానికి గీసిన గీతలేమో అనిపిస్తుంటాయి. కానీ ఆ కవితా చిత్రాలని అర్థం చేసుకోడానికి మన కళ్ళు ద్వారాలుగా మారాల్సిందే. అపుడే హృదయం తేజోవంతమౌతుంది. ద్వారాలుగా మన కళ్ళు మారనపుడు మన ముందు కదిలే ఈ కవితా చిత్రాలు సైతం, తెల్ల గుడ్డ కప్పబడున్న శవాలుగా మిగిలిపోతాయంటాడు.
"కళ్ళు ద్వారాలైనప్పుడు/హృదయపు గదంత/తేజోవంతం కావాలి
అటువంటప్పుడే /జీవితాల్ని/క్షుణ్ణంగా పరిశోధించగలుగుతాం/లేదా
కనుగుడ్ల తెప్పలపై తేలిపోయే దృశ్యాలూ/తెల్లగుడ్డు కప్పబడుతున్న శవాలూ/రెండూ ఒకటే మరి."
కుంచెనీ కలాన్నీ నమ్ముకున్న వాడు కాబట్టి, ప్రభాకర్ సమాజాన్ని, ఆకలిని కూడా నమ్ముకున్నడేమో అమాయకంగా. అవి ఎప్పటిలాగే ఆయన్ని కూడా మోసం చేసాయి. కటిక దరిద్రంలోనే టీబీ వ్యాధితో చిన్న వయసులోనే మనల్ని వదిలి వెళ్ళిన ప్రభాకర్, నేటికీ తన కవితా చిత్రాలతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాడు. ఎంతటి ఆశ్చర్యం అంటే ఈనాటి సమాజాన్ని ఆయన అప్పుడే చూశాడా అన్నంతగా. కానీ తరచి చూస్తే, ప్రభాకర్ ఉన్నప్పటి కాలానికీ నేటికీ సమాజంలో పెద్దగా మార్పు యేమీ రాలేదనిపిస్తుంది.
ఈ కవిత చూడండి. ఇపుడు కూడా యువత ఇలాగే ఉంది. కాదంటారా.
వెండితెరపై /నువ్ వ్యభిచరిస్తున్నప్పుడో
క్రికెట్ క్రిమి/నీ మెదడుని తొలిచేస్తున్నప్పుడో
బురద రాజకీయాలు/నీ ముఖంనిండా/పులుముకున్నప్పుడో..తప్ప
లేనే లేదిక నువ్ బ్రతికున్న దాఖలా.
ఆయన చిత్ర కారుడి నుండి కవిగా ఎదగడానికి మధ్యన ఉన్న ఆలంబన సమాజమే, ప్రేరణ విప్లవ పోరాటాలూ ఆకలి బాధలే. శ్రీ శ్రీ, శివసాగర్, చేరబండ రాజుల కవిత్వాన్ని ఊపిరిగా పీల్చిన ప్రభాకర్, పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచే రెండూ ఉంటాయని ప్రకటించుకుంటాడు, అయినా తానొక ఉద్యమ దిశని సూచించే దిక్సూచినే అంటూ తన పరిధిని వ్యక్తపరుస్తాడు. అందుకే తన కవితలతో మనల్ని కుదిపి లేపుతాడు. భయాన్ని వదిలి పెట్టమంటాడు.
చీకట్లో జడుసుకుంటే
ఒక చెట్టే చుట్టూరా
అరణ్యమై భయపెడుతుంది
గుండెంటూ కలిగుంటే
నీ వెంట అదే పెద్ద
సైన్యమై నిలుస్తుంది
అనిధైర్యాన్ని నూరిపోస్తాడు.
నిజం చెప్పలేని నాలికలని, పని చేయని చేతుల్నీ శాపనార్థాలు పెడతాడు.
నిజం చెప్పటానికీ తడిలేని నాలుకలు/మూసిన నోల్ల చీకటి గుహల్లోనే పడుండి/గొంతెండి చావనీ
చేతులుండీ/అటు యిటూ పీనుగుల్లా వేలాడితే/వాట్ని సాంతం నరికెయ్యటమే ధర్మం
నా దృష్టిలో ధనమదాంధుడే అడుక్కు తినే వాడు అని శ్రామికుల పక్షం వహిస్తాడు. "అలా సమాధిలా అంగుళం మేరకన్నా/ కదలకుండా పడుకుంటే ఎలా? /కొన్నాల్లు పోతే నీ మీద నానా గడ్డీ మొలిచి /నీ ఉనికే నీకు తెల్సి చావదు" అని మొట్టికాయలూ వేస్తూ పెను నిద్దరని ఒదిలించేస్తాడు. రాజకీయాలమీద ప్రభుత్వాలమీద విమర్శనాత్మక విసుర్లతో ఆకట్టుకుంటాడు. "మెతుకులేరుకోవటం మీ విధి /మీ కడుపులు నిండకుండా చూసే బాధ్యత మాది /మెడలు వంచి శ్రమించటం మీ ఖర్మం /మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించటం మా కర్తవ్యం /మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి/ మిమ్మల్ని పూడ్చిపెట్టే పూచీ మాది" అంటు వర్గ తత్వాలపై వ్యంగాస్త్రాలు ఎక్కుపెడతాడు.
ఇక అలతి అలతి పదాల్లో ఆయన ఇచ్చిన కవితా నిర్వచనాలు అధ్భుతంగా ఉంటాయి. "న్యాయం గాయమై సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు " అంటాడు. "చట్టమేర్పరిచిన అగాధం బోను" అని, "పోగేసిన శవాల గుట్ట వంటిది బ్యాలెట్ పెట్టె" అనీ, "ఆశ -విత్తనం లేకుండా పెరిగే మొక్క యొక్క శ్వాస"యని, "నిరాశ -నాభిలేని ఊబిలో దిగబడక ముందే పొందే ప్రయాస" అనీ చమత్కరిస్తాడు. ఇక ముఖ్యంగా చెప్పు కోవాల్సింది వేశ్య కవిత గురించి.
"తను శవమై
ఒకరికి వశమై
తనుపుండై
ఒకడికి పండై
ఎపుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై"
అని అలతి పదాల్లో చెప్పేసి 'ఔరా' అనిపిస్తాడు.
కానీ ఈ పుస్తకంలో కవితా చిత్రాల కు ముందు ఉన్న మాటలు మనకు అలిశెట్టి ప్రభాకర్ జీవితవిశేషాల్ని అందిస్తాయి. ఆయన ఎంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడో అర్థం అవుతుంది. "సానుభూతి పరులైతే మనిషికో దోసెడు మట్టేసి పోండి" అని ఆయన ఎందుకంటున్నాడో తెలియాలంటే జయధీర్ తిరుమలరావు గారి ముందు మాట చదివి తీరాలి. కనులని ద్వారాలుగా మలచుకోమని చెప్పిన వ్యక్తే, "ఆకలి మండి పోతున్నపుడు/ ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా దగ్ధమైపోవాల్సిందే" అంటున్నపుడు మనసు బాధతో నిండిపోతుంది. ఆయన కవిత, జీవితం వేరు కాదు అని తెలుసుకున్నపుడు దోపిడీ సమాజంలో, కళ కూడా ఒక దోపిడీ సాధనం అయిన సమాజంలో ఇలాంటి కవులు బతకడం కష్టమే అనిపిస్తుంది. అందుకేనేమో
"తొంభై తొమ్మిది మంది
చర్మాన్ని వొలిచి
నూరో వాడొక్కడే
పరుచుకునే తివాసీ
ఈదేశంలో
కళా పోషణ" అంటాడు.
కలమూ, కుంచే, జీవితమూ, కవిత్వమూ అన్నీ ఒకటే అయి అలిశెట్టి ప్రభాకర్ స్వేదంలా, అశ్రువుల్లా, రక్తంలా మనముందు ప్రవహిస్తాయి. మొత్తంగా మునకలు వేస్తేకాని తెలియదు ఆ లోతులు.
11/3/15
No comments:
Post a Comment